India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధర్మవరం టౌన్ కేతిరెడ్డి కాలనీకి చెందిన రాజేశ్వరి (21) అను యువతి తన ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. రాజేశ్వరి పుట్టపర్తిలో సంస్కృతి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజేశ్వరి తండ్రి చిదంబరయ్య కూలి మగ్గం నేస్తారు. రాజేశ్వరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

అనంతపురం జిల్లా ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ గౌతమి చర్యలు తీసుకున్నారు. వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామానికి చెందిన చౌక దుకాణపు డీలర్ ఎస్.నాగరాజును శనివారం సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకూ 40 మంది వాలంటీర్లు, ఏడుగురు డీలర్లు, ఒక ఎండీయూ ఆపరేటర్, 11 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్కు గురైనట్లు తెలిపారు.

అనంత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనస్తీషియా వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండో పట్టణ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల మేరకు అమరాపురం మండలానికి చెందిన శ్రీజ (22) సాయినగర్ లోని వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది.యువతి వసతి గృహంలోని తన గదిలో అపస్మారక స్థితిలోపడి ఉండటం చూసిన నిర్వాహకులు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ విరాళాలతో కొంత భాగాన్ని ఆయా కంపెనీలు కొలువై ఉన్నచోట కొంతమేర ఖర్చు చేయాలని కలెక్టర్ పీ.అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నందు కియా కంపెనీ అనుబంధ సంస్థ Hyundai Mobis కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలలో రూ.44,13,436 విలువ గల పరికరాలు కలెక్టర్ పి.అరుణ్ బాబుకు అందజేశారు.

అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నట్లు సివిల్ విభాగాధిపతి బి.అజిత ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఎంటెక్ లేదా ఎంఈ చేసిన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు www.uconpt.com వెబ్ సైట్ ని సందర్శించాలని సూచించారు.

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 78 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింట్ మీడియా ద్వారా 78 ఫిర్యాదులు, జిల్లా కాల్ సెంటర్ నుంచి ఒక ఫిర్యాదు అందాయని, వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. ఇందులో 27 మంది వాలంటీర్లు, ముగ్గురు కాంట్రాక్టు, ఇద్దరు రెగ్యులర్, ఒక రేషన్ పై చర్యలు చేపట్టమన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ వైసీపీలో చేరారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా గుత్తి రోడ్ షోలో ఉన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ను నమ్ముకుని తాము తీవ్రంగా నష్టపోయామని పితాని బాలకృష్ణ అన్నారు. ముమ్మిడివరంలో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

రామగిరి మండలం కొత్తగాదిగకుంట గ్రామానికి చెందిన వైసీపీ జిల్లా కార్యదర్శి S.చిన్న పెద్దన్న శనివారం పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటూ అదే గ్రామానికి చెందిన బీజేపీ రామగిరి మండల కన్వీనర్ గొల్ల కృష్ణయ్య, వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సునీత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు.

మడకశిర పట్టణం ఎగువ అచ్చంపల్లి గ్రామ సమీపంలో సోమశేఖర్(45) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన సోమశేఖర్ తాగుడుకు బానిసై, కుటుంబ పోషణ భారమై, జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య సుబ్బలక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.

అంబికా లక్ష్మీ నారాయణ అంబికా గ్రూపు ఆఫ్ ఫార్మ్స్కు అధిపతి. బోయ సామాజిక వర్గానికి చెందిన ఈయన 2009లో సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. గత టీడీపీ హయాంలో అహుడా ఛైర్మన్గా ఉన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, వాల్మీకి సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మహర్షి వాల్మీకి భవన్ అధ్యక్షుడిగా, రోటర్ క్లబ్ సభ్యులుగా పనిచేశారు. తాజాగా అనంతపురం పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.