India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం సాధారణ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ఎం. గౌతమి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఈ నెల 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని అన్నారు.

అనంతపురం పట్టణానికి చెందిన అంజలి మృతిపై ముగ్గురిని అరెస్టు చేసినట్టు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బెల్దరి దస్తగిరి, బాలును అరెస్టు చేశామన్నారు. మృతురాలి కుటుంబీకులు వాంగ్మూలం ప్రకారం భర్తతో పాటు మరో ఇద్దరిపై విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు.

ధర్మవరం బీజేపీ MLA అభ్యర్థిగా ఖరారైన వై.సత్యకుమార్.. రాయలసీమలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. బళ్లారి, మదనపల్లె, బెంగళూరులో విద్యాభ్యాసం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీవైపు అడుగులు వేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ABVPలో కీలకంగా వ్యవహరించారు. 6 భాషలు మాట్లాడే సత్య.. BJP జాతీయ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. అప్పట్లో అధ్వానీ రథయాత్రలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

BJP ధర్మవరం MLA అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ సెక్రటరీ సత్యకుమార్ పోటీ చేయనున్నారు. 34 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నారు. మోదీ, అమిత్షాకు సన్నిహితుడిగా దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకునిగా పని చేసి BJPని గెలిపించారు. ఇలా అన్ని విధాల పేరు ప్రఖ్యాతలు ఉన్న సత్యకుమార్ గెలిస్తే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

అనంత: ఎన్నికల విధులు నుంచి 431 మంది ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. విధులు కేటాయించిన ఉద్యోగుల్లో గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలున్న వారికి మినహాయింపునకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల విధులకు 581 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. విచారణకు 372 మంది గైర్హాజయ్యారు. హాజరైన 209 మందిలో 186 మందికి మినహాయింపు ఇచ్చారు.

పుట్టపర్తి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్ నెలలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రక్రియ 3వ తేదీ నుంచి ఉంటుంది. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ నరసయ్య మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుందని, దీంతో 1వ తేదీ కాకుండా 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా వారిని చైతన్య పరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని సొమాలవాండ్ల పల్లిలో పాపయ్య నాయుడు(48)ను కొండయ్య నాయుడు రాళ్లతో కొట్టి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడటంతో హత్యకు దారితీసినట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బుక్కపట్నం మండల పరిధిలోని సిద్దరాంపురం గ్రామ సమీపన జరిగిన ఆటో ప్రమాదంలో సిద్దరాంపురం గ్రామానికి చెందిన విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం బుక్కపట్నంలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తిరిగి సిద్దరాంపురం వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కొత్తగా ఓటు హక్కు, మార్పులు చేర్పులు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి కొత్తగా వచ్చిన ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సత్యసాయి జిల్లాకు కొత్తగా 1,34,364 ఎపిక్ కార్డులు వచ్చాయని, వీటిని ఆయా నియోజకవర్గాల వారీగా విభజన చేసి తపాలా శాఖ ద్వారా చిరునామాలకు పంపుతున్నామన్నారు.

అనంతపురం జిల్లాలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు 3,074 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ తెలిపారు. మొత్తం 31,330 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 30,944 మంది, 5,057 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను 2,369 మంది హాజరయ్యారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.