India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని ఇద్దరు ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని కంబాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రామాంజనేయులు, కదిరి పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారని, వారిని సస్పెండ్ చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు.

అనంత :కేంద్ర ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు కోడ్ అమలు బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధిత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికలు అధికారి కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా, బస్టాండ్ రైల్వే స్టేషన్ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి రాజకీయ పరమైన హోర్డింగ్లు పోస్టర్స్ ఉన్న వెంటనే వాటిని తొలగించాలన్నారు.

గుమ్మగట్ట మండలం పూలుకుంట గ్రామం వాలంటీర్ హనుమంతు కర్ణాటక నుంచి 380 టెట్రా మద్యం ప్యాకెట్లు బైక్లో స్వగ్రామానికి తరలిస్తుండగా సరిహద్దు ప్రాంతంలో పట్టుకున్నట్టు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.9,800 నగదుతో పాటు బైక్, కర్ణాటక మద్యం సీజ్ చేసి అతడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు .

అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు పరీక్షలు విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీటెక్ మూడో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు అధికారులు ఆచార్య కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఎంఫార్మసీ మూడో సెమిస్టర్, ఫార్మాడీ ఒకటి, రెండు, మూడో సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశామన్నారు.

ఎద్దుల బండిని కారు ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. హిందూపురం వైపు నుంచి కొట్నూరు వెళుతున్న ఎద్దుల బండిని కారు ఢీకొని ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిలో ఉన్న ఒక యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.

జిల్లాలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. తదనుగుణoగా ఇతర రాష్ట్రాల నుండీ లిక్కర్, డబ్బు, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు జిల్లాలోకి రాకుండా కర్నాటక సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్ పోస్టులో నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలియజేశారు.

ఎన్నికల సంసిద్ధతపై సత్యసాయి కలెక్టర్ కార్యాలయ అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డీఆర్ఓ కొండయ్య తదితరులతో ఎన్నికల కమిషనర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

రొళ్ల మండలం కాకి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శివన్న, రాధమ్మ దంపతుల కుమార్తె మేఘన (19) మంగళవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రొళ్ల ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిరకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కూడేరు మండలం ఉదిరిపికొండ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని జల్లిపల్లి గ్రామానికి చెందిన పవన్ (22)గా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.