India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 25 ఏపీ మోడల్ స్కూల్లలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి 100 సీట్లు కేటాయించారు. మొత్తం 25 పాఠశాలల్లో 2500 సీట్లు గాను, 5137 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 21న ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హులైన వారికి సీట్లు కేటాయిస్తారు.

పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్లో మంటలు చెలరేగి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సజీవ దహనమైన విషయం తెలిసిందే. ప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పెద్దపప్పూరు మండలం తురకపల్లికి చెందిన నరేశ్గా గుర్తించారు. అయితే నరేష్ గుత్తిలో నివాసం ఉండేవాడు.

అనంతపురం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1.81 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. డీఈఓ వరలక్ష్మి పర్యవేక్షణలో 1వ తేదీ నుంచి అన్ని వసతులు కల్పించారు. డీఈఓ మాట్లాడుతూ.. అందరి సమష్ఠి కృషితోనే జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు, మూల్యాంకన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

శింగనమల నియోజవకవర్గంలో 1955 నుంచి 2019వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. 1999లో కె.జయరాం(టీడీపీ) 47198 ఓట్ల తేడాతో నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. 2019లో జొన్నలగడ్డ పద్మావతి(వైసీపీ) 46,242 ఓట్లతో గెలిచి రెండో స్థానంలో నిలిచారు. ఇలా..1983 కె.ఆనందరావు(టీడీపీ)18903, 1985లో కె.జయరాం(టీడీపీ) 14212 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీరూ తప్ప ఏ అభ్యర్థికి 10వేలకుపైగా మెజార్టీ రాకపోవడం గమనార్హం.

రాయదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై మారెంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 7.30 గంటలకు చోటు చేసుకుంది. గుమ్మగట్ట మండలం మారెంపల్లికి చెందిన శంకర్ అనే యువకుడు బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి మృతదేహాన్ిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఉరవకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్, ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పాల్గొన్నారు.

కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్రమ రవాణా చేయకుండా అడ్డుకట్ట వేయాలని ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. పర్యవేక్షణలో భాగంగా ఇవాళ డోనేకల్ విడపనకల్ చెక్పోస్టును తనిఖీ చేశారు. వెహికల్ మూమెంట్ రిజిస్టర్ పరిశీలించారు. వివిధ విషయాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని సిబ్బందికి తెలిపారు.

పెద్దవడుగూరు మండల పరిధిలోని అప్పేచెర్ల గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో బైక్లో మంటలు చెలరేగాయి. మంటల్లో బైకర్ సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను పగడ్బందీగా, పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో 299 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,561 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 299 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లాలో 923 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.