India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కంబదూరు మండలంలో భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కంబదూరు మండలం అండేపల్లి గ్రామ సచివాలయానికి సంబంధించిన అధికారులు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ జెండాను ఆవిష్కరించలేదు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు విషాద ఘటన చోటు చేసుకుంది. కనేకల్ మండలం మాళ్యం గ్రామానికి చెందిన రాజేశ్ ఈతకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి మృత్యువాత పడ్డాడు. చెరువులో మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు రోధించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కావేరి(27) అనే నిండు గర్భిణి విద్యుత్ షాక్కు గురై మృతిచెందింది. కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా మృతిచెందింది. పడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యాడికి మండలంలో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న విష్ణు భగవాన్కు భారత సేవా పురస్కార్, దేశ రత్న పురస్కార్ జాతీయ అవార్డులను కర్ణాటకలోని బెంగళూరులో అందుకున్నారు. బెంగళూరు ఎన్జీవో సంస్థ వెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో నాణేల సేకరణ, ప్రదర్శనలు నిర్వహించి కళలకు విశేషమైన సేవలు అందించినందుకు అందించారు. కానిస్టేబుల్ విష్ణును పోలీసు ఉన్నతాధికారులు, మండల అధికారులు అభినందించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అమడగూరు వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ వీసీ సుదర్శనరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జాయింట్ కలెక్టర్గా హరిత నియామకం రద్దుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ‘నేను చూసిన అత్యంత అవినీతిపరులైన అధికారులలో హరిత ఒకరు. తిరుపతి కార్పొరేషన్లో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో సూత్రధారి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె పోస్టింగ్ను ప్రభుత్వం రద్దు చేసిందా అన్న ప్రచారం జోరందుకుంది.
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా తన నివాసానికి జాతీయ పతాకాన్ని కట్టారు. అనంతరం జాతీయ జెండాతో సెల్ఫీ దిగారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ప్రదర్శించి జాతీయ ఐక్యతను చాటాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులను ఎప్పటికీ మరవకూడదని వారు చేసిన త్యాగాన్ని కొనియాడారు.
అనంతపురం జిల్లాలో పెద్దవడుగూరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ 1934 SEP 21న పర్యటించారు. బహిరంగసభలో ప్రసంగించగా చైతన్యవంతులై దేశభక్తి భావాలు కలిగిన కొందరు ప్రతిస్పందించారు. స్వాతంత్ర్య ఉద్యమం కోసం అప్పట్లోనే దాదాపు రూ.27 వేలు విరాళంగా అందజేశారు. చింతలచెరువుకు చెందిన భూస్వామి హంపమ్మ తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేయడంతో పాటు రూ.1,116ల నగదును గాంధీకి విరాళంగా ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో 16, 17, 18వ తేదీల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట ప్రధాన శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి బుధవారం ఓ తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు.. పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కాంక్రీటు భవనాల్లోనే ఆశ్రయం పొందాలని, చెట్ల కింద, కరెంటు పోల్ కింద ఉండకూడదని వారు సూచించారు.
Sorry, no posts matched your criteria.