India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంటర్ ఫలితాల్లో పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సత్తా చాటారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన యువతి బైపీసీ విభాగంలో 1000కి 984 మార్కులు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు వచ్చాయని గీతాంజలి తెలిపారు. అధ్యాపకులు, స్నేహితులు, బంధు మిత్రులు అభినందించారు.

ఇంటర్ ఫలితాల్లో పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సత్తా చాటారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన యువతి బైపీసీ విభాగంలో 1000కి 984 మార్కులు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు వచ్చాయని గీతాంజలి తెలిపారు. అధ్యాపకులు, స్నేహితులు, బంధు మిత్రులు అభినందించారు.

అనంతపురంలోని తేజ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని డైరెక్టర్ తేజరెడ్డి, ఛైర్పర్సన్ ఉమాదేవి తెలిపారు. సీనియర్ ఇంటర్లో అత్యధికంగా 991 మార్కులు, జూనియర్ ఇంటర్లో ఎంపీసీ 465, బైపీసీ 435 మార్కులతోపాటు మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఫలితాలపై కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.

పరిగి మండలం ధనాపురం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. రొద్దం మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన వారు ఆటోలో హిందూపురం కోటిపి చౌడమ్మ దేవస్థానానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని అనంతపురం జిల్లా యాడికి పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. స్థానికుల వివరాల మేరకు.. యాడికికి చెందిన గంజి శేఖర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్య సౌమ్యకు వీడియో పంపాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వీరన్న టెక్నాలజీని ఉపయోగించి ఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్య చేసుకోబోయిన గంజి శేఖర్ను కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అనంతపురం జిల్లా నేతలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు దక్కింది. 33 మందితో మాజీ సీఎం వైఎస్ జగన్ కమిటీని నియమించగా తలారి రంగయ్య, శంకర్ నారాయణ, శైలనాథ్, విశ్వేశ్వరరెడ్డిలకు చోటు కల్పించారు. మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.

అనంతపురం జిల్లా వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యను నియమిస్తూ.. వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ అధ్యక్షులు YS జగన్ శనివారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. తలారి రంగయ్యకు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

ఇంటర్ ఫలితాల్లో అనంత జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 19,541 మంది పరీక్షలు రాయగా 15,632 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో అనంత జిల్లా రాష్ట్రంలోనే 13వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 22,824 మందికి 14,439 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 17వ స్థానంలో జిల్లా నిలిచింది.

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేసిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్తో పాటు మరో ఆరుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మాధవ్ అతనిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవ్వాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.