Anantapur

News August 12, 2024

ప్రమాదాలకు నిలయంగా 44వ జాతీయ రహదారి

image

ఉమ్మడి అనంత జిల్లాలో 44వ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి మండలాల్లో పారిశ్రామికవాడ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కియా ఇండస్ట్రీయల్‌ ఏరియా పీఎస్ పరిధిలో 12, పెనుకొండ పీఎస్ పరిధిలో 14.. మొత్తం 26 ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.

News August 12, 2024

జీడిపల్లి రిజర్వాయర్‌కు ఆగిన నీటి ప్రవాహం

image

బెలుగుప్పు మండలంలోని రాగులపాడు పంప్ హౌస్‌లో తలెత్తిన సాంకేతిక కారణాలతో రెండు మోటార్లు ఆఫ్ చేశారు. దీంతో జీడిపల్లి రిజర్వాయర్‌కు ఆదివారం ఇన్ ఫ్లో ఆగినట్లు హంద్రీనీవా అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.263 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. సోమవారం నుంచి కృష్ణా జలాలను విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

News August 12, 2024

పురావస్తు ప్రదర్శన శాలను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురంలోని ఆదిమూర్తి నగర్‌లో ఉన్న జిల్లా పురావస్తు శాఖ ప్రదర్శనశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. జిల్లా పురావస్తు శాఖ అధికారులు పురావస్తు శాఖలో ఉన్న విషయాల గురించి, చరిత్రకు సంబంధించిన అంశాల గురించి కలెక్టర్‌కు వివరించారు. సుమారు గంటపాటు కలెక్టర్ పురావస్తు శాలలోని అన్ని విభాగాలను పరిశీలించారు.

News August 11, 2024

రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం సోమవారం నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రాలలోనూ సంబంధిత అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.

News August 11, 2024

అనంత: 38 మంది ఎంపీడీఓలకు పోస్టింగులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 38 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు స్థానాలు కేటాయిస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఇన్‌ఛార్జ్ జడ్పీ సీఈఓ ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో అనంతపురం జిల్లాలో 17 మందికి, శ్రీ సత్యసాయి జిల్లాలో 21 మందికి స్థానాలు కేటాయించారు. అయితే ఎన్నికల ముందు పనిచేసిన స్థానాల్లో వారు చేరాలని పేర్కొన్నారు.

News August 11, 2024

ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అధికారిక సమావేశమేనా?: విజయ్ భాస్కర్

image

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించడానికి టీచర్ల సంఘాలతో ఆదివారం టీడీపీ ఎమ్మెల్సీలు ఎన్జీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రశ్నించారు. ఈ మేరకు అనంతపురంలో విజయ్ మాట్లాడుతూ.. ఈ సమావేశం అధికారిక సమావేశమా? లేక అనధికారిక సమావేశమా? అనే విషయం ప్రకటించాలని అన్నారు.

News August 11, 2024

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా

image

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్‌ను పంపాలని సీఎం వారికి సూచించారు.

News August 11, 2024

శ్రీవారిని దర్శించుకున్న ఎస్పీ మురళీకృష్ణ

image

అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎస్పీ మురళీకృష్ణ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి ఎస్పీకి వివరించారు. తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫొటోలు అందించారు. అర్బన్ సీఐ సురేశ్ బాబు ఉన్నారు.

News August 10, 2024

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం మత స్వేచ్ఛకు విరుద్ధం: సీపీఐ

image

మత స్వేచ్ఛకు విరుద్ధంగా కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ అన్నారు. ఆయన శనివారం ఉరవకొండ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వన్నూరుస్వామి, ప్రసాద్, మల్లేశ్, చిన్న రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

News August 10, 2024

అనంత: ఆటో డ్రైవర్ సూసైడ్

image

అప్పుల బాధ తాళలేక పామిడికి చెందిన ఆదినారాయణ అనే ఆటో డ్రైవర్ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తలవాల కాలనీకి చెందిన ఆదినారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. అయితే అప్పులు అధికమయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.