Anantapur

News August 9, 2024

తాడిపత్రి: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

తాడిపత్రి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని వడ్లపాలెం వీధికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసులు పెళ్లి కాలేదన్న మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 9, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి సవిత

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొననున్నారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 15వ తేదీ జరిగే జాతీయ పతాక ఆవిష్కరణకు మంత్రి సవిత ముఖ్యఅతిథిగా హాజరవుతారని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News August 9, 2024

అనంత: 21 మంది సీఐల బదిలీ

image

అనంతపురం రేంజ్ పరిధిలో 21 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు సీఐలను బదిలీ చేస్తూ శుక్రవారం అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం 41 మంది సీఐలను బదిలీ చేయగా.. ఈ రోజు మరో 21 మందికి స్థానచలనం కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు డీఐజీ కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

News August 9, 2024

వర్షంలోనే కెనాల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

శింగననమల నియోజకవర్గంలో కాలువల ద్వారా నీటిని అందించేందుకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక దృష్టి పెట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె నియోజకవర్గంలోని హెచ్ఎల్సీ కాలువను పరిశీలించారు. క్షేత్రస్థాయికి వెళ్లి శిథిలావస్థకు చేరుకున్న కాలువలను స్వయంగా పరిశీలించారు. గార్లదిన్నె నుంచి పుట్లూరు చివరి వరకు నీరు వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు చేయాలని అధికారులకు సూచించారు.

News August 9, 2024

హిందూపురంలో ట్యాంకర్ ఢీకొని బాలుడి మృతి

image

హిందూపురం పట్టణ పరిధిలోని మోడల్ కాలనీలో వాటర్ ట్యాంకర్ ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మోడల్ కాలనీలో నివాసముంటున్న బాబ్జాన్ కుమారుడు జునైద్(2) ఆడుకుంటుండగా ట్యాంకర్ ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 9, 2024

SMC Elections: అనంత.. 29, సత్యసాయిలో 10 చోట్ల వాయిదా

image

★ అనంతపురం జిల్లాలో 1741 పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 971 పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికవగా 741 చోట్ల ఎన్నికలు జరిగాయి. కోరం లేక 29 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
★ సత్యసాయి జిల్లాలో 2065 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2055 కమిటీలను ప్రశాంత వాతావరణంలో ఎన్నుకున్నారు. కోరం లేక 10 చోట్ల వాయిదా పడ్డాయి.

News August 9, 2024

రాయదుర్గం మీదుగా నడిచే మూడు రైళ్లు రద్దు

image

రాయదుర్గంలోని రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థను మార్చేందుకు నేడు రాయదుర్గం మీదుగా ప్రయాణించే 3 రైళ్లను రద్దు చేసినట్లు నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్ ముఖ్య సమాచార అధికారి డాక్టర్ మంజునాథ్ తెలిపారు. చిక్కజాజూరు-గుంతకల్లు, హొస్పేట -బెంగళూరు మధ్య ప్రయాణించే 3 రైళ్లు రాయదుర్గం మీదుగా కాకుండా హొస్పేట, అమరావతి కాలనీ, దావణగెరె, చిక్కజాజురు మార్గంలో వెళ్తాయన్నారు.

News August 9, 2024

అనంతపురం రేంజ్ పరిధిలో 41 మంది సీఐల బదిలీ

image

అనంతపురం రేంజ్ పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోసీ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న 41 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వెంటనే తమకు కేటాయించిన స్థానాలలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.

News August 9, 2024

కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి: అనంత కలెక్టర్

image

ఇళ్ల నిర్మాణాలను వెంటనే మొదలుపెట్టి, శుక్రవారం నుంచి పనుల్లో పురోగతి చూపించాలని అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. 100 రోజుల్లో 5 వేల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యం కేటాయించిందని అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు పనిచేసి కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News August 8, 2024

అనంత: రైలు కింద పడి రైల్వే కూలి ఆత్మహత్య

image

గుత్తి జీఆర్‌పీ పరిధిలోని రాయలచెరువు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలి (ప్యాకింగ్ మిషన్ కూలి) మనోహర్(23) గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ ఎస్ఐ నాగప్ప చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మనోహర్ కొన్ని రోజులుగా గుత్తి జీఆర్‌పీ పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.