India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి అనంత జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయిస్తూ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తి-తాడిపత్రి 67వ జాతీయ రహదారికి రూ.15 కోట్లు, NH42 రాప్తాడు-బత్తలపల్లి మధ్య రూ.15 కోట్లు, NH42 కళ్యాణదుర్గం- మోలకమురు మధ్య రూ.29 కోట్లు, మరిన్ని రోడ్లకు నిధులు మంజూరు చేసింది.
వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేసిన పైలా నరసింహాయ్య నేడు బీజేపీలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు పురందీశ్వరి సమక్షంలో కండువా కప్పుకున్నారు. కాగా, వ్యక్తిగత కారణాల వల్లే వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు నిన్న ఆయన ప్రకటించారు.
అర్హులందరూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంప్రదాయ చేతివృత్తులలో పనిచేసే వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించే పని చేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.
హిందూపురం డీఎస్పీగా కేవీ మహేశ్ను ప్రభుత్వం నియమించింది. డీఎస్పీల బదిలీల్లో భాగంగా పశ్చిమ గుంటూరులో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కేవీ మహేశ్ ఇక్కడికి కేటాయించింది. అనంతపురం రూరల్లో డీఎస్పీ బీ.వెంకటశివారెడ్డిని పోలీస్ హెడ్ క్వాటర్స్కు బదిలీ చేసింది. కాగా ఇటీవల నెల్లూరు నుంచి శ్రీనివాసులు పెనుకొండ డీఎస్పీ వచ్చారు.
ఎన్నికల ముందు ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఎంపీడీవోలను సొంత జిల్లాకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని 38 మంది ఎంపీడీవోలను కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు బదిలీ చేసింది. తక్షణమే గత స్థానాలకు ఎంపీడీవోలు బదిలీ కావాలని ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 23 మంది, కడప జిల్లా నుంచి 15 మంది సొంత జిల్లాకు రానున్నారు.
గుంతకల్లు రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో గుంతకల్లు బళ్లారి సెక్షన్ బంటనహల్ రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి(40) బలవన్మరణానికి పాల్పడినట్లు రైల్వే ఏఎస్ఐ రామదాసు తెలిపారు. అతను ట్రాక్పై పడుకోవడంతో రైలు వెళ్లినప్పుడు శరీరం నుంచి తల వేరయిందన్నారు. ఇతని వద్ద గుంతకల్లు నుంచి హుబ్లీకి వెళ్లే రైలు టికెట్, తిరుపతి లడ్డూ కవర్ ఉన్నాయని తెలిపారు. మృతుడి పేరు, ఇతర వివరాలు తెలియరాలేదన్నారు.
NMMS పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం డీఈఓ బీ.వరలక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ, కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3.5 లక్షల లోపు ఉన్న వారు అర్హులని స్పష్టంచేశారు. వివరాలకు www.bse.ap.gov.in వెబ్సైట్లో సందర్శించాలని సూచించారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరానికి చెందిన ప్రముఖ చేనేత డిజైనర్ నాగరాజును శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ శాలువా కప్పి సన్మానించారు. బుధవారం పుట్టపర్తిలో జాతీయ చేనేత దినోత్సవ సభలో కలెక్టర్ డిజైనర్ నాగరాజును అభినందించి మరిన్ని కళాత్మక ఖండాలను పట్టుచీరలపై తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత శాఖ ఏడీ రమేశ్ పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు పకడ్బందీగా జరగాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎస్పీ మురళీకృష్ణ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, అధికారులు హాజరయ్యారు. వారు మాట్లడుతూ.. పెండింగ్ లోఉన్న కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
గోరంట్ల మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కృష్టప్ప అనే వ్యక్తి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తీసుకువస్తూ పట్టుబడ్డారు. అప్పటి గోరంట్ల సీఐ జయనాయక్ బెంగళూరు విస్కీ 48 టెట్రా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎస్సై సుబ్బరాయుడు, కానిస్టేబుల్ కరుణాకర్ పెనుకొండ కోర్టులో ప్రవేశపెట్టగా వాదనలు విన్న కోర్టు రూ.2 లక్షలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తెలిపారు.
Sorry, no posts matched your criteria.