India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్-2026 పోస్టర్ను కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు రషీద్ బాషా మాట్లాడుతూ.. ఏడేళ్లుగా అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. షార్ట్ ఫిలిం తీసిన వారి ప్రతిభను గుర్తించే విధంగా స్క్రీనింగ్ చేసి, అందులో ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ పొందిన వారికి అవార్డులను అందిస్తామన్నారు.

మధురైలో ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ డిసెంబర్ 30న ఐదో సారి నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ బిలో 1800 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా 1,245 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అనంతపురం జిల్లా క్రీడాకారిణి శ్రీహ 9కి 7 పాయింట్లతో ఓపెన్ విభాగంలో 21వ స్థానాన్ని సాధించింది. గురువారం కోచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీహ ప్రపంచ స్థాయి టోర్నమెంట్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచిందన్నారు.

అనంతపురం శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సాయంత్రం
నిర్వహించిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జానపద గేయాలు, నృత్య ప్రదర్శనలను నిర్వహించినట్లు పరిపాలనాధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. శిల్పారామానికి వచ్చిన వీక్షకుల్లోని చిన్నారులు నృత్య ప్రదర్శన ఇచ్చారన్నారు. ఈ వేడుకలో సుమారు 5,000 మంది పాల్గొన్నారన్నారు.

గుంతకల్లులోని పారిశ్రామిక వాడ సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బైక్పై వెళ్తున్న అతను ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలోని కొందరు బేకరీ షాపుల యజమానులు చేతివాటం ప్రదర్శించారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేపట్టగా తూకాల్లో మోసం వెలుగు చూసింది. 1 కిలో కేక్కి 200 గ్రాములు తగ్గింది. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లులో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కణేకల్లులోని 2 షాపుల్లో రూ.20 వేలు, ఉరవకొండలో 4 షాపుల్లో రూ.41వేలు, విడపనకల్లులో 3 షాపుల్లో రూ. 27వేలు జరిమానా విధించారు.

న్యూ ఇయర్ అంటేనే ఒకప్పుడు చిన్నారులు, యువత గ్రీటింగ్ కార్డ్స్తో సందడి చేసేవారు. దుకాణాల్లో ఛార్ట్స్ కొని ఫ్రెండ్స్కు అందించి విషెస్ చెప్పి ఆనందంగా గడిపేవారు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అన్నట్లు ఫీలైనవారు ఎంతోమంది. తమకు ఇష్టమైన నటీనటులు, ఫ్లవర్స్ వంటి కార్డులు కొనేవారు. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..!

న్యూ ఇయర్ అంటేనే ఒకప్పుడు చిన్నారులు, యువత గ్రీటింగ్ కార్డ్స్తో సందడి చేసేవారు. దుకాణాల్లో ఛార్ట్స్ కొని ఫ్రెండ్స్కు అందించి విషెస్ చెప్పి ఆనందంగా గడిపేవారు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అన్నట్లు ఫీలైనవారు ఎంతోమంది. తమకు ఇష్టమైన నటీనటులు, ఫ్లవర్స్ వంటి కార్డులు కొనేవారు. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..!

న్యూ ఇయర్ అంటేనే ఒకప్పుడు చిన్నారులు, యువత గ్రీటింగ్ కార్డ్స్తో సందడి చేసేవారు. దుకాణాల్లో ఛార్ట్స్ కొని ఫ్రెండ్స్కు అందించి విషెస్ చెప్పి ఆనందంగా గడిపేవారు. కార్డులు ఇవ్వకపోతే కొత్త ఏడాది రానట్టే అన్నట్లు ఫీలైనవారు ఎంతోమంది. తమకు ఇష్టమైన నటీనటులు, ఫ్లవర్స్ వంటి కార్డులు కొనేవారు. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ గ్రీటింగ్సే దిక్కయ్యాయి. మరి ఆ కార్డుల అనుభూతి మీరు పొందారా? కామెంట్ చేయండి..!

అనంతపురం జిల్లాలో లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 12,326 కేసులు పరిష్కారమైనట్లు SP జగదీష్ బుధవారం వెల్లడించారు. వివిధ కేసుల్లో 61 మందికి శిక్షలు పడ్డాయన్నారు. నిబంధనల ఉల్లంఘనపై రూ.1.35 లక్షల ఈ-చలానాలు విధించి రూ.3.93 కోట్ల జరిమానా వసూలు చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. డయల్ 100 ద్వారా కేవలం 12 నిమిషాల్లో స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నట్లు SP వివరించారు.

* 2024తో పోలిస్తే 2025లో నేరాలు 22.5 శాతం తగ్గుదల
* కేసులు 8,841 నుంచి 6,851కు తగ్గుముఖం
* 55 శాతం చోరీ కేసులు రికవరీ
* జిల్లాలో 42 హత్యలు
* గణనీయంగా తగ్గిన మహిళలపై నేరాలు, పోక్సో కేసులు
* మిస్సింగ్ కేసుల్లో 613 మంది సురక్షితం
* 9 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
* 544 నుంచి 496కు తగ్గిన ప్రమాదాలు
* 22 మందికి గంజాయి కేసుల్లో జైలు శిక్ష పడేలా చర్యలు
Sorry, no posts matched your criteria.