India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో బుధవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు.
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కేంద్ర ప్రభుత్వంలో అరుదైన అవకాశం లభించింది. కేంద్రంలోని ఓబీసీ కమిటీలో సభ్యుడిగా, నలుగురు సభ్యులు ఉండే సెంట్రల్ సిల్క్ బోర్డులో సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దక్షిణాది రాష్ట్రాల నుండి అంబికా లక్ష్మీనారాయణ ఒక్కడికే ఈ అవకాశం లభించింది. దీంతో ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది
ఉరవకొండ : మండలంలోని నెరిమెట్ల గ్రామానికి చెందిన హనుమంతు అనే రైతు ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిఎల్ఎస్ఏగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఎల్ఎస్ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్ 2 ఓసి మహిళలకు కేటాయించామన్నారు. అటెండర్ పోస్టులు జనరల్ 1, ఓసి మహిళకు 1 చొప్పున పరుగు సేవల కింద కేటాయించామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రానున్న ఐదు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 32.6 నుంచి 34.8° ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రతలు 24.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. పంటలు సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గార్లదిన్నె మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసులు వివరాల మేరకు.. కల్లూరు హైవే పక్కన ఆగి ఉన్న ఆటోను టమోటా లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో కేశవపురం గ్రామానికి చెందిన శివ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలోని మరో ఇద్దరు టీ తాగేందుకు వెళ్లగా ప్రాణాలతో బయట పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్ను పొందేందుకు అనంతపురం కలెక్టరేట్ ముస్తాబవుతోంది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ను హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం సందర్శించింది. గ్లోబల్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ సర్వీసెస్ సంస్థకు చెందిన లీడ్ ఆడిటర్, కేఎస్ఎన్ ప్రసాద్, ఆడిటర్ రాజేశ్, కో-ఆడిటర్ సింగయ్య బృందం కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు.
సీఎం, ఉప ముఖ్యమంత్రులతో అనంతపురం కలెక్టర్, ఎస్పీ మంగళవారం సమావేశమయ్యారు. అమరావతి రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ కేవీ మురళీకృష్ణ సమావేశమయ్యారు. అనంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
టీడీపీ నేత జేసీ పవన్రెడ్డి ఏసీఏ (ఆంధ్ర క్రికెట్ సంఘం) పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో చోటు సాధించాలని పవన్రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏసీఏలో అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు తెలిసింది. అయితే జిల్లా అసోసియేషన్లన్నీ ఎంపీ కేశినేని చిన్నీని ఏసీఏ ఛైర్మన్గా కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు SEP 8న ACA నూతన కార్యవర్గం ఎన్నిక జరగనుంది.
అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఫైనలియర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి వీరు మెకానికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో గొడవకు దిగారు. ఒక విద్యార్థిని గాయపరిచారు. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చర్యలు తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.