India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రావణ మాసంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దేవాలయాల సందర్శనకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 31వరకు ప్రతి మంగళవారం, శనివారం జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర డిపోల నుంచి మురడి, నేమకల్లు, కసాపురం మూడు ఆలయాలను కలుపుతూ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
☞అనంతలు రైతు బజార్ ను తనిఖీ చేసిన కలెక్టర్ వినోద్☞ తాడిపత్రిలో ఘనంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామికి అన్నాభిషేకం☞ పామిడిలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి☞ అనంత జిల్లాకు చేరిన కృష్ణా జలాలు☞తాడిపత్రి ప్రజలకు 4 ప్రశ్నలు వేసిన జేసీ ☞ యాడికిలో రైలులో నుంచి జారిపడి యువకుడు మృతి☞అనంతలో స్కూల్ కరస్పాండెంట్ అరెస్ట్☞జిల్లాలో72 మంది ఉద్యోగులకు నోటీసులు
హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూముకుంట సమీపంలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిని గంగాధర్ అనే వ్యక్తి హత్య చేసి పెన్నా నది ఒడ్డున పాతిపెట్టిన సంఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని సంఘటనా స్థలానికి తీసుకెళ్ళి విచారించారు. చిన్నారి హత్యకు కారణమైన వ్యక్తి ఇప్పటికే రెండు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది.
★ గుండుమల గ్రామంలో ఓబుళమ్మ, రామన్న అనే వృద్ధుడికి పింఛన్ పంపిణీ
★ ఓబుళమ్మకు ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశం
★ రామన్న కుమారుడికి స్థానికంగా ఉద్యోగ అవకాశం
★ డ్రిప్ ఇరిగేషన్ పథకం త్వరలో ప్రారంభం
★ వర్షంలోనే సీఎం 45 నిమిషాల ప్రసంగం
★ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వినతి.. మడకశిర నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి హామీ
★ సీపీఐ నాయకుల ముందస్తు అరెస్ట్.. లోకేశ్ క్షమాపణ
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 72 మంది అధికారులకు కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిన్న ఉదయం 9 గంటలు అవుతున్నప్పటికీ పింఛన్ పంపిణీ ప్రారంభించకపోవడంతో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. 2న తమ తమ శాఖల హెడ్కు వివరణ తప్పకుండా ఇవ్వాలని, లేకపోతే నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతపురం పట్టణ పరిధిలోని స్థానిక కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా ధర గరిష్ఠంగా రూ.27తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం 2100 టన్నుల టమోటా దిగుబడులు వచ్చాయన్నారు. కిలో సరాసరి ధర రూ.17, కనిష్ఠ ధర రూ.13 పలికినట్లు వివరించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, కదిరితో పాటు మండల కేంద్రాలలో స్థిరమైన ధరలకు నిత్యవసర వస్తువులు అందిస్తున్నామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కెర, బియ్యం మిల్లుల యజమానులతో చర్చించి నాణ్యమైన నిత్యావసర వస్తువులు స్థిరమైన ధరలకు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని వినియోగదారులు వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని గుండుమలలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించిన విషయం తెలిసిందే. ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు పలువురు చంద్రబాబుతో కలిసి ఫొటో దిగేందుకు పోటీపడ్డారు. సీఎం తమ గ్రామానికి వచ్చి గ్రామ వీధుల్లో తిరుగుతుండటంతో హర్షం వ్యక్తంచేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘మమ్మల్ని క్షమించండి కామ్రేడ్. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు తమ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. 5 ఏళ్ల పరదాల ప్రభుత్వం పోయినా కొంతమంది పోలీసుల తీరు మారలేదు’ అంటూ Xలో పోస్టు చేశారు.
మడకశిర నియోజకవర్గంలో సీఎం పర్యటన విజయవంతమైందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రజా ప్రతినిధులు, కానీ శాఖల అధికారుల సహకారంతో పర్యటన విజయవంతం అయిందన్నారు.
Sorry, no posts matched your criteria.