Anantapur

News February 14, 2026

అనంతపురం: ‘మాతా, శిశు మరణాలు నివారించాలి’

image

అనంతపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా జరగరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్, డిసెంబర్-2025 త్రైమాసిక సమీక్షలో 6 మాతృ మరణాలపై కూలంకషంగా చర్చించారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు పూర్తి పర్యవేక్షణ, టీనేజ్ గర్భధారణ నియంత్రణ, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు.

News February 14, 2026

అనంతపురం: ‘మాతా, శిశు మరణాలు నివారించాలి’

image

అనంతపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా జరగరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్, డిసెంబర్-2025 త్రైమాసిక సమీక్షలో 6 మాతృ మరణాలపై కూలంకషంగా చర్చించారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు పూర్తి పర్యవేక్షణ, టీనేజ్ గర్భధారణ నియంత్రణ, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు.

News February 14, 2026

అనంతపురం: ‘మాతా, శిశు మరణాలు నివారించాలి’

image

అనంతపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా జరగరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్, డిసెంబర్-2025 త్రైమాసిక సమీక్షలో 6 మాతృ మరణాలపై కూలంకషంగా చర్చించారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు పూర్తి పర్యవేక్షణ, టీనేజ్ గర్భధారణ నియంత్రణ, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు.

News February 14, 2026

అనంతపురం: ‘మాతా, శిశు మరణాలు నివారించాలి’

image

అనంతపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా జరగరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్, డిసెంబర్-2025 త్రైమాసిక సమీక్షలో 6 మాతృ మరణాలపై కూలంకషంగా చర్చించారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు పూర్తి పర్యవేక్షణ, టీనేజ్ గర్భధారణ నియంత్రణ, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు.

News February 13, 2026

ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.

News February 13, 2026

ఈ నెల 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

image

అనంతపురం జిల్లాలో ఫిబ్రవరి 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. 1-19 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. 1-2 ఏళ్ల వారికి సగం మాత్ర, 2-19 ఏళ్ల వారికి 400 మి.గ్రా మాత్ర భోజనం తర్వాత ఇవ్వాలన్నారు. మిస్ అయిన వారికి ఫిబ్రవరి 24న మాప్-అప్ నిర్వహించనున్నారు.

News February 13, 2026

‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

image

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

News February 13, 2026

అనంతపురం జిల్లాలో పదోన్నతులు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల యూనిట్ నుంచి ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా ఐదుగురికి కలెక్టర్ ఆనంద్ పదోన్నతి కల్పించినట్లు DPO నాగరాజు నాయుడు తెలిపారు. పదోన్నతి పొందిన ఐదుగురు ఉద్యోగులకు త్వరలోనే పంచాయతీలు కేటాయిస్తామన్నారు.

News February 12, 2026

110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాల పంపిణీ

image

110 మంది గ్రామ రెవెన్యూ (గ్రేడ్-II) అధికారులు గ్రేడ్-Iగా పదోన్నతి పొందినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో 110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలన్నారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించి లక్ష్యసాధనలో సత్ఫలితాలు సాధించాలన్నారు.

News February 12, 2026

మాజీ సీఎంసంజీవయ్య జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 14న ఏపీ తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14న ఉదయం 10:30 గంటలకు రెవెన్యూ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం కలెక్టర్ పిలుపునిచ్చారు.