India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మాగేచెరువుకు చెందిన గంగాధర్కు మూడు నెలల క్రితం ఇన్స్టాలో తెలంగాణలోని జగిత్యాలకు చెందిన అనూష పరిచయమైంది. తరచూ ఇన్స్టాలో మాట్లాడుకునే వారి మధ్య ప్రేమ చిగురించింది. శుక్రవారం ఆమె సోమందేపల్లికి చేరుకుని తాను ఇష్టపడిన గంగాధర్ను పెళ్లి చేసుకుంది. తొలుత వీరి పెళ్లికి ఇద్దరి తరఫున పెద్దలు అంగీకరించలేదు. గ్రామస్థులు అండగా ఉంటామని భరోసానివ్వడంతో వివాదం సద్దుమణిగింది.
జిల్లా ఎస్పీ పి.జగదీశ్ జిల్లాలోని పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బదిలీలు, సస్పెన్సన్ రీఓక్, ఇతర సమస్యలపై సిబ్బంది 8 పిటిషన్లు అందజేశారు. అర్జీలకు సర్వీస్ రూల్స్ ప్రకారం పరిష్కారం చూపాలని ఎస్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణమూర్తి, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కు.. అవినీతిలో ముందుకు వెళ్లిందని విమర్శించారు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం అందలేదని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా మట్టి, ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
కూటమి పాలనలో సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కు.. అవినీతిలో ముందుకు వెళ్లిందని విమర్శించారు. ఖరీఫ్ ముగిసి రబీ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం అందలేదని అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా మట్టి, ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
రెండు రోజుల క్రితం అనంతపురంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కూడేరు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ మేరకు కడప ఆర్జేడీ గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారని పేర్కొర్నారు. గోటుకూరు వద్ద గల వెరీ డైన్ ఏ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం నుంచి లంచం డిమాండ్ చేశాడనే కారణంతో సస్పెండ్ చేశామన్నారు.
వంద రోజులు, వార్షిక, ఐదేళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. 2024 నుంచి 2029 వరకు ఒక విజన్తో కూడిన నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి శాఖ వికసిత 2047 లక్ష్యసాధనలో నిర్ణాయక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇసుక పాయింట్ల వద్ద నుంచి ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ఉచిత ఇసుక కోసం ప్రజలు ఆన్లైన్లో సులభతరంగా నమోదు చేసుకుని ప్రక్రియను క్రమబద్ధమైన రీతిలో రూపొందించామన్నారు.
ధర్మవరంలో ముంబై పోలీసులమని చెప్పి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరం ఒకటో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నరేశ్ గోయల్ అనే వ్యక్తి రూ.500 కోట్లు బ్యాంక్లో రుణం తీసుకుని మీ ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.
అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవనంలో సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరగగా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, శింగనమల, తాడిపత్రి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో అన్ని సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
Sorry, no posts matched your criteria.