Anantapur

News August 22, 2025

గణేశ్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోండి: ఎస్పీ

image

అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా గణేశ్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ పి.జగదీశ్ తెలిపారు. జిల్లాలో వినాయక ఉత్సవాల అనుమతుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ganeshutsav.net అనే వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాలని సూచించారు. అనుమతి పత్రంలో సూచించిన నిబంధనలను తప్పక పాటించాలన్నారు.

News August 21, 2025

‘అనంతపురం ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు’

image

ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యే వర్గీయులు తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, ఆడియో కాల్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ధనుంజయ నాయుడు ఆరోపించారు. దగ్గుబాటి ప్రసాద్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని, ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

News August 21, 2025

డీసీఎంఎస్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ

image

రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కళ్యాణదుర్గంలోని డీసీఎంఎస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. నిల్వ ఉన్న ఎరువులు, రికార్డులు పరిశీలించారు. ఎరువుల పంపిణీలో నిబంధనలు పాటించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News August 20, 2025

పోలీసు శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రాన్ని ఎస్పీ జగదీశ్ బుధవారం సందర్శించారు. త్వరలో కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభించనున్నారు. శిక్షణకు హాజరయ్యే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పించాల్సిన అధికారులను ఆదేశించారు. సూచనలు చేశారు. అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News August 20, 2025

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

image

అనంతపురంలోని జేఎన్టీయూ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)ను కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఇంక్యుబేటర్లు నుంచి, స్కిల్ డెవలప్మెంట్, మార్కెట్ లింకేజీ తదితర సౌకర్యాలను ఆర్టీఐహెచ్ అందిస్తుంది. విద్యార్థులు అందించే నూతన ఆవిష్కరణలకు, ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తారని వివరించారు.

News August 20, 2025

విజయవాడకు చేరిన అనంత అర్బన్ గ్రూప్ పంచాయతీ

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని నేతల పంచాయతీ విజయవాడకి చేరింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కలిసి చర్చించారు. అనంతపురం అర్బన్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మధ్య జరుగుతున్న రాజకీయ పరిమాణాలపై చర్చించారు. అసలు గ్రూపు రాజకీయాలేంటంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

News August 19, 2025

గుత్తి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

గుత్తి మండలం జక్కలచెరువు గ్రామానికి చెందిన సురేష్(32) అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం సండూరు తాలూకా దారోజికి చెందిన సురేష్ బతుకు తెరువు కోసం 2 నెలల కిందట జక్కలచెరువుకు వచ్చాడు. కడుపునొప్పి తాళలేక ఈనెల 17న యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని అనంతపురం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News August 19, 2025

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర నిర్వహించాలి: కలెక్టర్

image

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలలో యాక్టివిటీలను నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీ సెక్టార్ తదితర అంశాలపై DWMA PD, ZP CEO, ఆర్డీఓలు, డీఎల్డీఓలు, MPDO, EORD తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.

News August 19, 2025

ఉపాధి హామీ పనుల్లో పురోగతి తీసుకురావాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పనుల్లో కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పురోగతి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం పనులు, హౌసింగ్ తదితర అంశాలపై డ్వామా, హౌసింగ్ పీడి, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఏపీఎంలకు వీటిపై పలు సూచనలు చేశారు.

News August 18, 2025

ఎస్కేయూలో సీట్ల అలాట్‌మెంట్

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో యూనివర్సిటీ అధికారులు సోమవారం సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియ చేపట్టారు. ఇటీవల 2 కౌన్సెలింగ్‌లలో సీట్లు కేటాయించడంతో అలాట్మెంట్ ఆర్డర్‌తో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సీట్ల అలాట్‌మెంట్‌కి హాజరయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, సిబ్బంది ధ్రువ పత్రాలను పరిశీలించారు.