India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో మూడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని, వీటికి ప్రాజెక్టు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక డిసెంబర్ 21న జరుగుతుందని తెలిపారు.
అనంతపురం జిల్లాలో కందులు పండించిన రైతుల వద్ద నుంచి ప్రతిరోజూ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకు కందులను కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్లో కందుల కొనుగోలు గురించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో, జిల్లా స్థాయి కొనుగోలు కమిటీతో సమావేశం నిర్వహించారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ రేపు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరగనుంది. జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని వైసీపీ ప్రకటన విడుదల చేసింది.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీశ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై 1,005 కేసులు నమోదు చేశామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై 42 కేసులు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 09 కేసులు నమోదయ్యాయని చెప్పారు. రూ.1,21,910ల జరిమానా విధించామని తెలిపారు.
మంత్రి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్ట్ పెట్టిన తెలంగాణ యువకుడు విజయ్ కుమార్ను గుంతకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నోటీసు జారీ చేశారు. సోషల్ మీడియాలో బ్రాహ్మణిపై అనుచిత పోస్ట్ పెట్టాడంటూ ఇటీవల స్థానిక టీడీపీ నేత ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి యువకుడికి నోటీసులు ఇచ్చారు.
ధర్మవరం పట్టుచీరల డిజైనర్ నాగరాజు అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరుపున న్యూ ఢిల్లీ నుంచి అరస్థి గుప్తా, జాస్మిన్ కౌర్ అను నిపుణుల కమిటీ పరిశీలన కోసం వచ్చారు. సత్యసాయి కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టు పరిశోధన శాఖ ఎడీ రామకృష్ణ వారికి పట్టు గుళ్ల నుంచి పట్టు చీరల తయారీ వరకు అన్ని దశలలో వివరించారు. విషయాలు తెలుసుకున్న సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర (21) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ.. సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్పై తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం నగరంలోని పాత ఆర్టీవో కార్యాలయం కాంపౌండ్ పక్కన ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేసి ఈవీఎం యంత్రాలను భద్రత చర్యలను క్షుణంగా పరిశీలన చేశామన్నారు. పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురం టీడీపీ సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించింది. ఈ గ్రామంలోని ఓటర్లందరూ రూ.100 చెల్లించి ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వెంకటాపురంలో 581 ఓట్లు ఉండగా ఇటీవల 13 మంది మృతి చెందారు. మిగిలిన 568 మంది టీడీపీ సభ్యత్వం పొందారు. దీంతో గ్రామం మొత్తం పసుపుమయమైంది. ఇక బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం TDP సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ రైల్వే స్టేషన్ సమీపంలోని మంగాపురం వద్ద సోమవారం గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు ఒడిశాకు చెందిన యువతులుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.