Anantapur

News July 3, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి నోటీసులు.. వెంటనే తొలగింపు..!

image

తాడిపత్రిలోని JC ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసు అతికించి వెంటనే తొలిగించారు. పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో TDP, YCP వర్గాలకు చెందిన నాయకులను ఈనెల 11వ తేదీ వరకు పట్టణంలోకి రాకూడదని కోర్టు ఆదేశించింది. అయితే JC అక్క సుజాతమ్మ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందడంతో అంత్యక్రియల కోసం ఆయన పట్టణానికి వచ్చారు. కార్యక్రమం ముగిసినా వెళ్లకపోవడంతో నోటీసు అతికించి వెంటనే తొలగించడం చర్చనీయాంశమైంది.

News July 3, 2024

అనంతపురం జిల్లాలో కేరళ వాసి అబ్దుల్ మృతి

image

డీ.హీరేహల్ మండలంలో కేరళ వాసి అబ్దుల్ ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారి-బెంగళూరు హైవేపై ఓ డాబాలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడని, పని ముగించుకుని వెళ్లిన గంట సేపటికే హైవే పక్కన అబ్దుల్ పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి సమాచారం అందించారని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News July 3, 2024

అనంత: బాలికపై అత్యాచారం..

image

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను యువకుడు అత్యాచారం చేసిన ఘటన పుట్లూరు మండలంలో జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికను ఈ నెల 23న ఇంటి వద్ద నుంచి రవితేజ బైక్‌పై బలవంతంగా తీసుకెళ్లాడు. ఐషర్ వాహనంలో రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉదయం బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకుంది. షాక్‌లో ఉన్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. బంధువులు ధైర్యం చెప్పి ఆరా తీయగా విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 3, 2024

అనంత: రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్, నారాయణ స్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు పగటి వేళ 35.5 డిగ్రీల నుంచి 36.6 డిగ్రీలుగా, రాత్రి వేళ 25.6 డిగ్రీల నుంచి 26.2 డిగ్రీలుగా నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

News July 3, 2024

హెల్మెట్ లేకుంటే కేసు నమోదు చేయండి: ఎస్పీ మాధవరెడ్డి

image

ద్విచక్ర వాహన ప్రయాణికులు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రహదారి ప్రమాదాల నివారణపై అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వారికి జైలు శిక్ష పడేటట్లు చేయాలన్నారు.

News July 2, 2024

పుట్లూరు మండలంలో పోక్సో కేసు నమోదు

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో మైనర్ బాలికపై అత్యాచారం ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బలవంతంగా ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై హేమాద్రి తెలిపారు.

News July 2, 2024

అనంత: వాటర్ ట్యాంక్‌లో విషప్రయోగం.. నలుగురి అరెస్ట్

image

కణేకల్లు మండలం తుంబిగనూరులో గత నెల 14న సంచలనం రేపిన వాటర్ ట్యాంక్‌లో విషప్రయోగం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. సీఐ ప్రసాద్ బాబు వివరాల మేరకు.. సర్పంచ్ ఫణీంద్ర ఆధీనంలోని పంచాయతీ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ తమకు అప్పగించాలని టీడీపీ నేతలు కోరారు. అందుకు సమ్మతించని ఫణీంద్ర టీడీపీ నేతలపై కేసు బనాయించాలనే కుట్రతో మరో నలుగురు వ్యక్తులతో ట్యాంకులో విషయం కలిపించినట్లు తెలిపారు.

News July 2, 2024

అనంతపురం జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

image

జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ సంస్థ శుభవార్త చెప్పింది. ఆకుతోటపల్లిలోని ఎస్కే యూనివర్సిటీ పక్కనున్న రూడ్ సెట్ కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, జర్దోసి మగ్గంలపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 26 నుంచి నెల రోజులపాటు ఉచిత శిక్షణతో పాటు వసతి భోజనం సౌకర్యం కల్పిస్తామన్నారు. 9618876060కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News July 2, 2024

సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా చేతన్

image

సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా చేతన్ టీఎస్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌గా ఉన్న అరుణ్ బాబును పల్నాడు జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

News July 2, 2024

పింఛన్ పంపిణీ.. అనంత @98.95, సత్యసాయి @98.6%

image

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పింఛన్ పంపిణీ దాదాపు పూర్తైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అనంతపురం జిల్లాలో 98.95, సత్యసాయి జిల్లాలో 98.6 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 2,87,032 మందికి గానూ 2,84,005 మందికి అందజేశారు. సత్యసాయి జిల్లాలో 2,70,973 మందికి గానూ 2,67,169 మందికి పింఛన్ నగదు పంపిణీ చేశారు.