India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు జిల్లా కన్వీనర్ బి.వెంకటరమణ బాబు స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. రాయదుర్గం, గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ పోటీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌస్, రాంమోహన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను మంత్రి సవిత, రాప్తాడు MLA పరిటాల సునీత, శింగనమల MLA బండారు శ్రావణి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతపురం జిల్లా మహిళా MLAలు AP అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. రాప్తాడు MLA పరిటాల, పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి, మంత్రి సవిత శాసనసభ ప్రాంగణంలో జ్ఞాపకంగా ఫోటో తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గం MLA బండారు శ్రావణి శ్రీ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీసు సిబ్బంది దృష్టి సాధించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్కు 110 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపించారు.

అనంతపురం జిల్లాలో APMIP వివిధ పథకాల ద్వారా స్కోచ్ అవార్డును దక్కించుకుంది. కాగా అనంతపురం జిల్లా కలెక్టరేట్లో APMIP అధికారులు కలెక్టర్ ఆనంద్కు ఈ అవార్డును అందజేశారు. ఈ విజయం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ, APMIP PD రఘునాథ్రెడ్డి, ఉద్యాన శాఖాధికారి ఉమాదేవి పాల్గొన్నారు.

అనంతపురంలోని కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న 540 అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అనంతపురంలోని కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న 540 అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అనంతపురంలోని కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో RDT అంటే స్వచ్ఛంద సంస్థలు కాదని లక్షల మంది పేదల జీవితాలను మార్చిందని రాష్ట్ర ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెర్రర్ అన్నారు. శనివారం అమరావతిలోని సచివాలయంలో మంత్రి నారా లోకేశ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ను ఫెర్రర్ కోరారు. కాగా RDT సేవలపై లోకేశ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

అనంతపురం JNTU పరిధిలోని బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంఎస్సీ కోర్సుల పరీక్షా ఫలితాలు శనివారం రాత్రి విడుదలయ్యాయి. బీఫార్మసీ 2వ సంవత్సరం 1వ, 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఫార్మాడీ 2వ, 5వ సంవత్సరం, ఎంఎస్సీ 1వ, 2వ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం కాలేజీ వెబ్సైట్లో చూసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.