Anantapur

News December 16, 2024

అనంతపురం జిల్లా నిరుద్యోగ యువకులకు శుభవార్త

image

ఈ నెల 26 నుంచి 30 రోజులపాటు సెల్ ఫోన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ యువకులు అర్హులన్నారు. 18-45 సంవత్సరాల వారు ఆధార్, రేషన్ కార్డుతో అనంతపురంలోని ఆకుతోటపల్లి వద్ద ఉన్న రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

News December 16, 2024

అనంతపురంలో టమాటా ధర ఢమాల్

image

టమాటా ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. నెల క్రితం కిలో రూ.100 పలకగా ప్రస్తుతం భారీగా పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.10 పలుకుతోంది. కనిష్ఠ ధర రూ.5 కావడం విశేషం. సరాసరి రూ.7తో విక్రయాలు సాగుతున్నాయి. తమకు కనీసం రవాణా ఖర్చులకు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

News December 16, 2024

సత్తా చాటిన కళ్యాణదుర్గం విద్యార్థిని

image

కళ్యాణదుర్గం పట్టణం విద్యానగర్‌కు చెందిన ఉపాధ్యాయ దంపతులు సతీశ్, భాగ్యలత కుమార్తె మేఘన ఆదివారం ఢిల్లీలో జరిగిన అబాకస్ పోటీ పరీక్షలో సత్తా చాటారు. మూడో బహుమతి అందుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ పోటీల్లో 30 దేశాల నుంచి సుమారు 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మేఘనను ఉపాధ్యాయులు, బంధువులు అభినందించారు. కళ్యాణదుర్గం పేరు నిలబెట్టారని ప్రశంసించారు.

News December 16, 2024

ఘనంగా శ్రీ రంగనాథ స్వామి పల్లకి ఉత్సవం

image

హిందూపురంలో వెలసిన గుడ్డం శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మార్గశిర పౌర్ణమి సందర్భంగా వేకువజామున అర్చకులు ఆలయంలో మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉరేగింపులో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

News December 15, 2024

తాడిపత్రిలో వైభవంగా ఆకాశ దీపోత్సవం

image

తాడిపత్రిలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో వైభవంగా ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఆవరణంలో ఉన్న ధ్వజ స్థంభంపై ఆకాశ దీపోత్సవం వెలిగించారు. పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు.

News December 15, 2024

రాప్తాడులో హత్య కేసు ఛేదింపు.. మేనమామే యముడు

image

రాప్తాడు బుక్కచెర్ల సమీపంలో ఈ ఏడాది జరిగిన హత్య కేసునుఛేదించినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. నల్లపరెడ్డి అల్లుడు పురుషోత్తం HIV వ్యాధిగస్థుడు. అందరితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్10న నల్లపరెడ్డి చెల్లిని కొట్టాడు. దీంతో మేనమాన పురుషోత్తంని కల్లందొడ్డి వద్ద ఉండగా కొట్టగా.. అతను మృతి చెందాడు. ఆపై ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మేనమామే చంపినట్లు తేల్చారు.

News December 15, 2024

కళ్యాణదుర్గం: ముగిసిన మెగా జాబ్ మేళా

image

కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న మెగా జాబ్ మేళా శనివారం రాత్రి ముగిసింది. దేశంలోని 205 కంపెనీలు మెగా జాబ్ మేళాకు హాజరయ్యాయి. ఈ సందర్భంగా 8000 మంది నిరుద్యోగ యువతీ, యువకులను ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేశారు. మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

News December 14, 2024

పట్టుదల ఉంటే ఉద్యోగం మీ సొంతం: మంత్రి పయ్యావుల

image

గ్రామీణ నిరుద్యోగ యువత, విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటే సులభతరంగా ఉద్యోగాలు పొందవచ్చని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా కృషి, పట్టుదలను అలవర్చుకోని ఉద్యోగ అన్వేషణలో ముందడుగు వేయాలని తెలిపారు. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అని సంబంధం లేకుండా అనుభవాన్ని పెంచుకోవడానికి వచ్చిన ప్రతి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 14, 2024

అనంతపురంలో కేజీ టమాటా రూ.10

image

టమాటా ధరలు పడిపోయాయి. ఆయా రాష్ట్రాలో దిగుబడి పెరగడంతో అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.10కి చేరింది. కనిష్ఠంగా రూ.4, సరాసరి రూ.6తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు కూడా పడిపోయాయి. మొన్నటి వరకు టన్ను రూ.30వేలకు పైగా పలకగా తాజాగా గరిష్ఠంగా రూ.29 వేలతో అమ్ముడవుతోంది.

News December 14, 2024

అనంత: స్నేహితుని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

image

స్నేహితుని హత్యకేసులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ అనంతపురం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2019లో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ మణికంఠను తన స్నేహితులు మద్యం మత్తులో దాడి చేసి హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.