Anantapur

News December 10, 2024

పోక్సో కేసులో నిందితుడి అరెస్టు: కదిరి సీఐ

image

కదిరి మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడు నాగరాజును అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నాగరాజు ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను మభ్యపెట్టి మోసం చేశాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.

News December 10, 2024

అనంత: లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

మిస్సింగ్ ఎంప్లాయిస్ అండ్ సిటిజన్స్ మ్యాపింగ్, హౌస్ ఇమేజ్ & జియో కోఆర్డినేట్స్, ఎన్పీసీఐ లింక్, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్, ఎంఎస్ఎంఈ సర్వే స్టేటస్ కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మిస్సింగ్ ఎంప్లాయిస్ అండ్ సిటిజన్స్ మ్యాపింగ్, హౌస్ ఇమేజ్ పై సమీక్ష చేశారు.

News December 9, 2024

బోరుగడ్డకు అనంతపురం పోలీసుల ప్రశ్నలు

image

అనంతపురం పోలీసులు బోరుగడ్డ అనిల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున అనంతపురానికి తీసుకొచ్చిన పోలీసులు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో విచారిస్తున్నారు. సీఎం కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. మరోవైపు ఇవాళ సాయంత్రం 4గంటలకు కస్టడీ ముగియనుంది. అనంతరం జడ్జి ముందు ప్రవేశపెడతారు.

News December 9, 2024

పెనుకొండలో ప్రతిభా పరీక్షకు 58 మంది గైర్హాజరు

image

పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో జాతీయ ఉపకార వేతనాల కోసం విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పరీక్షలను నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను మండల విద్యాధికారి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ఈ పరీక్షలను 4 కేంద్రాలలో నిర్వహించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. నాలుగు కేంద్రాలలో మొత్తం 968 మంది అభ్యర్థులకు గానూ 910 మంది పరీక్షలకు హాజరయ్యారు. 58 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయినట్లు తెలిపారు.

News December 8, 2024

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News December 8, 2024

అనంత జిల్లాలో 982 ఎం.వి కేసుల నమోదు

image

అనంతపురం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 982 ఎం.వీ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ ఎం.వీ కేసులకు సంబంధించిన నిందితుల నుంచి రూ.2,21,625లు జరిమానా విధించారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు కేవలం ఒకరోజులోనే ప్రగతి సాధించారు. అంతే కాకుండా అలాగే ఓపెన్ డ్రింకింగ్ కేసులో 45, డ్రంకన్ డ్రైవ్ రెండు కేసులు, నమోదు చేశామన్నారు.

News December 8, 2024

యువతిపై కత్తితో దాడి.. మంత్రి సవిత సీరియస్

image

కడప జిల్లా వేములలో యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేసిన ఘటనపై ఇన్‌ఛార్జి <<14821476>>మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం<<>> వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి ఎస్పీ విద్యాసాగర్‌తో ఫోన్లో మాట్లాడి, తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధిత యువతికి మెరుగైన వైద్యమందించాలని తిరుపతి రుయా వైద్యులను మంత్రి సవిత సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనీ హామీ ఇచ్చారు.

News December 8, 2024

అనంతపురం పోలీసుల కస్టడీలో బోరుగడ్డ

image

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓ కేసు విచారణలో భాగంగా నిన్న అనంతపురం పోలీసులు ఆయనను మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా అక్టోబర్ 17న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

News December 8, 2024

ఆత్మకూరులో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్..కారణమిదే

image

ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నరేశ్ శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను అప్పుల ఒత్తిడి అధికమై చనిపోయినట్లు తెలుస్తోంది. రూ. లక్షలలో అప్పుచేసి తండ్రి కొద్ది కాలం కిందట మృతిచెందగా.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత కుమిలిపోయిన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News December 8, 2024

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష

image

వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష విధించినట్టు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ముదిగుబ్బ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన చెన్నకేశవరెడ్డి కుమార్తె స్రవంతిని కొత్తచెరువుకు చెందిన ఓం ప్రకాశ్ రెడ్డికి ఇచ్చి 2015లో వివాహం చేశారు. అయితే అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు ఆమెపై హత్యాయత్నం చేశారు. ఈ కేసులో ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని ఎస్పీ తెలిపారు.