Anantapur

News December 6, 2024

పరిటాల సునీత సెల్ఫీ ఛాలెంజ్

image

అభివృద్ధి అంటే ఎంటో తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలోని కురుబ వీధి, పరిటాల రవీంద్ర కాలనీల్లో రూ.56 లక్షల నిధులతో నూతనంగా సిమెంట్ రోడ్లు నిర్మించారు. పనులు పూర్తయి రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఆమె సెల్ఫీ తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలోని అభివృద్ధిని ఇలా వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

News December 6, 2024

‘పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా సమిష్టి విధులు నిర్వర్తిద్దాం’

image

అనంతపురం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం 62వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ పీ.జగదీశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు. 1940 దశకంలో వలంటీర్ వ్యవస్థగా ఏర్పాటైన హోంగార్డు వ్యవస్థ ప్రస్తుతం పోలీసుశాఖలో కీలకంగా ఉందన్నారు.

News December 6, 2024

పుట్టపర్తి: బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. పరారీలో నిందితుడు

image

పుట్టపర్తి రూరల్ మండలం బత్తలపల్లిలో ఓ బాలిక పట్ల అసభ్యకంగా ప్రవర్తించిన వ్యక్తిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన సూరి అనే వ్యక్తి గురువారం ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

News December 6, 2024

తాడిపత్రిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి రైల్వే స్టేషన్ పరిధిలోని కోమలి-జూటూరు మధ్య షేక్ బాషా రైలు కిందపడి గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంతకల్లుకు చెందిన షేక్ బాషా పుదిచ్చేరి నుంచి కాచిగూడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తాడిపత్రి రైల్వే ఎస్ఐ నాగప్ప చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 6, 2024

సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి: కలెక్టర్ చేతన్

image

గ్రామ సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదును తప్పనిసరిగా చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ పనులపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో వెనుకబడిన ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

News December 6, 2024

శ్రీ సత్యసాయి: ‘నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి’

image

నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌ను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల శాఖ అంశంపై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని సూచించారు. అధికారులు, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతుల ఇబ్బంది పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 6, 2024

ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి: జేసీ

image

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తోందని, జిల్లాలో కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో రెవెన్యూ సదస్సులపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, రైతు సంఘం నేతలతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

News December 5, 2024

మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారంలో బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి

image

మహారాష్ట్ర నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర పడ్నివిస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం మహా అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 5, 2024

గృహ నిర్మాణ శాఖ అధికారులు బాధ్యతగా పని చేయాలి: కలెక్టర్

image

గృహ నిర్మాణ రంగంలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 72,353 ఇల్లు మంజూరు కాగా కేవలం 22,500 పూర్తి చేశారని తెలిపారు. మిగిలిన వారిని మార్చి చివరకు పూర్తి చేసే విధంగా పని చేయాలని ఆదేశించారు.

News December 5, 2024

కియా కార్ల పరిశ్రమను సందర్శించిన మంత్రులు

image

పెనుకొండ మండల పరిధిలోని అమ్మవారుపల్లి వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాశ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గురువారం సందర్శించారు. కియా కార్ల తయారీ, పరిశ్రమ చిరిత్రపై తెలుసుకున్నారు. అనంతరం కియా కార్మికులతో ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 650 ఎకరాల్లో ఏర్పాటైన కియా కార్ల ప్లాంట్‌ను 2019లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!