Anantapur

News June 29, 2024

శ్రీ సత్యసాయి: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

కనగానపల్లి మండలం కొండపల్లి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్(31) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పవన్ కుమార్ కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన వ్యక్తి అని, వ్యక్తిగత పనిమీద బైకులో వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడ్డాడని కనగానపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 29, 2024

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. జులై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో అర్హులైన 2,70,966 మందికి రూ.184.70 కోట్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని 54 సచివాలయాల్లో 4,349 మంది సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు.

News June 29, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి చిన్నారి ముస్కాన్ ఎంపిక

image

తాడిపత్రికి చెందిన చిన్నారి ముస్కాన్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైంది. అనంతపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో అండర్-13 సింగిల్స్, డబుల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ధ్రువీకరిస్తూ చిన్నారి ముస్కాన్‌కు సర్టిఫికెట్ జారీ చేశారు.

News June 29, 2024

AI సృష్టించిన రాగి ముద్ద చిత్రం

image

నాటు కోడి, రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ ప్రజలు ఆస్వాదిస్తూ తినే వంటకం ఇది. అయితే ఇటీవల ఏఐ సృష్టించిన వినూత్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అలాగే ఏఐ సృష్టించిన రాగి ముద్ద ఫొటోను ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేశారు. చట్ని, రాగి ముద్ద, నెయ్యితో ఉన్న ఆ చిత్రం అందరికీ నోరూరిస్తోంది. దీనికి ‘సీమరుచులను ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

News June 29, 2024

అనంత: లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైద్యుడిపై కేసు

image

లైంగిక వేధింపులకు పాల్పడ్డ చెన్నేకొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ముష్టికోవెల ఆరోగ్య ఉప కేంద్రంలో పని చేస్తున్న ఏఎన్ఎం కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏఎన్‌ఎంలు సుభాషిణి, అశ్విని, కృష్ణమ్మలు తమను కూడా లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడని పేర్కొన్నారు.

News June 29, 2024

డి.శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరం: రఘువీరా రెడ్డి

image

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురం శ్రీనివాస్ మృతిపై మాజీ మంత్రి రఘువీరా రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ మంత్రివర్గ సహచరుడు డి.శ్రీనివాస్ మరణ వార్త అత్యంత బాధాకరం. భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 29, 2024

SKU వీసీ హుస్సేన్ రెడ్డి రాజీనామా

image

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ హుస్సేన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన హుస్సేన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 17న ఎస్కేయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

News June 29, 2024

అనంతపురం: వసతి గృహాలకు నిధులు మంజూరు

image

జిల్లాలో కొన్ని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాలు, బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల వసతి గృహాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మరమ్మతుల నిమిత్తం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 15 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలకు రూ.1.35 కోట్ల నిధులు మంజూరు చేశారు.

News June 29, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. జులై 1, 2వ తేదీల్లో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకుల పెంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు.

News June 29, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి క్లయిమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.