India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కళ్యాణదుర్గం సమీపంలోని కూరాకులతోట వద్ద వన్నూరు స్వామి(30) అనే వ్యక్తిని శుక్రవారం దుండగులు దారుణంగా హత్య చేశారు. కురాకులతోట గ్రామానికి చెందిన వన్నూరు స్వామిని దుండగులు గొంతు కోసి అతి దారుణంగా చంపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పింఛన్ల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పింఛన్లకు కేటాయించిన సొమ్మును శనివారం బ్యాంకుల నుంచి డ్రా చేస్తామని తెలిపారు. సీఎస్ నీరబ్ కుమార్ పింఛన్ల పంపిణీపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. లబ్ధిదారుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టామని, శుక్రవారానికి పూర్తవుతుందని తెలిపారు.
జిల్లాలోని ఉపాధి అవకాశాలు సృష్టించే తయార, సేవారంగం పరిశ్రమలకు విస్తృత ప్రోత్సాహం కల్పించాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పరిశ్రమల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 48వ జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సాహించాలని ఆదేశించారు.
నార్పలలోని చైతన్య కాలనీకి చెందిన నాగప్ప శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ అధికారుల ఒత్తిడిని తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఓ ప్రైవేట్ బ్యాంకులో నాగప్ప తీసుకున్న లోన్కు సంబంధించి ప్రతినెలా వడ్డీ కట్టినప్పటికీ నోటీసులు రావడంతో భయంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
భార్యపై అనుమానంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోరంట్ల మండలంలో చోటుచేసుకుంది. పాలసముద్రానికి చెందిన నరసింహ మూర్తి, సుగుణమ్మకు కొన్నేళ్ల క్రితం పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య తరచూ ఫోన్ మాట్లాడటంపై భర్త మందలించే వారు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి వెళ్లిన భార్య రాత్రి వరకు తిరిగి రాలేదు. మనస్తాపం చెందిన నరసింహ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 2,89,508 మందికి జులై 1న పింఛన్ అందజేయనున్నారు. పెంచిన ప్రకారం జులై నెలకు రూ.126.81 కోట్లు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ.వెయ్యి అదనం కోసం రూ.70.62 కోట్లు కలిపి మొత్తంగా రూ.197.44 కోట్లు అందజేయనున్నారు. సచివాలయం సిబ్బంది జులై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీని ప్రారంభిస్తారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ జీ.వీ.ఆర్ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డిప్యూటేషన్పై అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్గా వచ్చిన విషయం తెలిసిందే.
గుత్తి మండలంలోని రజాపురం గ్రామంలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ నివేదిక కోరారు. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత తాగునీరు, కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అలాగే ఉరవకొండ మండలం చిన్న ముస్టూరులో నాగేంద్ర అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందిన ఘటనపై కూడా నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను మంత్రి కోరారు.
జూలై 1న ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. శనివారం బ్యాంకుల ద్వారా అధికారులు నగదు విత్ డ్రా చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలను జులై 7న ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 13 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జులై 7న స్వామి వారి తొలి దర్శనం, 9న అగ్నిగుండం ఏర్పాటు, 12న ఐదవ సరిగెత్తు, 14న చిన్న సరిగెత్తు, 16న పెద్ద సరిగెత్తు, 17న అగ్నిగుండం ప్రవేశం, 19న స్వామి వారి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.