Anantapur

News June 27, 2024

అనంతపురం: దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఈ నెల 19న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి చెందారు. మండల పరిధిలోని కోమటికుంట్ల గ్రామంలో ఈ ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త ఎరుకలయ్య (55)కు త్రీవ గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.

News June 27, 2024

టీడీపీపీ సెక్రటరీగా బీకే పార్థసారథి

image

టీడీపీపీ సెక్రటరీగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ లేఖను స్పీకర్ ఓం బిర్లాకు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తదితర టీడీపీ ఎంపీలు అందజేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎంపీ పార్థసారథి తెలిపారు.

News June 27, 2024

అనంతపురం: దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఈ నెల 19న టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మృతి చెందారు. మండల పరిధిలోని కోమటికుంట్ల గ్రామంలో ఈ ఘర్షణ జరిగింది. వైసీపీ కార్యకర్త ఎరుకలయ్య (55)కు త్రీవ గాయాలయ్యాయి. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.

News June 27, 2024

బొకేలు వద్దు.. బుక్స్ తీసుకురండి: మంత్రి సత్యకుమార్ యాదవ్

image

తనను కలిసేందుకు వస్తున్న వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక సూచన చేశారు. ‘నిత్యం చాలా మంది కలిసేందుకు వస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. అయితే నా దగ్గరకు వచ్చే వారు పూల బొకేలకు బదులుగా నోటు బుక్స్, శాలువాలకు బదులుగా టవల్స్ వంటివి తీసుకొస్తే అవి పేదలు, విద్యార్థులకు ఉపయోగపడతాయి. మనం చేసే పని పది మందికి మేలు చేయాలనేది నా ఉద్దేశం. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News June 27, 2024

అనంత జిల్లాలో హంపిలోని రథాన్ని పోలిన మరో రథం ఎక్కడుందో తెలుసా?`

image

అనంతపురం జిల్లాలో హంపిలోని రథం విగ్రహాన్ని పోలిన మరో రథం దర్శనమిస్తోంది. తాడిపత్రిలో వెలసిన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో అడుగు పెట్టగానే హంపీలో పోలిన రథం మనకు దర్శనమిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఆ రథానికి రంధ్రాల నుంచి నేరుగా సూర్యకిరణాలు స్వామి పాదాల చెంతకు చేరడం ఇక్కడ విశిష్టత. అంతేకాకుండా ఆలయం చుట్టూ రామాయణం, మహాభారతం తెలియజేస్తూ శిల్పకళా సంపద ఉంది.

News June 27, 2024

అనంత: తండ్రిని చంపిన కొడుకు

image

కూడేరు మండలం కమ్మూరులో బుధవారం తండ్రిని కుమారుడు హత్య చేశాడు. గ్రామానికి చెందిన ఆంజనేయులు(65) మానసిక వ్యాధితో బాధపడుతూ కనిపించిన వారందరినీ తిట్టుకుంటూ తిరిగేవాడు. వారు భరించలేక అతని కుమారుడు తిరుపాల్‌ను మందలించేవారు . ఆవేశానికి గురైన తిరుపాల్ బుధవారం సాయంత్రం తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో గడ్డపారతో తలపై బలంగా కొట్టాడు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతిచెందాడు.

News June 27, 2024

నేటి నుంచి అంతరాష్ట్ర హాకీ పోటీలు

image

ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నుంచి వరకు ఈ నెల 30 వరకు అంతరాష్ట్ర సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనున్నారు. ఈ పోటీలు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు.

News June 27, 2024

అనంతలో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు

image

అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రిలో 15 పడకలతో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు సూపర్ హిట్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా డయేరియా కేసులు అధికం అవుతుండటంతో మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. డయేరియా పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

News June 27, 2024

16, 17వ స్థానంలో సత్యసాయి, అనంత

image

కాసేపటి క్రితం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా నుంచి 4,934 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,401 మంది పాసయ్యారు. జిల్లాలో 68.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా అనంత జిల్లా నుంచి 7,784 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,854 మంది గట్టెక్కారు. మొత్తానికి ఫలితాల్లో సత్యసాయి 16, అనంత 17వ స్థానంలో నిలిచాయి.

News June 26, 2024

16, 17వ స్థానంలో సత్యసాయి, అనంత

image

కాసేపటి క్రితం పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా నుంచి 4,934 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,401 మంది పాసయ్యారు. జిల్లాలో 68.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా అనంత జిల్లా నుంచి 7,784 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,854 మంది గట్టెక్కారు. మొత్తానికి ఫలితాల్లో సత్యసాయి 16, అనంత 17వ స్థానంలో నిలిచాయి.