Anantapur

News June 25, 2024

బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని.. భూమిని అమ్మేశాడు

image

లోన్ ఇప్పిస్తానని నమ్మించి భూమిని అమ్మేశారని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిగి(M) ఊటుకూరు చెందిన హనుమంతప్పకు 5.10 ఎకరాల భూమి ఉంది. హిందూపురానికి చెందిన జనార్దన్‌రెడ్డి భూమికి బ్యాంక్‌ లోన్ ఇప్పిస్తానని నిరాక్షరాస్యులైన హనుమంతప్ప, కుటుంబాన్ని నమ్మించి నెల్లూరు(D)కు చెందిన కుసుమకుమారికి రిజిస్ట్రేషన్ చేయించారు. అకౌంట్‌లు ఓపెన్ చేయించి రూ.3లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

News June 25, 2024

‘నా పెళ్లికి రండి’.. బాలకృష్ణకు నటి వరలక్ష్మి ఆహ్వానం

image

నటి వరలక్ష్మి శరత్ కుమార్ హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. బాలకృష్ణ దంపతులకు కార్డు అందించి, తన వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే కొత్త జంటకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియుడు నికోలయ్‌‌ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి ఏడడుగులు వేయబోతున్నారు. జులై 2న వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News June 25, 2024

అనంతపురం జిల్లాలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

image

జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అనంతపురం జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.48 ఉండగా ఆ ధర నేటికి రూ.109.25కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.97.33 నుంచి రూ.97.11కి తగ్గింది. సత్యసాయి జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.110.62 ఉండగా ఆ ధర నేటికి రూ.110.28కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.98.39 నుంచి రూ.98.05కి తగ్గింది.

News June 25, 2024

అనంతపురం జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే?

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 183 ఎస్టీటీలతో కలిపి మొత్తం 811 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

ATP: జెడ్పీ ఉద్యోగికి గుండెపోటు.. భార్య ఒడిలోనే తుదిశ్వాస

image

అనంతపురం జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. బత్తలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆయన.. గుండె పట్టుకున్నట్లు ఉందంటూ భార్యకు చెప్పారు. ఇంతలోనే భార్య ఒడిలోనే తుదిశ్వాస వదిలారు.

News June 25, 2024

ATP: వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్య

image

అనంత జిల్లా పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయంలోకి దూకి ఓ జంట నిన్న ఆత్మహత్య చేసుకోగా దీనికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. గుత్తి మండలానికి చెందిన నిజామా(35) తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మరిది మహబూబ్‌బాషా(26)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆందోళనకు గురైన వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌస్‌బాషా తెలిపారు.

News June 25, 2024

సత్యసాయి జిల్లా వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

సత్యసాయి జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. పుట్టపర్తి పట్టణ అభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తుండటంతో మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవనానికి నోటీసు అతికించడంతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణకు తాఖీదులు ఇచ్చినట్లు కమిషనర్ అంజయ్య తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో 7 రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

News June 25, 2024

అనంతపురంలో 26న ఉద్యోగమేళా

image

ఈ నెల 26న ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి కళ్యాణి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం అనంతపురంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో 3 రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు పదో తరగతి నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఉత్తీర్ణత ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు.

News June 25, 2024

వైద్యశాఖ ఉన్నతాధికారులతో సత్యకుమార్ యాదవ్ సమావేశం

image

సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. వర్షకాలం ప్రారంభమైనందున తాగునీరు కలుషితం కాకుండా చూడటం, దోమలు నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు..పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం పాటించాలన్నారు.

News June 25, 2024

డయేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి: సత్యసాయి కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాను డయేరియా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. మురికి నీటి గుంతలపై మున్సిపల్, పంచాయితీ అధికారులు దృష్టి సారించాలన్నారు. డయేరియా కేసులు ఉన్నట్టు గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.