Anantapur

News April 4, 2025

అనంతపురం: పెళ్లై 6 నెలలే.. అంతలోనే మృతి

image

పెళ్లై 6 నెలలు గడవకముందే వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం ఉరవకొండ మండలం రాకెట్ల PABR జలాశయంలో మునిగి కార్తీక్ (25) మృతి చెందాడు. తెలిసిన వారు పిలిస్తే జలాశయం వద్ద వ్యవసాయ మోటర్ దింపడానికి వెళ్ళాడు. జలాశయం లోపలికి వెళ్లిన తరువాత చేపల కోసం వేసిన వల చిక్కుకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 4, 2025

హీటెక్కిన రాప్తాడు రాజకీయం!

image

పరిటాల-తోపుదుర్తి కుటుంబాల మధ్య పొలిటికల్ హీట్ నెలకొంది. కొన్నిరోజులుగా సునీత, తోపుదుర్తి సోదరులు పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 8న YS జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తుండగా పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం ఉందంటూ సునీత సంచలన ఆరోపణ చేశారు. వందలాది మందిని చంపించిన నీ భర్త దేవుడా? అంటూ చంద్రశేఖర్ ఇటీవల ప్రశ్నించారు. విమర్శ ప్రతి విమర్శలతో రాప్తాడు రాజకీయం హీటెక్కింది.

News April 3, 2025

ATP: పాఠశాలల పునఃవ్యవస్థీకరణ పూర్తి కావాలి- కలెక్టర్

image

ప్రభుత్వం 117 జీఓను ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో మండల విద్యాశాఖ అధికారులతో పాఠశాలలు పునఃవ్యవస్థీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు.

News April 3, 2025

అనంతపురం అభివ‌ృద్ధికి కృషి చేయాలి- కలెక్టర్

image

లక్ష్య, ముస్కాన్, కయకల్ప లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, జిల్లాలోని వైద్య అధికారులు, సిబ్బందికి క్వాలిటీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం DMHO కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మెడికల్ ఆఫీసర్లతో జిల్లా నాణ్యత హామీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. క్వాలిటీ అస్సూరెన్స్ కమిటీ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి మొదటి గురువారం నిర్వహించాలని అన్నారు.

News April 3, 2025

కంబోడియాలో అనంతపురం యువకుడి ప్రతిభ

image

మార్చి 28, 29, 30న కంబోడియా దేశంలో నిర్వహించిన మొట్టమొదటి ఆసియా పారా త్రో బాల్ జట్టులో అనంతపురం యువకుడు ప్రతిభ చాటారు. జిల్లాకు చెందిన వెన్నపూస రోషి రెడ్డి భారత త్రో బాల్ జట్టుకు ఎంపికై రజత పతకం సాధించినట్లు క్రీడా అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ తెలిపారు. భారత్ Vs మలేషియా పారా త్రోబాల్ జట్టు తలపడ్డాయని పేర్కొన్నారు. మొదటి 3 రౌండ్లలో భారత త్రోబాల్ జట్టు విజయం సాధించిందన్నారు.

News April 3, 2025

ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ పి.జగదీశ్

image

సామాజిక మాధ్యమాల్లో కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

News April 3, 2025

అనంతపురం జిల్లాలో 89 మంది కానిస్టేబుళ్ల బదిలీ

image

అనంతపురం జిల్లాలో బుధవారం కానిస్టేబుళ్ల బదిలీలు పారదర్శకంగా జరిగాయి. ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి 89 మందిని బదిలీ చేశారు. సీనియార్టీ ఆధారంగా సిబ్బంది కోరుకున్న చోటుకే స్థాన చలనం కల్పించారు. పట్టణాల్లో పని చేస్తున్న వారిని రూరల్ పోలీసు స్టేషన్లకు, రూరల్ ఏరియాలలో పని చేస్తున్న వారిని పట్టణ ప్రాంతాల స్టేషన్లకు బదిలీ చేశారు. 89 మందికి అక్కడికక్కడే బదిలీ ఉత్తర్వు ప్రతిని అందజేశారు.

News April 3, 2025

8న పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తారని వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. జగన్ పర్యటనకు జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు.

News April 2, 2025

అనంత: ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

image

అనంత ఆణిముత్యాలు ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ కింద ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో “అనంత ఆణిముత్యాలు” ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీపై సం.శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

News April 2, 2025

అనంత: హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

image

నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన సిద్దయ్యకు జీవిత ఖైదీ విధిస్తూ అనంతపురం నాలుగవ ఏడీజే కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అనంతపురం 4 రోడ్డుకు చెందిన రామాంజినమ్మ ఫిబ్రవరి 2014న మిస్సింగ్‌పై భర్త రవి ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సిద్దయ్య ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ జగదీష్ అభినందించారు.