Anantapur

News June 25, 2024

ప్రజలు నిర్భయంగా తమ సమస్యలు తెలియజేయండి: అనంత ఎస్పీ

image

ప్రజలు నిర్భయంగా తమ సమస్యలును తెలియజేయాలని వాటికి వెంటనే పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు తీర్చడం కోసం పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ సోమవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండీ జిల్లా ఎస్పీ 79 ఫిర్యాదులు స్వీకరించారు.

News June 24, 2024

అనంతలో మిద్దె మీద నుంచి జారి పడి వ్యక్తి మృతి

image

అనంతపురం నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఐదో వార్డ్ జిఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సోమవారం వెంకటేశ్ నాయక్ మిద్దె మీద నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూమృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

News June 24, 2024

చాగల్లు రిజర్వాయర్‌లో మరో మృతదేహం లభ్యం

image

పెద్దపప్పూరు మండలం చాగల్లు డ్యామ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉదయం మహిళ నజయా మృతదేహం లభ్యం కాగా.. తాజాగా మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీకి చెందిన మహబూబ్ బాషాగా పోలీసులు గుర్తించారు. వీరు ఇద్దరు మరిది, వదినలని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

కేబినెట్ ఆమోదం.. అనంతపురం జిల్లాలో 5.60 లక్షల మందికి లబ్ధి!

image

CM చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పింఛన్ పెంపునకు ఆమోదం తెలిపింది. ₹3 వేల నుంచి ₹4 వేలకు పెంచింది. జులై 1 నుంచే పెంపును అమలు చేయనుంది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో అనంతపురం జిల్లాలో సుమారు 2.80 లక్షలు, సత్యసాయి జిల్లాలో 2.72 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో అనంతపురం జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్.సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

నేడు జిల్లా ఎంపీల ప్రమాణ స్వీకారం

image

18వ లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా జిల్లా ఎంపీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథిలతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తారు. వీరిలో అంబికా తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికవగా పార్థసారథి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News June 24, 2024

ATP: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

గుండెపోటుతో నరసింహులు అనే ఉపాధ్యాయుడు మృతి చెందారు. గుత్తి మండలంలోని కె.ఊబిచెర్ల గ్రామంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరసింహులు ఆదివారం రాత్రి గుండెపోటుతో అనంతపురం నగరంలోని సవేరా ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. ఆయన మృతిపై ఉపాధ్యాయుల సంఘం సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News June 24, 2024

ATP: టమాట కిలో రూ.80

image

టమాట ధరలు కొండెక్కాయి. ఎన్నికల సీజన్ ముగిశాక వాటి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. సామాన్యులు టమాటలను కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అనంతపురంలోని పాతూరు మార్కెట్లో కిలో టమాట రూ.80 ధర పలుకుతుంది. రెండు రోజుల కిందట కిలో రూ.60 ఉండగా ఒక్కసారిగా రూ.20 పెరగడంతో ప్రజలు కొనలేని పరిస్థితి. దీంతో పాటు క్యారెట్, బీన్స్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. పచ్చిమిర్చి కిలో రూ.120 పలుకుతోంది.

News June 24, 2024

అనంతపురంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు: సవిత

image

అనంతపురం జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మంత్రిగా మొదటిసారి పెనుకొండకు వచ్చిన ఆమె పట్టణంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆమె మాట్లాడుతూ.. జులై 1న ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా చేనేతల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

News June 23, 2024

శ్రీసత్యసాయి: మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి

image

ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సద్దపల్లి వెంకటరెడ్డి అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆయన నల్లమాడ నియోజవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా 1985 నుంచి 1989 వరకు పనిచేశారు. సోమవారం ఉదయం 11గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.