India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాగునీటి సంఘాల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో 214 మైనర్ ఇరిగేషన్, 16 మీడియం ఇరిగేషన్ సంఘాలు ఉన్నాయని, వీటి ఎన్నికలకు డిసెంబర్ 5న నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్ సమీపాన గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హిందూపురానికి చెందిన పవన్ కుమార్(30), హరీశ్(28)గా పోలీసులు గుర్తించారు. తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు ఈనెల 30న అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లులో పర్యటించనున్నారు. ప్రైవేట్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆర్.కృష్ణ కపర్ధి గురువారం వెల్లడించారు. సీఎం నివాసం తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గానా విజయవాడ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో కర్ణాటక విజయనగర ఎయిర్ పోర్ట్కు చేరుకుని హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:45 గంటలకు నేమకల్లుకు చేరుకుంటారన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నేడు సత్యసాయి, 30న అనంతపురం, సత్యసాయి, డిసెంబర్ 1న అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అనంతపురం మెడికల్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థి వీర రోహిత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది తెలిపారు. రోహిత్ MBBS నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సొంత ఊరు ఉరవకొండ పట్టణమని స్నేహితులు తెలిపారు. కేసు నమోదు చేసి తలిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఫ్లైయాష్ వివాదం నేపథ్యంలో ఇరువురి నేతలకూ సీఎం చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది. ఇవాళ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఉచిత బూడిద వివాదంపై జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీయే ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పవన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సహచర పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యటించారు. ఈ నెల 30న సీఎం చంద్రబాబు నేమకల్లు గ్రామంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలీ ప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల తీరుపై <<14720394>>సీఎం<<>> చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లైయాష్ తరలింపు విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.