India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం వైఎస్ జగన్ మొహంలో అధికారం లేదన్న నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించామంటూ వైఎస్ జగన్ ప్రకటన చేయడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.
సంచలనం రేకెత్తించిన ధర్మవరం సీఐ నాగేంద్ర తల్లి స్వర్ణకుమారి హత్యకేసులో నిందితుడు అనిల్ను అరెస్టు చేసినట్లు మదనపల్లె సీఐ కళా వెంకటరమణ తెలిపారు. నీరుగట్టుపల్లిలో సెప్టెంబర్ 28న జగన్ కాలనీకి చెందిన వెంకటేశ్, గజ్జలకుంట అనిల్తో కలిసి నగల కోసం ఇంట్లోనే ఆమెను హత్యచేశారు. ఈ కేసులో వెంకటేశ్ అరెస్ట్ కాగా, పరారీలో ఉన్న అనిల్ ములకలచెరువు వద్ద ఈనెల 24న విషంతాగి ఆస్పత్రిలో చేరి పోలీసులకు చిక్కి అరెస్టయ్యాడు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ పరీక్ష ఫీజులు డిసెంబర్ 5వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చునని డీఈవో రఘునాథరెడ్డి తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్ప-2025 కార్యక్రమం చేపట్టింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ ఉంటాయన్నారు.
జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 1,000 హెక్టార్ల భూమి ఉంటే పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.
సాగునీటి సంఘాల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో 214 మైనర్ ఇరిగేషన్, 16 మీడియం ఇరిగేషన్ సంఘాలు ఉన్నాయని, వీటి ఎన్నికలకు డిసెంబర్ 5న నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్ సమీపాన గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హిందూపురానికి చెందిన పవన్ కుమార్(30), హరీశ్(28)గా పోలీసులు గుర్తించారు. తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు ఈనెల 30న అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లులో పర్యటించనున్నారు. ప్రైవేట్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆర్.కృష్ణ కపర్ధి గురువారం వెల్లడించారు. సీఎం నివాసం తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గానా విజయవాడ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో కర్ణాటక విజయనగర ఎయిర్ పోర్ట్కు చేరుకుని హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:45 గంటలకు నేమకల్లుకు చేరుకుంటారన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నేడు సత్యసాయి, 30న అనంతపురం, సత్యసాయి, డిసెంబర్ 1న అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అనంతపురం మెడికల్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థి వీర రోహిత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిబ్బంది తెలిపారు. రోహిత్ MBBS నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సొంత ఊరు ఉరవకొండ పట్టణమని స్నేహితులు తెలిపారు. కేసు నమోదు చేసి తలిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఫ్లైయాష్ వివాదం నేపథ్యంలో ఇరువురి నేతలకూ సీఎం చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది. ఇవాళ అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఉచిత బూడిద వివాదంపై జిల్లా అధికారుల నుంచి సీఎం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.