India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్పై మొదటి సంతకం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండవ సంతకం చేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్పై తొలి సంతకం చేశానని తెలిపారు.
సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే బండారు శ్రావణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని ఆమె కొనియాడారు. ప్రజలపై భువనేశ్వరి చూపే ప్రేమ, ఆప్యాయత మరవలేనిదని తెలిపారు. మరోవైపు శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణి రేపు అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు.
గుత్తి మండలం ఇసుకరాళ్లపల్లికి చెందిన ఉపేంద్ర అనే యువకుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేశ్తో వెంట నడిచాడు. ఆ క్రమంలో తన లక్ష్యం గురించి చెప్పడంతో రూ.22 లక్షల ఆర్థిక సాయం అందించారు. తనకు సహకరించిన నారా కుటుంబం ఫొటో, టీడీపీ జెండాను ఎవరెస్ట్పై పాతి అందరి దృష్టిని ఆకర్షించాడు. వచ్చే ఏడాది మరోసారి ఎవరెస్ట్ ఎక్కి రెండుసార్లు ఎక్కిన ఘనత దక్కించుకుంటానని తెలిపారు.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 17ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు పండ్లు ఇస్తానని ఆశచూపి ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి పిల్లలు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులతో జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి వెళ్లడానికి అనంతపురం జిల్లాకు చెందిన నాయకు బెంగళూరు నుంచి విజయవాడకు విమానం బుక్ చేసుకున్నారు. అది రద్దు కావడంతో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మెట్టు గోవిందరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, టీఎన్ దీపిక తదితరులు సమావేశానికి దూరమైనట్లు సమాచారం.
అనంతపురం పాతూరు మార్కెట్లోని కూరగాయల ధరలు కిలో రూ.లలో టమాటా (మేలు రకం)రూ.80, రెండో రకం రూ.50, మిరపకాయలు రూ.80, ఉల్లిపాయలు (మేలురకం)రూ.40, రెండోరకం రూ.30, బంగాళాదుంప రూ.40, బీన్స్ రూ.60, క్యారెట్ (మేలు రకం) రూ.40, వంకాయలు రూ.20, బెండకాయలు రూ.30, ముల్లంగి రూ.30, బీట్ రూట్ రూ.40, బీరకాయలు రూ.40, కాకరకాయలు రూ.40, క్యాబేజీ రూ.40, మునగ కాయలు రూ.60, నిమ్మకాయలు (వంద)రూ.400 పలుకుతుంది.
వృద్ధురాలి గొంతుకోసి బంగారు, నగదు దోచ్చుకెళ్లిన ఘటన గురువారం వెలుగుచూసింది. స్థానికలు వివరాల ప్రకారం.. మడకశిర మండలం ఎల్కోటి గ్రామానికి చెందిన వడ్డే చంద్రక్క అనే వృద్ధురాలు నిద్రిస్తుండగా చోరికి దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆమె గొంతుకోసి ఇంటి చెవిలో కమ్మలు, ఇంట్లో రూ.25వేలు చోరీ చేసి ఆమెను ఇంటి ఆవరణలో పడేశారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మనవరాళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులపై ఓ వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతపురం రూరల్లోని ఓ గ్రామానికి చెందిన 7, 8 ఏళ్ల బాలికలను 63ఏళ్ల రంగనాయకులు ఇంట్లోకి పిలిపించి తన సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
గుంతకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన సూర్యనారాయణపై ఎస్సీ, ఎస్టీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ సురేశ్ బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాలు.. సూర్యనారాయణ ఓ మహిళను గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. మంగళవారం రాత్రి ఆ మహిళ ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత మహిళ, ఆమె భర్త బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ నెల 29న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ సూచించారు. బుధవారం జిల్లా జడ్జి ఛాంబర్లో జాతీయ లోక్ అదాలత్పై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎస్పీలు గౌతమి శాలి, మాధవరెడ్డిలతో సమావేశమయ్యారు. లోక్ అదాలత్పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Sorry, no posts matched your criteria.