Anantapur

News June 14, 2024

యూట్యూబ్ వీడియోలను చూసి రైతులు మోసపోకండి: వ్యవసాయ అధికారి

image

యూట్యూబ్‌లో వీడియోలను చూసి వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరి సూచించారు. యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేసినట్లు వ్యవసాయాన్ని క్రియేట్ చేయలేమన్నారు. ప్రతి రైతూ అధికారుల సూచనలు, సలహాలు పాటించి పంటలను సంరక్షించుకోవాలన్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News June 14, 2024

YCP నాయకుడి గెస్ట్‌హౌస్‌కు పైపులైన్‌ తొలగించండి: గ్రామస్థులు

image

గాండ్లపెంట మండలం కల్లుబావి తండాకు సమీపంలలో YCP నాయకుడు రామాంజులు గెస్ట్‌హౌస్‌ నిర్మించుకొని పంచాయతీ బోరు నుంచి పైపులైన్‌ వేసుకున్నాడని, దీంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపించారు. ఆ పైపులైన్‌ను తొలగించాలని కోరుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ బోరు నుంచి ఎంపీటీసీ నిధులతో గెస్ట్‌హౌస్‌కు పైపులైన్‌ వేసుకొని తోటకు నీరు వాడుకుంటున్నట్లు తెలిపారు.

News June 14, 2024

శ్రీ సత్యసాయి: రోల్‌వెల్ పరిశ్రమలో వ్యక్తి మృతి

image

హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని రోల్‌వెల్ పరిశ్రమలో శుక్రవారం ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. కొటిపి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(44) రోల్‌వెల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం విధులకు వెళ్లి మృతిచెందాడు. గుండెపోటుతో మృతి చెందాడా? లేక ప్రమాదం ఏమైనా సంభవించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 14, 2024

నాలుగు నెలల చిన్నారి.. అదుర్స్..!

image

4 నెలల చిన్నారి క్రిస్టినా సియారా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆంగ్ల అక్షరాలు, జంతువులు, పండ్లు, పక్షులు.. వంటి వాటిని గుర్తించడంలో ప్రతిభ చూపి నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. గుంతకల్లు మోదీనాబాద్‌లో ఉండే రైల్వే ఉద్యోగి సుధాకర్, సింధు దంపతులు గురువారం కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిశారు. కలెక్టర్‌ సమక్షంలో మెడల్, ప్రశంసా పత్రాన్ని ప్రదర్శించారు.

News June 13, 2024

రాష్ట్రపతిని కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఢిల్లీ కేంద్రంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తారని అన్నారు.

News June 13, 2024

గంగోత్రిలో గుత్తి వాసి మృతి

image

గుత్తికి చెందిన వ్యాపారస్థుడు శ్రీరామ్ సత్య ఆంజనేయులు(65) కేదార్నాథ్‌లో మృతి చెందాడు. గత నెల 25వ తేదీ సుమారు 40మంది కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్లారు. బుధవారం రాత్రి గంగోత్రిలో ఉన్న సమయంలో శ్రీరాం సత్య ఆంజనేయులుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీంతో టూరిస్టులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News June 13, 2024

అనంత: పార్టీ ఏదైనా తగ్గని కురబల ప్రాతినిధ్యం

image

పార్టీ ఏదైనా జిల్లాలో కురుబల ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వంలో పెనుకొండ ఎమ్మెల్యే, కురుబ సామాజికవర్గానికి చెందిన శంకర్ నారాయణ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. రెండో పర్యాయంలో అదే వర్గానికి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో సవిత మెుదటిసారి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొంది మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం.

News June 13, 2024

అనంత: అరటి తోటలో మృతదేహం లభ్యం

image

నార్పల మండలం పప్పూరు గ్రామంలోని అరటి తోటలో మృతదేహం లభ్యమైంది. మృతుడు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రాంమోహన్ రెడ్డిగా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నార్పల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే అప్పులు బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది

News June 13, 2024

39 ఏళ్ల తర్వాత ధర్మవరానికి మంత్రి పదవి

image

39 ఏళ్ల తర్వాత ధర్మవరం నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కింది. ధర్మవరం అసెంబ్లీ ఏర్పడిన తరువాత ఇద్దరిని మాత్రమే మంత్రి పదవి వరించింది. మూడో వ్యక్తి సత్యకుమార్ యాదవ్. కాంగ్రెస్ నుంచి పీవీ చౌదరి మంత్రిగా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1985లో నాగిరెడ్డికి మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి 4 దశాబ్దాల పాటు ధర్మవరాన్ని మంత్రి పదవి ఊరిస్తూ వచ్చింది. తాజాగా సత్యకుమార్ యాదవ్‌కు దక్కింది.

News June 13, 2024

అనంత: టీచర్ పోస్టుల భర్తీ.. 15న ఇంటర్వ్యూ

image

ఉమ్మడి జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డెమో ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్/పార్టమ్ టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15న కురుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.