India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా విగ్రహానికి సమీపంలో ఉన్న సచివాలయం శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం JNTUలో M.Tech, M.Pharmacyలకు ఈనెల 16వ తేదీన స్పాట్ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఆర్.కిరణ్మయి తెలిపారు. దీనికి సంబంధించి ఏపీపీజీఈసెట్లో అర్హత సాధించి ఉండాలని, ఆసక్తి గల విద్యార్థులు శనివారం ఉదయం పరిపాలన భవనంలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్లను కూడా తీసుకొని రావాలని పేర్కొన్నారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి బీటెక్ 4వ సంవత్సరం పరీక్షలు వాయిదా వేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ ప్రొ. నాగప్రసాద్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని రోజుల కిందట నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు చేత తరగతులు జరగకపోగా.. ఇప్పటి నుంచి తరగతులను కాస్త పెంచుతూ DEC-4వ తేదీన జరగాల్సిన పరీక్షలను కూడా DEC-13వ తేదికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
పుట్టపర్తి మండల పరిధిలోని బడే నాయక్ తండాలో ప్రభుత్వ టీచర్ శంకర్ నాయక్ను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మద్యం తాగి పాఠశాలలో విధులకు హాజరవుతున్నారని, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనను హెచ్చరించారు. తీరు మారకపోవడంతో చర్యలు తీసుకున్నారు.
అనంతపురంలోని కృపానంద నగర్లో ఇటీవల చోరీ జరిగింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించారు. బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయస్థులే ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు చేధించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
నటి శ్రీరెడ్డిపై తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సీఐ సాయినాథ్కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా శ్రీరెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
పుట్టపర్తిలో ఈనెల 23 న జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి వేడుకలకు సీఎం నారా చంద్రబాబునాయుడును ట్రస్ట్ సభ్యలు ఆహ్వానించారు. ఈ మేరకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. తప్పకుండా ఉత్సవాలకు హాజరు కావాలని సీఎంను కోరారు.
విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ (26) అనే యువకుడు గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు బాబా ఫక్రుద్దీన్కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారు కర్నూల్ రోడ్డులోని మోడల్ స్కూల్ సమీపం గుట్టల్లో మంగళవారం రాత్రి చిరుత కలకలం రేపింది. స్థానికులు గమనించి భయంతో పరుగులు తీశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు కొండ గుట్టల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బుధవారం ఉదయం కూడా మరోసారి చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన ఆదినారాయణ(54) ఓ బాలికను 2020 నవంబర్ 18న మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువు కావడంతో జీవితఖైదు(బతికినన్ని రోజులు జైలులోనే ఉండాలి)తో పాటు రూ.1000 ఫైన్ వేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని జడ్జి ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.