India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఊహించని విధంగా ధర్మవరం సీటు సాధించి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించారనే చెప్పవచ్చు. చంద్రబాబు మంత్రివర్గంలో 24 మందికి అవకాశం దక్కగా.. బీజేపీకి కేటాయించిన ఆ ఒక్కరూ ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ కావడం విశేషం. ఈ నియోజవర్గానికి వచ్చిన కేవలం 40 రోజుల్లోనే తన రాజకీయ మార్కును సత్య చూపించారనడం అతిశయోక్తి కాదు. ‘కంగ్రాట్స్ సత్యకుమార్ యాదవ్’
అనంతపురం జిల్లాలోని ఎస్కే యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల వేసవి సెలవులను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం (జీసీటీఏ) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీసీటీఏ నాయకులు శ్రీధర్, జయప్ప, రంగనాథ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ పొగాకు రామచంద్ర రాజీనామా చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంతో 2023లో ఛైర్మన్గా రామచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో కార్పొరేషన్ల కో-ఆర్డినేటర్ పులివెందుల ప్రవీణ్ ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన ఎంసీఏ నాలుగో సెమిస్టర్ (R-20) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. మొత్తం 98% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ వెల్లడించారు. తక్కువ సమయంలోనే ఫలితాల విడుదలకు కృషి చేసిన డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డీ.విష్ణువర్ధన్ను అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలు పునఃప్రారంభించాల్సిన ఉండగా ఒకరోజు సెలవు పొడిగించినట్లు సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారిణి మీనాక్షి తెలిపారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థల వారు ఈనెల 12వ తేదీన కాకుండా 13వ తేదీన విద్యాసంస్థలను ప్రారంభించాలని ఆదేశించారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమంగా ఒకరోజు అదనపు సెలవును ప్రకటించారు.
పెనుకొండ MLA సవితకు తొలిసారి కేబినెట్లో స్థానం దక్కింది. ఈమె వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్పై గెలుపొందారు. ఈమె 1977 జనవరి 15న పెనుకొండ మండలం రామపురంలో జన్మించారు. తండ్రి ఎస్.రామచంద్రరెడ్డి. 1998లో అనంతపురం శ్రీకృష్ణ దేవరాయల యూనివర్సిటీలో BA పూర్తి చేశారు. 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈమె.. 2018లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా చేశారు. ఈ ఎన్నికల్లో తొలిసారి తొలిసారి గెలుపొందారు.
ఉమ్మడి అనంత జిల్లా నుంచి ముగ్గురిని మంత్రి పదవులు వరించాయి. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ (బీజేపీ), ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవితకు కేబినెట్లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. ఆ ఒక్కరూ మన ధర్మవరం ఎమ్మెల్యే కావడం విశేషం. వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం ప్రత్యక్ష ప్రసారం సత్యసాయి జిల్లాలోని అన్ని మున్సిపల్ కేంద్రాలలో ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి అన్ని మున్సిపాలిటీలలోని ప్రధాన కేంద్రాలలో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందన్నారు. దీనిని తిలకించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లు, టీవీ సెట్లను ఏర్పాటు చేశామన్నారు.
విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా విధులు నిర్వహిస్తున్న జిలాన్ బాషా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం ఉదయం కనేకల్లు మండలంలోని మాల్యం వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఛాతి నొప్పితో సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన తోటి ఉద్యోగులు ఆయనని కనేకల్లు క్రాస్ వద్ద ఉన్న ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.
ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం మద్యాహ్నం గ్రామానికి చెందిన బూదగవి రామలింగ అనే వ్యక్తి స్థానికి సత్యసాయి పంపుహౌస్ వద్ద నీళ్లు పట్టుకుంటుండగా ఒక్కసారిగా పైనుంచి ఎండిన చెట్టు కొమ్మ విరిగి మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిని అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
Sorry, no posts matched your criteria.