India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు సీఎం చంద్రబాబు మరోసారి ప్రాధాన్యం ఇచ్చారు. అసెంబ్లీలో విప్గా ఆయనను ఎంపిక చేశారు. 2014 నుంచి 2017 వరకు అప్పట్లో ఆయన చీఫ్ విప్గానూ వ్యవహరించారు. ఆ తర్వాత 2017-19 వరకు మంత్రిగా పని చేశారు. 1999లో టీడీపీలో చేరిన కాలవ శ్రీనివాసులు అదే సంవత్సరం అనంతపురం ఎంపీగా గెలిచారు. తర్వాత 2004, 09లో ఓడినప్పటికీ 2014లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.
గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు వైద్య సేవలు ఎక్కువ సంఖ్యలో అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. వి, ఐఏఎస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల 2024 వ బ్యాచ్ వైద్య విద్యార్థులుకు అవిన్య పేరుతో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరై ప్రసంగించారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీ సుదర్శనరావు మంగళవారం జపాన్ బృందంతో సమావేశమయ్యారు. అనంతరం పలు ఇంజినీరింగ్ విద్య ప్రణాళికల గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే టెక్నికల్ పరిజ్ఞానాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వీసీతో పలువురు విద్యావంతులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా సేవలందించారు. విప్గా ఎంపికైనందుకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
అనంతపురం జిల్లా క్రీడాకారులు కుస్తీ పోటీల్లో పట్టు పట్టారంటే మెడల్ రావాల్సిందే అన్నట్లు దూసుకెళ్తున్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న స్కూల్ గేమ్స్ల్లో అండర్ -17 బాలుర విభాగంలో రోహిత్, బాలికల విభాగంలో రాణి గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయిలో పోటీ పడి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో వారు ఢిల్లీలో డిసెంబర్ 23న జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కుస్తీ కోచ్ రాఘవేంద్ర తెలిపారు.
జిల్లాలో అపార్ జనరేషన్ సకాలంలో పూర్తిగా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో పాఠశాల విద్యా శాఖపై విద్యా, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలలోనే నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. కుప్పం, దగదర్తి, మూలపేటల్లో విమానాశ్రయాలు, అనంతపురం-తాడిపత్రి మధ్య ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో కదలిక కోసం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.792.72 కోట్లు కేటాయించింది. దీంతో ఆయా చోట్ల అనుకూలతలపై త్వరలో కేంద్రం అధ్యయనం చేయనుంది.
➤ హంద్రీనీవాకు రూ.1,867 కోట్లు
➤ HLC ఆధునికీకరణ పనులకు ₹30 కోట్లు
➤ జిల్లా సాగునీటి రంగానికి ₹2వేల కోట్లు
➤ SKUకు రూ.100 కోట్లు, JNTUకు రూ.58కోట్లు
➤ రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.19కోట్లు
➤ బిందు సేద్యం ప్రోత్సాహానికి ₹2,700కోట్ల నిధులు
➤ అన్నదాత సుఖీభవ పథకానికి ₹4,500 కోట్లు
☞ జిల్లాలోని 5లక్షల మంది రైతులకు లబ్ధి
➤ తల్లికి వందనం పథకానికి రూ.6వేల కోట్లు
☞ ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మంది లబ్ధిదారులు
అనంతపురం జిల్లాలో NH-544D, NH-67, NH-544DD, NH-42, NH-150A జాతీయ రహదారులకు సంబంధించి వచ్చే డిసెంబర్ నెలాఖరులోపు భూసేకరణ పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టర్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు.
స్కేటింగ్లో బుడతడు సత్తా చాటుతూ అందరినీ ఔరా.. అనిపిస్తున్నాడు. అనంతపురానికి చెందిన హంజా హుస్సేన్ అనే చిన్నారి 36వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రెండు బంగారు, ఒక వెండి పతకాలను సాధించాడు. కాకినాడలో జరిగిన 7 నుంచి 9 ఏళ్ల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చాటడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు జిల్లా కార్యదర్శి రవి బాల, కోచ్ నాగేంద్ర, హేమంత్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.