India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉడేగోళానికి చెందిన పదో తరగతి చదువుతున్న చరణ్ను రెండు నెలల కిందట రాయదుర్గం మండలం 74 ఉడేగోళం వద్ద ఉన్న హైవేపై రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలను ఈనెల 15న శనివారం నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అనీల్కుమార్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు ఆధార్కార్డు, పదోతరగతి మార్కుల జాబితా, జనన ద్రువీకరణ పత్రం, క్రీడా సామగ్రి, యూనిఫాంతో హాజరుకావాలన్నారు. ఎంపికైన జట్టు ఈ నెల 27 నుంచి ధర్మవరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
తాడిపత్రిలో ఎన్నికల నేపథ్యంలో మే 13, 14వ తేదీల్లో జరిగిన అల్లర్లపై సిట్ ఎన్నికల సంఘానికి ఈనెల 1న తుది నివేదిక అందజేసింది. అల్లర్లపై మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్, జూనియర్ కళాశాల మైదానం, టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద జరిగిన దాడులు, ఏయే కేసుల్లో ఎంత మందిని నిందితులుగా గుర్తించారు? లాంటి వివరాలతో మొత్తం 370 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది.
అనంతపురంలోని స్థానిక ఏరా ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 16న ఉదయం 9 గంటలకు జిల్లా ఆర్చరీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ సంఘం జిల్లా కార్యదర్శి శివకుమార్ తెలిపారు. అండర్-10, 13, 15 విభాగాల్లో మాత్రమే ఈ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న జిల్లా క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, 4 ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికైన వారు విజయవాడలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని తెలిపారు.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో గత నెలలో నిర్వహించిన MCA, MBA పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. MCA 3, 4వ సెమిస్టర్, MBA మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ జిల్లా మైనార్టీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి కోరారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జనచైతన్య నగర్ కాలనీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అప్పుడే శ్రావణికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని జిల్లా టిడిపి మైనార్టీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి కోరారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జన చైతన్య నగర్ కాలనీ యందు బాబా ఫక్రుద్దీన్ వలి మాట్లాడుతూ.. ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారని.. అప్పుడే శ్రావణికి మంత్రి పదవి ఇవ్వాలన్నారు.
రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో కనివిందు చేశారు. రూ.50వేలు విలువచేసే నాణేలతో స్వామి మూలవిరాట్ని అలంకరించారు. పురోహితుల రామకృష్ణ స్వామి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామి వారి విశేష అలంకరణను దర్శించుటకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
కూడేరులోని ఏటీఎమ్ సెంటర్లో జరిగిన చోరీపై అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి సీరియస్గా స్పందించారు. సోమవారం రాత్రి ఆమె చోరీ జరిగిన ఏటీఎమ్ సెంటర్ ను పరిశీలించారు. ఇప్పటివరకు ఎక్కడా జరగని రీతిలో గ్యాస్ కట్టర్తో కట్ చేసి అందులోని 18 లక్షల పైగా నగదు చోరీ చేయడంపై లోతైన విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఆమె ప్రత్యక్షంగా పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఐదేళ్ల కిందట మూతబడగా.. ఎమ్మెల్యే బాలకృష్ణ తొలి అన్న క్యాంటిన్ను తన నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. హిందూపురం నుంచి మూడోసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు రుణపడి ఉంటానని బాలయ్య పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.