India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈతకోసం వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. పెనుకొండ పట్టణానికి చెందిన సంతోశ్, స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టడానికి గొల్లపల్లి రిజర్వాయర్కు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోతున్నా యువకుడిని గమనించి అక్కడి వారు కాపాడటానికి ప్రయత్నించినప్పటికి అప్పటికే మృతి చెందారు. కియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రైతు బిడ్డ సతీశ్ రెడ్డి JEE ఓపెన్ కేటగిరీలో 175వ ర్యాంకు సాధించాడు. సతీశ్ రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. సతీశ్ రెడ్డి 8వ తరగతి నుంచి విజయవాడలో చదివాడు. ఐఐటీ సీటు సాధించాలనే లక్ష్యంతో చదివి, విజయం సాధించానని తెలిపాడు. సతీష్ రెడ్డి ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
సోమందేపల్లి మండల కేంద్రంలోని బుసయ్యగారి పల్లికి చెందిన సోమశేఖర్ ఆదివారం మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమశేఖర్కు కొడుకు, కుమార్తె సంతానం ఉన్నారన్నారు. కుమార్తెకు ఈనెల 8న వివాహం నిశ్చయం కాగా.. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతో ఉరేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.
JEE అడ్వాన్స్డ్ పరీక్షల్లో అనంత జిల్లా కుర్రాళ్లు మెరిశారు. అనంతకు చెందిన కుశాల్ కుమార్ 5వ ర్యాంకు, సాయి తేజేశ్ 54, సతీశ్ కుమార్రెడ్డి 175, సాయిగౌతమ్ 204, శశికిరణ్ 982వ ర్యాంకు సాధించారు. బీ.సముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రైతు బిడ్డ సతీశ్రెడ్డి, ఎన్పీకుంటకు చెందిన సాయి దివ్యతేజరెడ్డి 175వ ర్యాంకులు సాధించారు. గాండ్లపెంట మండలం తాళ్లకాల్వకు చెందిన ముజమ్మిల్ 823 ర్యాంకు సాధించాడు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం ఒకేరోజు వివిధ కారణాలతో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాలలో విషాదం నెలకొంది. జిల్లాలోని పుట్లూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, పెద్దపప్పూరు, అమడగూరు, సోమందేపల్లి మండలాలలో ఈ ఘటనలో చోటుచేసుకున్నాయి. వ్యవసాయ సాగులో నష్టం భరించలేక ఒకరు, కుటుంబ కలహాలతో మరొకరు, ప్రేమించిన యువతి దక్కలేదని ఇంకొకరు.. ఇలా పలువురు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ఆదివారం అనంతపురం జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. వీరిలో రాష్ట్ర బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు అంకుల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చిరంజీవి రెడ్డి, కడప అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు హాజరై స్వీకారోత్సవం వేడుకలను తిలకించారు.
పుట్లూరు మండలంలో యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని సంజీవపురం గ్రామానికి చెందిన ఉమ్మడి ముఖేశ్ కుమార్ రెడ్డి మూడు ఏళ్లుగా అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆదివారం బాత్ రూమ్ క్లీన్ చేసే యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కళ్యాణదుర్గం మండలం మంగళకుంటకు చెందిన కురుబ నాగరాజు(34) తన వ్యవసాయ పొలంలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు నాగరాజుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని అనంతపురం ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి పికెట్లు ఏర్పాటు చేసి మొబైల్ పార్టీలు తిప్పుతున్నామన్నారు. ముఖ్యమైన గ్రామాల్లో ఏపీఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపామని చెప్పారు. ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా FIR నమోదు చేస్తున్నామన్నారు. నాన్ కాగ్నిజబుల్ నేరమైనా కోర్టు అనుమతితో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
రొళ్ల మండలం పిల్లిగుండ్లపల్లి గ్రామానికి తేజేశ్వర్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటల మధ్యలో మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్లో చదువుకొని హాస్టల్కి బైక్పై వెళుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.