Anantapur

News December 25, 2024

అనంతపురం: 24 గంటల్లో 644 కేసులు నమోదు

image

గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన దాడుల్లో 644కేసులు నమోదు చేసి రూ.1,67,230ల జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎం.వి. కేసులు నమోదు చేయడంతో పాటు మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు.

News December 24, 2024

మోసపూరిత ప్రచారాలతో జాగ్రత్త: జేసీ అభిషేక్

image

వినియోగదారులు మోసపూరిత ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News December 24, 2024

రాప్తాడులో జగన్ ఫ్లెక్సీల చించివేత

image

రాప్తాడు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ నెల 21న జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. అయితే సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను చించివేశారు. ఈ ఘటనపై ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News December 24, 2024

అనంతపురం జైలుకు తెలంగాణ యువకుడు

image

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన తెలంగాణ యువకుడు విజయ్‌ను అనంతపురం గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. కాగా సీఎం కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ టీఎన్ఎస్ఎఫ్ నేత మహమ్మద్ రఫీ ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

News December 24, 2024

జిల్లాస్థాయి ఆర్డీటీ ఫుట్‌బాల్ విజేతగా లేపాక్షి జట్టు 

image

జిల్లా స్థాయి ఆర్డీటీ ఫుట్‌బాల్ విజేత జట్టుగా లేపాక్షి జట్టు విజేతగా నిలిచింది. ఫుట్‌బాల్ క్లబ్ ఆర్డీటీ అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్ 12 బాలికల పోటీల్లో లేపాక్షి మండల ఫుట్‌బాల్ క్లబ్ విజేతగా నిలిచింది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ లీగ్ పోటీలలో ఫైనల్ రౌండ్‌కు చేరుకొని జిల్లాలోని ఉత్తమ జట్లపై విజయం సాధించి మొదటి స్థానంలో గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు.

News December 23, 2024

బీసీలపై సీఎం చంద్రబాబు వరాల జల్లు: మంత్రి సవిత

image

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. సోమవారం మంత్రి మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్ల విద్యార్థుల డైట్ బిల్లుల కోసం బడ్జెట్‌లో కంటే అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డైట్ ఛార్జీలకు రూ.135 కోట్లు చెల్లించారని, ఇప్పుడు అదనంగా రూ.45.52 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News December 23, 2024

అల్లు అర్జున్‌పై ఏసీపీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత

image

హీరో అల్లు అర్జున్‌పై ఏసీపీ విష్ణుమూర్తి చేసిన వ్యాఖ్యలను BJP నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ‘వీధి రౌడీ భాషలో ఒక పోలీస్ అధికారి మీడియా ముందు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం తప్పు కాదా? విష్ణుమూర్తి ఇలా మాట్లాడేందుకు తెలంగాణ డీజీపీ అనుమతి ఇచ్చారా? తెలంగాణలో అల్లు అర్జున్‌కు ఆధార్ కార్డుందా అని ప్రశ్నించడానికి అతనెవరు?’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.

News December 23, 2024

అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన పరిటాల శ్రీరామ్

image

బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఎరుకల శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. కార్యకర్తను విడుదల చేయించారు. కాగా జనసేన నాయకుల ఒత్తిడితోనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.

News December 23, 2024

పుట్టపర్తిలో డ్రోన్ కెమెరాలతో నిఘా

image

పుట్టపర్తి గ్రామీణ ప్రాంతాలలోని నిర్మానుష్య ప్రదేశాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతాలైన అమకొండపాళ్యం, వెంగళమ్మ చెరువు పరిసర ప్రాంతాలతో పోలీసులు ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం తాగటం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ జరగకుండా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ పెట్టారు.

News December 22, 2024

ప్రజా సమస్యలపై రేపు అర్జీలు స్వీకరిస్తాం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రజా సమస్యలపై రేపు (సోమవారం) అర్జీలు స్వీకరిస్తామని అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమం ఉంటునాదన్నారు. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాలని కోరారు.