India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డు-2025 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి కరుణ కుమారి తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవలు, ఇంజినీరింగ్, ప్రజా సంబంధాలు, సివిల్ సర్వీసెస్, ట్రేడ్, ఇండస్ట్రీ రంగాల్లో ఉత్తమ సేవలు చేసి ఉండాలన్నారు. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
గుంతకల్లు: సెంట్రల్ రైల్వేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బిలాస్పూర్ నుంచి యలహంక వెళ్లే ఎక్స్పైస్ ప్రత్యేక రైలు (08291)ను ఈనెల 15, 18, 22, 25, 29 జలై 1, 4, 8 తేదీల్లోనూ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 08292)ను ఈనెల 17, 20, 24, 27 జలై 1, 4, 8 తేదీల్లోనూ రద్దు చేస్తునట్లు తెలిపారు
వైసీపీ ప్రభుత్వంలో జగన్ను ప్రజా ప్రతినిధులు కలవాలంటే సీఎంఓ దూరం పెట్టిందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ధర్మవరంలో రైల్వే ఉపరిత వంతెన నిర్మాణ భూసేకరణకు రూ.15 నుంచి 20 కోట్లు మంజూరు కోసం సీఎం కార్యాలయం చూట్టూ, గుంతలు పడిన రోడ్ల నిధుల కోసం ఫైనాన్స్ సెక్రటరీ వద్దకు యాభైసార్లు తిరిగానని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మేనిఫెస్టో మీద నమ్మకం పెట్టుకున్నారన్నారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. కాగా వారి అందరి పేర్లు ‘S’ అక్షరంతో మెుదలవడం విశేషంగా చెప్పవచ్చు. రాప్తాడు నియోజకవర్గం నుంచి సునీత, పెనుకొండ నుంచి సవిత, శింగనమల నుంచి శ్రావణిశ్రీ, పుట్టపర్తి నుంచి సింధూర రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. వీరిలో పెనుకొండ నుంచి సవిత 33వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
కొత్తచెరువు మండలంలోని నారాయణపురం రైల్వేస్టేషన్ పరిధిలో గుర్తుతెలియని యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు హిందూపురం రైల్వే హెచ్సి ఎర్రిస్వామి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటంతో శరీరం నుంచి తల వేరైందని తెలిపారు. 30 ఏళ్ల యువకుడు నీలం రంగు ప్యాంటు, సిమెంటు కలర్ టీషర్టు, నల్లని బూట్లు ధరించాడని తెలిపారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు.
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో మంత్రి పదవి ఎవరికి వస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
రామగిరి మండలంలోని సుద్దకుంటపల్లి తండాలో వేట కొడవళ్లు పట్టుకొని వీరంగం సృష్టిస్తున్నారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల తర్వాత కొందరు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు తప్ప ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేదన్నారు. సంబరాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టేమన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలో అదుపుతప్పి పోలీసులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. సోమందేపల్లి మండల పరిధిలోని పూలే కమ్మ గుడి వద్ద పెనుకొండ డిఎస్పీ బాబిజాన్ సైదా, కానిస్టేబుళ్లు సోమందేపల్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలైన వారిని చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మండుతున్న కూరగాయల ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి తీవ్రత, సాగునీటి కొరత, తెగుళ్లు, గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాలతో కూరగాయల సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా వీటి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. టమాటా, పచ్చి మిరపకాయల ధర కొండెక్కాయి. టోకు మార్కెట్లో (పాతూరు మార్కెట్) కిలో టమాటా ధర రూ.50, పచ్చి మిరపకాయలు కిలో రూ.100 పలుకుతుంది.
పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట గ్రామంలో అశ్విని అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై అమానుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజినేయులు కుమార్తె అశ్విని ఇంటర్ మీడియట్ చదువు మధ్యలో ఆపేసింది. చదువుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.