Anantapur

News November 8, 2024

అంగన్వాడీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: ఐసీడీఎస్ పీడీ

image

అనంతపురం జిల్లాలో ఇటీవల నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు, ఆయాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు ఐసీడీఎస్ పీడీ డాక్టర్ శ్రీదేవి గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మెయిన్, మినీ అంగన్వాడీ వర్కర్ సహా ఆయా ఖాళీలు మొత్తం 84 పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించగా.. 61 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. వారిలో మెయిన్ అంగన్వాడీ పోస్టులు 9 కాగా, ఐదు పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు.

News November 7, 2024

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఎస్పీ రత్న ఆదేశాల మేరకు హిందూపురం, పరిగి, కదిరి, బత్తలపల్లి ప్రాంతాల్లో పోలీసులు గురువారం గ్రామాల్లో పర్యటించి గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని గొడవలు, అల్లర్లకు పాల్పడకూడదని తెలిపారు. లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News November 7, 2024

భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యలపై అవగాహన పెంపొందించుకొని వాటిని సత్వరమే పరిష్కరించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు.

News November 7, 2024

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు: ఎస్పీ

image

సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసినా, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం ఎస్పీ ప్రకటన విడుదల చేస్తూ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా, వ్యక్తిగత పేరున ఫొటోలు మార్ఫింగ్ చేసినా, మానాభిమానులు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 7, 2024

సాగునీటికి ప్రతిపాదనలే కాదు.. నిధులు కావాలి: సీపీఎం

image

అనంతపురం జిల్లాలోని సాగునీటి వనరుల అభివృద్ధి కోసం అధికారులు ప్రతిపాదనలకే పరిమితం కాకుండా నిధులు రాబట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు. పీఏబీఆర్ రిజర్వాయర్‌ను 11.10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించి 3 దశాబ్దాలైనా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందని, ప్రతిపాదనలే కాక నిధుల మంజూరుకు ప్రయత్నించాలన్నారు.

News November 7, 2024

విషాదం.. తండ్రీకూతురి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న రమేశ్, ఆయన కూతురు భవిత నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురానికి తరలించి చికిత్స అందిస్తుండగా తండ్రీకూతురు మృతి చెందారు. 10వ తరగతి చదువుతున్న భవిత స్టేట్ లెవెల్ హోకీ పోటీలకు హాజరై తిరిగి వస్తుండగా గుట్టూరు వద్ద వారు ప్రమాదానికి గురయ్యారు. తండ్రీకూతురి మృతి ఆ కుటుంబంలో విషాదం నింపింది.

News November 7, 2024

అనంతపురం జిల్లా పోలీసుల ఉక్కుపాదం

image

అనంతపురం జిల్లాలో నెల రోజులుగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతానిబంధనల ఉల్లంఘనలపై 12,546 కేసులు నమోదు చేసి రూ.28,30 లక్షలు జరిమానా విధించారన్నారు. మట్కాపై 82 కేసుల్లో 138 మందిని అరెస్టు చేసి రూ.21,94 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరాలపై దాడుల్లో 118 కేసుల్లో 344 మందిని అరెస్ట్ చేసి రూ.10.33 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు.

News November 7, 2024

ఇన్సూరెన్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ఉద్యాన పంటల పరంగా టమోటా పంటను పంటల బీమా పథకంలో గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలో టమోటా పంటను బీమా చేసే సదుపాయం IFFCO-TOKIO అనే కంపెనీకి ఇవ్వడం జరిగిందని, ఒక ఎకరాకి కంపెనీ వారు రూ.32,000 వరకు పంటను బీమా చేస్తారన్నారు. దీనికి రైతు 10శాతం బీమా ప్రీమియం చెల్లించాలన్నారు.

News November 6, 2024

గ్రామసభల ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని భూ సమస్యలను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారంలో నాలుగు రోజులు గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం మినహా మిగిలిన రోజులు పంచాయితీ లేదా రెవెన్యూ గ్రామసభలను నిర్వహించాలన్నారు.

News November 6, 2024

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

image

ధర్మవరం నుంచి పెనుకొండకు వస్తున్న పీఈటీ రమేశ్ కూతురు సాయి భవిత(15) బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రీకూతుళ్లిద్దరూ బైకులో వస్తుండగా.. గుట్టూరు సమీపంలో వెనకనుంచి బొలెరో ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయి భవిత మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేశ్‌ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.