India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు. 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు అధిక శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులకు 15058 ఓట్లు, వైసీపీ అభ్యర్థులకు 7598 ఓట్లు వచ్చాయి. అందులో అధికంగా అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్కు 4272, రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు 2406 వచ్చాయి.
మడకశిరలో ఈవీఎంలు మార్చారనే వ్యాఖ్యలపై మడకశిర తాజా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందించారు. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కోడి గుడ్డుపై ఈకలు పీకారా అంటూ వైసీపీపై ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు అక్కడే ఉన్నారన్నారు. వైసీపీ పార్టీ ఏజెంట్లు ఇతర అధికారులు ఉండగా ఈవీఎం ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఈవీఎంలు ఎక్కడా మార్చలేదని స్పష్టం చేశారు.
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని అనంత విద్యానికేతన్ పాఠశాల సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. దెబ్బతిన్న కారు శింగనమల తహశీల్దార్దిగా గుర్తించారు. ప్రమాదంలో కార్ డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతపురం నుంచి శింగనమలకు వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని సమాచారం.
ధర్మవరం నియోజక వర్గంలో నోటాకు 1787 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ రోజు 2,20,455 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డికి 102810 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్కు 106544 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్వర్థ నారాయణకు 3758 ఓట్లు వచ్చాయి. మిగిలిన 13 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు.
శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖ సిబ్బంది సమిష్టిగా పనిచేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయడం హర్షనీయమన్నారు.
మడకశిర మండల పరిధిలోని గుర్రప్పకొండ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సగం కాల్చినట్టు గుర్తించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించింది. 8 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొందారు.
☞ బండారు శ్రావణి శ్రీ 8,788
☞ అమిలినేని సురేంద్ర బాబు 37,734
☞ పయ్యావుల కేశవ్ 21,704
☞ పరిటాల సునీత 23,329
☞ జేసీ అస్మిత్ రెడ్డి 25,865
☞ గుమ్మనురు జయరాం 6,826
☞ కాలవ శ్రీనివాసులు 41,659
☞ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 23,023
కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు భద్రతా చర్యలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర బలగాలతో జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఎస్పీ సమావేశమయ్యారు. అందరూ సమష్టిగా కష్టపడటం వల్లే జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు.
రాష్ట్ర రాజీకీయాల్లో శింగనమల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది. 1978 నుంచి వస్తున్న ఈ సెంటిమెంటును టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలిచి నిరూపించారు. మరోవైపు ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటుందని.. 20 ఏళ్లగా వస్తున్న సెంటిమెంటును పయ్యావుల కేశవ్ మరోసారి గెలిచి దానిని రూపుమాపారు.
గుమ్మనూరు జయరామ్కు గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.