India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం నగరంలో ఆదివారం సినీ నటుడు హీరో శ్రీకాంత్ సందడి చేయనున్నారు. నేటి సాయంత్రం 5:30 గంటలకు స్థానిక నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హీరో శ్రీకాంత్ వస్తుండటంతో అభిమానులు ఇప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటూ సందడి చేస్తున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై కేసు నమోదైంది. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించిన ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి మీడియాపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మాధవ్, సాక్షి మీడియాపై పోక్సో చట్టంలోని సెక్షన్ 23, BNSలోని 72, 79 సెక్షన్ల కింద విజయవాడ సైబర్ క్రైం పీఎస్లో కేసు నమోదైంది.
ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు పట్టణానికి చెందిన అంజిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
ఐదు నెలల కాలంలో జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ రాష్ట్ర రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి సత్య ప్రసాద్ జిల్లా అభివృద్ధి సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు పట్టణానికి చెందిన అంజిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
అనంతపురం జిల్లాస్థాయిలో జరిగిన సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో తాడిపత్రి విద్యార్థి అబ్బాస్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన పోటీల్లో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 9న గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పీఈటీ చంద్ర తెలిపారు. విద్యార్థి అబ్బాస్ను హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లాలో 96.68, సత్యసాయి జిల్లాలో 94.63 శాతం పంపిణీ పూర్తయింది. అనంత జిల్లాలో 2,82,554 మందికి గానూ 2,73,185 మందికి, సత్యసాయి జిల్లాలో 2,66,137 మందికి గానూ 2,51,848 మందికి పింఛన్ సొమ్ము అందింది. నిన్న సర్వర్ ప్రాబ్లంతో పంపిణీలో కొంత జాప్యం జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూ సేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎన్హెచ్ 342, 716జీ, జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ బెంగళూరు- కడప- విజయవాడకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు సేకరించిన భూమి వివరాలను తెలుసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలం కొండకమర్లలో మెహెతాజ్ (36) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ఆమెకు కొంతకాలంగా ఇర్ఫాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ మరో వ్యక్తితో కూడా చనువుగా ఉందని అనుమానించిన ఇర్ఫాన్ రాత్రి ఆమెను హత్య చేశాడు. తానే చంపినట్లు శుక్రవారం పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చి లొంగిపోయాడు. ఓబులదేవరచెరువు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురయ్యారు. అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్లో గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వెపన్ క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయింది. ఘటనలో ఆయన గాయపడ్డారు. సిబ్బంది వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.