India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో మంగళవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ను అధికారులు ఛాలెంజ్గా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్ఓలు, తహశీల్దార్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడా లోపం రాకుండా పని చేయాలని తెలిపారు. సమస్య తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకరావాలని కోరారు.
మండల కేంద్రమైన నార్పల కొండ వంక ప్రాంతంలో నివాసం ఉంటున్న నారాయణస్వామి మనవడు రాజేశ్, గ్రామానికి సమీపంలో తోటలోకి సోమవారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు రాజేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి అయిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుఃఖంతో ఆవేదన చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ జరగనున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా ఎస్పీ గౌతమి శాలి సుడిగాలి పర్యటన చేశారు. అధికారులతో కలిసి అన్ని నియోజక వర్గాల కౌంటింగ్ కేంద్రాలని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునే వారిని ఊపేక్షించవద్దని తెలిపారు.
సత్యసాయి జిల్లాలో టీడీపీ-3 వైసీపీ-3 కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని RTV అంచనా వేసింది. ➢ రాప్తాడు: YCP తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ➢ ధర్మవరం :YCPకేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ➢ హిందుపురం: TDP నందమూరి బాలకృష్ణ ➢పెనుకొండ :TDPసవితమ్మ ➢ కదిరి :TDPకందికుంట వెంకట ప్రసాద్➢ మడకశిర :congress సుధాకర్ ◆పుట్టపర్తి: YCPదుద్దకుంట శ్రీదర్ రెడ్డి గెలుస్తారని తెలిపింది.
అనంతపురం జిలాల్లో టీడీపీ-4 వైసీపీ-3 స్థానాల్లో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది. ➢ అనంతపురం YCP అనంత వెంకట రామిరెడ్డి ➢ రాయదుర్గం: TDP కాలవ శ్రీనివాసులు ➢ ఉరవకొండ: TDPపయ్యావుల కేశవ్ ➢ కల్యాణ దుర్గం : TDPఅమిలినేని సురేంద్ర బాబు ➢ తాడిపత్రి:YCP కేతిరెడ్డి పెద్దారెడ్డి➢ సింగణమల: YCP వీరాంజనేయులు ➢ గుంతకల్: TDP గుమ్మనురు జయరాం విజయం సాధిస్తారని పేర్కొంది.
ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ప్రహరీ కూలి మీద పడటంతో బన్నీ(21) అనే యువకుడు మృతి చెందాడు. అతడితోపాటు ఒక ఎద్దు కూడా మృతి చెందగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. బన్నీ ఎద్దులను నీటితో శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గోడ కూలి మీద పడింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. సోమవారం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచన ఉందన్నారు. మిగిలిన రోజుల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు.
అనంతపురం: ఏపీపాలిసెట్-2024లో భాగంగా సోమవారం నిర్వహించాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రిన్సిపాల్ సి.జయచంద్రా రెడ్డి తెలిపారు. 3న జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలనను 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ మేరకు షెడ్యూల్ మార్పు చేశామన్నారు. అదే విధంగా వెబ్ ఆప్షన్లు ఈ నెల 7నుంచి ఇచ్చుకో వచ్చునని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 280 సీసీ కెమెరాలతో పాటు ఇదివరకే ఏర్పాటు చేసిన మరో 450 కెమెరాలతో భద్రతను పర్యవేక్షించాలని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు. ఈ కెమెరాలను జిల్లా కేంద్రంలోని ఈ సర్వేలెన్స్ సెంటర్కు అనుసంధానించినట్లు తెలిపారు. ఏ చిన్న అవాంచనీయ ఘటనకు పాల్పడినా, అల్లర్లు, ఘర్షణలకు దిగినా సీసీ పుటేజీల్లో దొరికిపోతారన్నారు. కేసులు నమోదైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాయదుర్గం కౌంటింగ్ ప్రధాన భవనం ఫస్ట్ ఫ్లోర్, ఉరవకొండ అడ్మినిస్టేటివ్ భవనం గ్రౌండ్ ఫ్లోర్, గుంతకల్లు మెయిన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, తాడిపత్రి మెయిన్ బిల్డింగ్ సౌత్వింగ్ గ్రౌండ్ ఫ్లోర్, శింగనమల ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, అనంతపురం కౌంటింగ్ ఈసీఈ గ్రౌండ్ ఫ్లోర్, కళ్యాణదుర్గం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, రాప్తాడు ఈసీఈ నార్త్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.