Anantapur

News October 30, 2024

RESULTS: ఫార్మా డీ ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 2, 3, 4 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R14, R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News October 30, 2024

టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎమ్యెల్యే MS రాజు నియామకం

image

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా మడకశిర నియోజకవర్గం ఎమ్యెల్యే MS రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఈయన ఒక్కరికే బోర్డు సభ్యుడిగా అవకాశం రావడం విశేషం.

News October 30, 2024

అనంత: ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

image

బెలుగుప్ప మండలం జీడిపల్లికి చెందిన నవ్య(22) ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నవ్య డిగ్రీ చదవడంతో పాటు సాఫ్ట్‌వేర్ కోర్సులు చేసింది. పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. కానీ ఉద్యోగం దొరకలేదు.ఇక ఉద్యోగం రాదనే బెంగతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 30, 2024

శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలు పకడ్బందీగా జరగాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 15వ తేదీలోగా జయంతి వేడుకలకు సంబంధించి అన్ని పనులు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికతో పనులు చేపట్టాలన్నారు.

News October 30, 2024

తుంగభద్ర జలాశయానికి తగ్గిన ఇన్ ఫ్లో

image

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గిందని డ్యామ్ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 13,893 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోందన్నారు. ప్రస్తుతం 101.773 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. 15,054 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

News October 30, 2024

గుత్తి రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ 

image

గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి షేక్ మహమ్మద్ వలికి సైబర్ నేరగాళ్లు రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. నాలుగు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని మహమ్మద్ వలికి కాల్ చేశారు. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందని బెదిరించారు. వెంటనే అరెస్టు చేయకూడదంటే మీ వద్ద ఉన్న డబ్బంతా తమ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు. దీంతో బాధితుడు భయపడి డబ్బు బదిలీ చేశాడు.

News October 30, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.28

image

అనంతపురం రూరల్‌ స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.28తో అమ్ముడు పోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 975 టన్నుల దిగుబడులు వచ్చాయని ఆయన అన్నారు. కిలో సరాసరి ధర రూ.20, కనిష్ఠ ధర రూ.13 పలికినట్లు తెలిపారు. మార్కెట్లో టమాటా ధరలు క్రమేణా తగ్గుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 30, 2024

అనంతపురం జిల్లాకు వర్ష సూచన

image

రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడతాయని చెప్పారు. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 33-34.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావచ్చని తెలిపారు. ఇక గాలులు గంటకు 2 కి.మీ వేగంతో వీచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

News October 30, 2024

అనంత జిల్లాలో 20,20,441 మంది ఓటర్లు

image

అనంతపురం జిల్లా 2025 ఓటర్లు జాబితాను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 20,20,441 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో పురుష ఓటర్లు 9,98,784 మంది, మహిళా ఓటర్లు 10,21,412 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 245 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జాబితా విడుదల చేసినట్లు తెలిపారు.

News October 30, 2024

టపాసులు విక్రయించేవారు నిబంధనలు తప్పక పాటించాలి: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంలో టపాసులు విక్రయించేవారు నిబంధనలను తప్పక పాటించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. టపాసులు పేల్చే సమయంలో తల్లితండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీపావళి పండుగ జరుపుకునే సమయంలో ఎంత కాంతి, ఆనందాన్ని ఇస్తుందో అవి వికటిస్తే కుటుంబాల్లో అంతే విషాదం తెచ్చిపెడతాయన్నారు. అందుకోసమే టపాసులు విక్రయించే వారితో పాటు పేల్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.