India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లకు గాను NDA కూటమి 8-9 గెలుస్తుందని బిగ్టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
పోస్ట్ పోల్ సర్వే ప్రకారం అనంతపురం జిల్లాలో ఎన్డీఏ కూటమికి 9-10, వైసీపీకి 4-5 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు అనంతపురం, హిందూపురం ఎంపీ స్థానాల్లో టీడీపీనే గెలవనుందని చాణక్య ఎక్స్ పేర్కొంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ను కేకే సర్వే వెల్లడించింది. మొత్తం 14 సీట్లకు గాను 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయనున్నారని వెల్లడించింది. వైసీపీ ఖాతా తెరిచే అవకాశమే లేదని అంచనా వేసింది. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలవనున్నారని పేర్కొంది. కాగా ధర్మవరంలో మాత్రమే బీజేపీ పోటీ చేయగా సత్యకుమార్ యాదవ్ గెలిచే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎన్నికల సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకుగాను కూటమి 9, వైసీపీకి 3 విజయం, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండనుందని వెల్లడించింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వేలో ఫలితాన్ని ప్రకటించారు. అలాగే పెనుకొండ వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి, గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఓడిపోతారని వెల్లడించింది.
చెన్నెకొత్తపల్లి మండలం బసంపల్లి వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధర్మవరం పట్టణం ఎల్సీకే పురానికి చెందిన గొల్ల నారాయణ, ఇందిరమ్మ కాలనీకి చెందిన కందిమల్ల కృష్ణయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై చెన్నెకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో ఎన్నికల అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఆరు వేల మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. జూన్ 4న జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఏజెంట్లుగా వెళ్లే వారికి ఐడి కార్డు లేకుంటే అనుమతించమని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల నివాసులందరికి నోటీసులు అందించామని వెల్లడించారు.
పరిగి మండలం ధనాపురం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు రాష్ట్రం హోసూరు చెందిన వారీగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కొనసాగింది. ఇప్పటిదాకా హిందూపురం పరిధిలో 1469మంది రైతులకు 1065.10 క్వింటాళ్లు, మడకశిరలో 799 మందికి 696.80, పెనుకొండలో 949 మందికి 940.30, కదిరిలో 3512 మందికి 2751.30, ధర్మవరంలో 1453 మందికి 1312.30 క్వింటాళ్లు పంపిణీ చేసినట్టు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో కొత్తచెరువు వైసీపీ మండల కన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి మృతిచెందిన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపాన గల రామాలయం వద్ద బైక్లో వెళుతున్న ఆయనను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.