Anantapur

News June 1, 2024

అనంతపురంలో హలో రైతన్న కార్యక్రమం

image

అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7: 15 నిమిషాల నుంచి 8 గంటల వరకు హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ , రేకులకుంట వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి, టెలిఫోన్08554 225533 ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

News June 1, 2024

పెనుగొండలో ఉరి వేసుకొని మహిళ సూసైడ్

image

పెనుగొండలో ఉరి వేసుకుని శనివారం గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద కోడిపల్లి సమీపంలోని ప్రధాన రహదారికి 300 మీటర్ల దూరంలో పంట పొలాల్లో వేప చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మహళను ఎవరైనా గుర్తిస్తే పెనుకొండ సీఐ ,9440796841 ,రొద్దం ఎస్ఐ 9440901902 నంబర్‌లకు ఫోన్ చేయాలన్నారు.

News June 1, 2024

అనంత జిల్లాకు వర్ష సూచన

image

అనంతపురం జిల్లాకు రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని వారు పేర్కొన్నారు.

News June 1, 2024

అనంతపురం అర్బన్‌లో అత్యధిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మే 3 నుంచి 10 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. అందులో ఆనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అత్యధికంగా 6,971 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. రెండవ స్థానంలో రాప్తాడు 4,338 ఓట్లు నమోదు అయ్యాయి. రాయదుర్గం 1,671, ఉరవకొండ 2,544, గుంతకల్ 3,612, తాడిపత్రి 2,702, సింగనమల 2,450, కళ్యాణదుర్గం 2,612 ఓట్లు నమోదు అయ్యాయి.

News June 1, 2024

తాడిపత్రి: ఐచర్-కారు ఢీ.. ఒకరి మృతి

image

తాడిపత్రి మండలం వంగనూరు క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్-కారు ఢీకొన్న ఘటనలో సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. అనంతపురం జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం అనంతపురం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి అనంతలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

యాడికిలో మహిళ ఆత్మహత్య

image

యాడికి మండలం కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో గీత అనే మహిళ శుక్రవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివాహమై ఐదు సంవత్సరాలు పూర్తయినా.. పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

తాడిపత్రిలో కొనసాగుతున్న అరెస్టులు

image

తాడిపత్రి అల్లర్ల కేసులో మరో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టుచేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గౌస్ బాషా శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మొత్తం ఈ అల్లర్ల కేసులో 140 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.

News May 31, 2024

ఐదేళ్లు పోలీసులు ఎవరి కనుసన్నల్లో పని చేశారు : పరిటాల సునీత

image

ఐదేళ్ల పాటు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇప్పుడు పోలీసులు, ఎన్నికల కమిషన్ నిజాయితీగా పని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పరిటాల సునీత విమర్శించారు. రామగిరి మండలం వెంకటాపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ కనుసన్నల్లో పోలీసులు బైండోవర్లు చేస్తున్నారని ఆరోపించడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు.

News May 31, 2024

ఏడీసీసీ బ్యాంక్ సీఈఓగా సురేఖారాణి

image

ఏడీసీసీ బ్యాంక్ సీఈఓగా సురేఖారాణి నియమితులయ్యారు. అవినీతి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాజీనామా పత్రాన్ని అందజేసిన సీఈఓ ఏబీ రాంప్రసాద్ దీర్ఘకాలిక సెలవులకి వెళ్లారు. దీంతో ఏడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ సురేఖారాణికి సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆప్కాబ్ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఏడీసీసీ బ్యాంకు సీఈఓగా సురేఖారాణి బాధ్యతలు స్వీకరించారు.