India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలకి తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులతో పరీక్షలు చేశారు. ఎక్స్రే తీశారు. రక్త, వీడిఆర్ఎల్ పరీక్షలు చేసి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షలను రెండు సార్లు వాయిదా వేసినా.. మూడోసారి బాధితురాలు పరీక్షలకు హాజరయ్యారు.
ఐరాల మండలం ఆడపగుండ్లపల్లి వద్ద రెండు బైకులు ఢీ కొని ఒక్కరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. 45-కొత్తపల్లెకు చెందిన నరేంద్ర(25) బైక్పై వస్తుండగా… వెంగంపల్లెకు చెందిన అఖిల్, కురప్పపల్లెకు చెదిన యశ్వంత్లు చిత్తూరు నుంచి ఇంటికి వెళ్లుండగా అడపగుండ్లపల్లె వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చిత్తూరు మార్చురీకి తరలించారు.
గ్రామ, వార్డు మహిళా పోలీసులకు కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇచ్చినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిలింగ్ కు 140 మంది హాజరయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను ఎస్పీ వారికి వివరించారు. వారి అభీష్టం మేరకు 49 మందికి పోస్టింగ్ కేటాయించారు. డిపిఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మోహన్ రావు పాల్గొన్నారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ ఇవాళ వైద్యపరీక్షలకు హాజరైంది. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో అడ్మిట్ అయింది. ఆమెకు రెండు రోజుల పాటు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా.. తనపై అన్యాయంగా పెట్టిన కేసు కొట్టేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ను ఎమ్మెల్యే ఆదిమూలం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
చిత్తూరు పట్టణంలోని బజారు వీధిలో బంగారం దుకాణాల వ్యాపారులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలంపాట నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రూ. 2 లక్షలకు పాడి దక్కించుకున్నారు. లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. మాజీ కార్పొరేటర్ వసంత కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ములకలచెరువు: పెద్దపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి <<14074139>>మృతి<<>> చెందిన గుర్తు తెలియని యువకుడి ఆచూకీ లభించినట్లు ఎస్సై గాయత్రి తెలిపారు. మృతుడు సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, సుబ్బరాయునిపల్లికి చెందిన శ్రీరాముల నాయక్ కుమారుడు ప్రకాశ్ నాయక్(22) అని, తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. ప్రకాశ్ స్వగ్రామానికి బైకులో వస్తు పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద గోడను ఢీకొట్టి మృతి చెందినట్లు తెలిపారు.
బంగారుపాళ్యం మండలం మాధవ నగర్ (మాదిగోని తోపు)కు చెందిన జెట్టి సినిమా హీరో మురళి విజయవాడ వరద బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి తనవంతు సహాయంగా రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. మురళి మాట్లడుతూ.. బుధవారం విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి వారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కి రూ. 10 లక్షలు విరాళంగా అందించామని తెలిపారు.
చిత్తూరు: పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పథకం అమలుపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 18 రకాల చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబర్ లోపు లక్ష్యాలు చేరుకోవాలన్నారు.
చిత్తూరు జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో DCHS డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, DMHO డాక్టర్ ఓ.ప్రభావతి దేవి, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎక్కడైనా మాతృ మరణాలు జరిగితే సంబంధిత డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సత్యవేడు MLA కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఆదిమూలం అత్యాచారం చేశాడంటూ ఆరోపించిన మహిళ TPT ఈస్ట్ పోలీసులపై మండిపడింది. ‘నన్ను ఎందుకు విచారిస్తున్నారు. నేను ఫిర్యాదు చేశా. MLAని అరెస్టు చేయండి’ అన్నది. అత్యాచార కేసులో వైద్యపరీక్షలు తప్పనిసరని CI మహేశ్వరరెడ్డి చెప్పినా పట్టించుకోలేదు. ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకానని తేల్చి చెప్పారు. గుండె నొప్పిగా ఉందని వైద్యానికి చెన్నై వెళ్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.