Chittoor

News May 29, 2024

తిరుపతి జిల్లాలో 100 మందిపై రౌడీషీట్?

image

ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లాలో జరిగిన అల్లర్లపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. దాడులకు పాల్పడిన వారితో పాటు పాత నేరస్థులపై రౌడీషీట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేయనుందట. ఇప్పటికే 57 మందిని గుర్తించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు. త్వరలో మరికొందరి వివరాలు సేకరించి దాదాపు 100 మందిపై రౌడీషీట్ తెరుస్తారని తెలుస్తోంది.

News May 29, 2024

చిత్తూరు నియోజకవర్గానికి 14 టేబుళ్లు

image

చిత్తూరు నియోజకవర్గంలో ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 3 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు జేసి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జూన్ 4 వ తేదిన ఉదయం 6 గంటలకల్లా ఏజెంట్లు ఎస్వి సెట్ కళాశాల వద్దకు చేరుకోవాలని సూచించారు.

News May 29, 2024

కుప్పం: బంగినపల్లి టన్ను రూ.50 వేలు

image

మామిడి పండ్లకు మార్కెట్ లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కుప్పం ప్రాంతంలో వేల ఎకరాలలో బంగినపల్లి, తోతాపురి, నీలం, చందూరా తదితర రకాల మామిడికాయలు సాగు చేస్తున్నారు. బంగినపల్లి టన్ను 42 వేల నుంచి 50 వేలు, చందూరా రకం 30 వేల నుంచి 40 వేలు వరకు ధర పలుకుతోంది. క్రిమి సంహారక మందుల ఖర్చు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు.

News May 29, 2024

తిరుమల: నకిలీ వీఐపీ బ్రేక్ టికెట్లతో మోసం

image

భక్తులకు శ్రీవారి VIP బ్రేక్ దర్శన టికెట్ల స్థానంలో నకిలీ దర్శన టికెట్లను అంటగట్టి మోసగించాడు తిరుపతికి చెందిన రఘు సాయి తేజ అనే దళారీ. ఆయన వద్ద టికెట్లను తీసుకున్న శ్రీనివాస్ మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్లగా స్కానింగ్ కాలేదు. దీంతో తాము మోసపోయామని భక్తులు గుర్తించారు. వెంటనే విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నివేదిక ఆధారంగా తిరుమల వన్ టౌన్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 29, 2024

కుప్పం: శానిటరీ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

image

కుప్పం మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలలుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న సంతోష్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై ఆయన స్పందించకపోవడంతోపాటు మద్యం సేవించి విధులకు హాజరుకావడం, పారిశుద్ధ్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంపై చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News May 28, 2024

స్వర్ణరథంపై కల్యాణ వేంకన్న దర్శనం

image

తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ర‌థాన్ని లాగారు.

News May 28, 2024

MPL: కారులో నుంచి పడి ఒకరి మృతి

image

ప్రమాదవశాత్తు కారు డోర్ ఓపెన్ కావడంతో ఒకరు చనిపోయారు. మదనపల్లె తాలుకా ఎస్ఐ రవికుమార్ వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరానికి చెందిన తమిళ సెల్వం(60) మదనపల్లెలోని బంధువుల ఇంటికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో 150వ మైలు వద్ద కారు డోరు ఉన్నట్లుండి ఓపెన్ అయ్యింది. దీంతో సెల్వం కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు.

News May 28, 2024

చంద్రగిరి ఘర్షణలో నిందితుల పేర్లు (2/2)

image

➤ జేబీ రమణ ➤ జేబీ శ్రీనివాస్
➤ పురపర్తివారిపల్లె మధు ➤ యశ్వంత్
➤ బాబు రెడ్డి ➤ నరసింహారెడ్డి
➤ బాబు యాదవ్ ➤ తిరుమల రెడ్డి
➤ రాశెట్టి మోహన్ ➤ జలిజపల్లె రెడ్డి
➤ ధర్మతేజ ➤ ఎస్.అఫ్రీద్
➤ భాస్కరపేట దామోదర్ ➤ వి.గురవయ్య
➤ సురేశ్ ➤ శ్రీధర్ ➤ గురుప్రకాశ్
➤ ప్రతాప్ ➤ దాము ➤ రాకేశ్
➤ హేమాంభర రావు ➤ చిన్నబాబు
➤ కేశవులు నాయుడు ➤ ఏజేపల్లె బాల

News May 28, 2024

చందగ్రిరి ఘర్షణలో నిందితుల పేర్లు(1/2)

image

వైసీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు చంద్రగిరి, తిరుపతి ఘర్షణలకు సంబంధించి 37 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు. వారి పేర్లు ఇవే
➤ మబ్బు దేవనారాయణ రెడ్డి ➤ సురేశ్ రెడ్డి
➤ డాలర్స్ దివాకర్ రెడ్డి ➤ దేవర మనోహర్
➤ బడి సుధాయాదవ్ ➤ పులిగోరు మురళీకృష్ణారెడ్డి
➤ సి.మనోహర్ రెడ్డి ➤ గణపతి నాయకుడు
➤ గౌస్ బాషా ➤ మొగరాల మధు
➤ పనబాకం సుబ్రహ్మణ్యం నాయుడు
➤ సురేశ్ నాయుడు ➤ నాగరాజు నాయుడు

News May 28, 2024

కౌంటింగ్‌పై అవగాహన ఉండాలి: కలెక్టర్

image

చిత్తూరు: ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సూచించారు. చిత్తూరులో కౌంటింగ్ పర్యవేక్షకులు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశించారు.