Chittoor

News September 10, 2024

చిత్తూరు: రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడికి జైలు

image

ఓ వ్యక్తి మృతికి కారణమైన రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు జడ్జి వెన్నెల సోమవారం తీర్పు చెప్పారు. తిరువణ్ణామలై వాసి నాగరాజు చిత్తూరులో రిహాబిలిటేషన్ సెంటర్ నడుపుతుండగా.. మద్యం మాన్పాలని తరుణ్‌ను తల్లి ఆశ ఈ కేంద్రంలో చేర్చింది. అతడిని 6నెలలు కుటుంబానికి చూపకుండా, మోతాదుకు మించి ఔషధాలు ఇవ్వడంతో 2022లో మరణించాడు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని తెలిపారు.

News September 10, 2024

వాళ్లను వెంటనే రిలీవ్ చేయండి: చిత్తూరు DEO

image

చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల్లో టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసినట్లు DEO దేవరాజులు వెల్లడించారు. జిల్లాలో మొత్తంగా 464 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు చెప్పారు. ఆయా టీచర్లను ఎంఈవోలు, HMలు వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు.

News September 9, 2024

శ్రీవారి ఆలయ పేష్కార్‌గా రామకృష్ణ

image

తిరుమల శ్రీవారి ఆలయ నూతన పేష్కార్‌గా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం ఆలయ రంగనాయకుల మండపం వద్ద బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

News September 9, 2024

చిత్తూరు: విద్యార్థి దారుణ హత్య..?

image

ఉమ్మడి చిత్తూరులో డిగ్రీ విద్యార్థి మృతి కలకలం రేపింది. PTM మండలం ముంతగోగులపల్లెకు చెందిన గోపాలకృష్ణ, వెంకట రమణమ్మ కుమారుడు బాలు(18) తిరుపతిలో డిగ్రీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం భూమిని సర్వే చేయించగా.. ఆదివారం నుంచి అదృశ్యమయ్యాడు. ఊరికి చివరలోని గుడి వద్ద సోమవారం శవమై కనిపించాడు. భూవివాదంతో తమ బంధువులు బాలును చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News September 9, 2024

సగం జీతం సాయం చేసిన తిరుపతి కలెక్టర్

image

విజయవాడ వరద బాధితులకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అండగా నిలిచారు. ఈ మేరకు తన సగం జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే డీఆర్వో రూ.25 వేలు వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జిల్లాలోని పలువురు అధికారులు విరాళాన్ని ప్రకటించారు.

News September 9, 2024

చిత్తూరు: ఇదీ మతసామరస్యమంటే..!

image

చిత్తూరు జిల్లా వి.కోటలో సోమవారం వినాయక నిమజ్జనం కోలాహలంగా నిలిచింది. హిందూ, ముస్లిం సోదరులు ఉత్సాహంగా నిమజ్జనంలో పాల్గొన్నారు. మరోవైపు వి.కోట లాంగ్ బజార్ మీదుగా ర్యాలీ జరగ్గా.. మసీదు ఆవరణలో గణనాథుని భక్తులకు వాటర్ బాటిళ్లు, జ్యూస్ అందజేశారు. ఇదీ అసలైన మతసామరస్యమని అందరూ కొనియాడారు.

News September 9, 2024

ఆదిమూలానికి న్యాయం చేయాలని వినతి

image

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ చేసి ఆయనకు న్యాయం చేయాలని దళిత నాయకులు కోరారు. ఈ మేరకు తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ‌కు వినతిపత్రం అందించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిగా ఆదిమూలం ఉన్నారని చెప్పారు. అలాంటి వ్యక్తిపై కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు.విచారణ జరిపించి కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News September 9, 2024

చిత్తూరు: వేరువేరు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శని,ఆదివారాల్లో జరిగిన వేరువేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు, ఐరాలవారిపల్లెలో ట్రాక్టర్ పై నుంచి పడి ఒకరు, తిరుచానూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మరొకరు కన్నుమూశారు. అలాగే నాగలాపురంలో గృహప్రవేశానికి పిలవలేదని సూసైడ్, తిరుమలలో గుండెపోటుతో మహిళ, బంగారుపాళ్యెం రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.

News September 9, 2024

ముగ్గురు ఎస్సైలపై ఎస్పీ విద్యాసాగర్ వేటు

image

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లి ఎస్ఐ లోకేశ్ రెడ్డి, ముదివేడి ఎస్ఐ దిలీప్ కుమార్, ములకలచెరువు ఎస్ఐ గాయత్రీపై ఆదివారం రాత్రి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రాజంపేట డీఎస్పీ ఆఫీసుకు లోకేశ్ రెడ్డి, రాయచోటికి గాయత్రి, పీలేరుకు దిలీప్ కుమార్‌లను అటాచ్ చేసినట్లు తెలిపారు.

News September 9, 2024

ఏర్పేడులో నేడు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బీటెక్ పాసైన, అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.