India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మానసిక స్థితి బాగోలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. శరవణ పురానికి చెందిన శంకర్ పిలై (68) కొంతకాలంగా పాగాయం మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆదివారం గిరింపేట గాయత్రి చిల్డ్రన్స్ పార్క్ వద్ద చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు సీఐ తెలిపారు.
జపాన్ దేశంలో నర్సులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్ రెడ్డి కోరారు. బెంగళూరులో జపాన్ భాషపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జీతం రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 99888 53335లో సంప్రదించాలని కోరారు.
తిరుపతి శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీలో జూన్లో బీటెక్(B.Tech) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫలితాలను www.spmvv.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.
చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీసు క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయకుడి విగ్రహానికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎస్పీ మణికంఠ పోలీసు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, సకల విజయాలు అందించాలని కోరుకున్నట్టు చెప్పారు. సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ భాస్కర్ పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గుండెపోటుతో మహిళ మృతి చెందింది. కడపకు చెందిన ఝాన్సీ (32) శనివారం ఉదయం సర్వదర్శనం క్యూలైన్ లో గుండెపోటుకు గురై చనిపోయింది. అయితే అంబులెన్స్ గంట ఆలస్యంగా వచ్చిందని..సకాలంలో అందుబాటులో ఉంటే తన బిడ్డ బతికేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.తమ కుమార్తె మృతికి టీటీడీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని బోరున విలపించారు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధిత మహిళను పోలీసులు శుక్రవారం ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ చేయడానికి చికిత్సలు చేయించుకోమన్నారు. అయితే ఆమె పరీక్షలకు నిరాకరించినట్లు సమాచారం. సాక్ష్యాలు తారుమారు అవుతాయని వైద్యులు, పోలీసులు చెప్పినా వినకుండా వెళ్లిపోయిందన్నారు. మరో రెండురోజుల్లో పరీక్షలకు వస్తానని చెప్పారన్నారు.
హెడ్ కానిస్టేబుల్ చూపించిన సేవాభావం అందరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ వరద బాధితులకు రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయాన్ని ఎస్పీకి అందజేయడంతో హెడ్ కానిస్టేబుల్ను అభినందించారు.
ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ గుర్తించిన వారికి త్వరగా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఎంపీ గురుమూర్తి కోరారు. చిత్తూరు జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాలో 190 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో తేలిందన్నారు. క్యాన్సర్ లక్షణాలు గుర్తించిన వారికి స్క్రీనింగ్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు.
సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జ్ రేసులో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితి రావడంతో అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన ట్రబుల్ షూటర్ ఎస్సీవీ నాయుడు వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జే.శ్యామలరావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
Sorry, no posts matched your criteria.