Chittoor

News September 4, 2024

తిరుపతి: విమాన ప్రయాణికుడిపై కేసు నమోదు

image

విమానం టేకాఫ్‌కు అంతరాయం కలిగించిన ప్రయాణికుడిపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జయచంద్ర వివరాల మేరకు.. తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం ఓ విమానం బయలుదేర్డానికి సిద్ధమైంది. టేకాఫ్ సమయంలో మయూర్ దిలీప్ హోలే అనే వ్యక్తి చేయి అత్యవసర స్విచ్‌కు తగలడంతో విమానం నిలిచిపోయింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.

News September 3, 2024

తిరుపతి: భర్త దారుణ హత్య.. భార్యకు జీవితఖైదు

image

కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో రేణిగుంట బుగ్గ వీధిలో ఉంటున్న ఎస్.వసుంధరకు జీవిత ఖైదును విధిస్తూ తిరుపతి 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన తీర్పు చెప్పారు. తనతో పాటు కుమారుడిని నిర్లక్ష్యం చేయడంతో ఆమె 2022 జనవరి 20న భర్త తలను నరికి మొండెంను వేరు చేసి తలను ఓ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకుని రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయింది. కేసు నిరూపణ కావడంతో శిక్ష ఖరారు అయింది.

News September 3, 2024

కాకినాడ-తిరుపతి రైలు రద్దు

image

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా 28 రైళ్లు రద్దు అయినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రద్దు అయిన వాటిలో కాకినాడ పోర్టు నుంచి తిరుపతికి వెళ్లాల్సిన రైలు ఉంది. మొత్తం 496 రైళ్లు రద్దు కాగా, 152 సర్వీసులను దారి మళ్లించినట్లు చెప్పారు.  

News September 3, 2024

తిరుపతి: రేపు JRF పోస్ట్‌కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (RARS) నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్ట్‌కు బుధవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News September 3, 2024

పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లె జైలుకు తరలింపు

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, రెస్కో మాజీ ఛైర్మన్ జీఎస్ సెంథిల్ కుమార్‌ను కుప్పం అర్బన్ పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి సెంథిల్ కుమార్‌కు ఈ నెల 13 వరకు రిమాండు విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు అర్బన్ సీఐ జీటీ నాయుడు తెలిపారు. సెంథిల్ కుమార్‌ను అరెస్ట్ చేయడంతో అతని అనుచరులు పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.

News September 3, 2024

తిరుపతి: పార్ట్ టైం కోర్సులలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం కోర్సులలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ రకాల సర్టిఫికెట్ డిప్లమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 06.

News September 2, 2024

తిరుమలలో కొండపై బైక్‌లపై ఆంక్షలు 

image

తిరుమలలో అక్టోబర్ 8న గరుడ సేవ దృష్ట్యా ఘాట్ రోడ్డులో బైక్‌లపై ఆంక్షలు విధిస్తున్నట్లు సోమవారం టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి‌. భారీ రద్దీ కారణంగా అక్టోబర్ 7 రాత్రి 9 గంటల నుంచి 9 ఉదయం 6 గంటల వరకు బైక్‌లపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

News September 2, 2024

చిత్తూరు: గబ్బర్ సింగ్ రీ రిలీజ్.. థియేటర్‌లో ఎమ్మెల్యే హంగామా

image

చిత్తూరు పట్టణంలోని ఎమ్మెస్సార్ థియేటర్లో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోమవారం గబ్బర్ సింగ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. అభిమానులతో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సినిమా థియేటర్లో హంగామా చేశారు. సినిమాను తిలకించారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు.

News September 2, 2024

70 వసంతాలు పూర్తి చేసుకున్న తిరుపతి SVU

image

తిరుపతిలోని SVU 70 వసంతాలు పూర్తి చేసుకుంది. 1954లో టంగుటూరి ప్రకాశం పంతులు దీనిని ప్రారంభించారు. యూనివర్సిటీ 1000 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో నిండి ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఎంతో మంది ప్రముఖులు, నాయకులు విద్యాభ్యాసం చేశారు. రాయలసీమలోనే కాదు దేశంలో టాప్ యూనివర్సిటీలో ఒక్కటిగా నిలిచింది. సోమవారం 70 సంవత్సరాల వేడుకలు జరుగనున్నాయి. మీరు SVU చదువుంటే కామెంట్ చేయండి.

News September 2, 2024

తిరుపతి జిల్లాలో విషాదం.. ఇద్దరి మృతి

image

ఏర్పేడు మండలంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బాలకృష్ణ పురం గ్రామానికి చెందిన రుద్రకన్నబాబు గుండెపోటుతో మృతి చెందారు. అలాగే మండలంలోని చిందేపల్లికి చెందిన పట్ర మనోహర్ ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.  ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరారు.