India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిరుత దాడిలో మరో ఆవు మృతి చెందినట్లు చౌడేపల్లి మండలంలోని రైతులు చెబుతున్నాడు. బాధిత రైతు కథనం మేరకు.. నాగిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డికి ఆవులు ఉన్నాయి. వాటిని సమీపంలోని కందూరు అడవిలోకి మేత కోసం తరలించారు. సాయంత్రం పశువులన్నీ ఇంటికి చేరుకోగా ఒక ఆవు కనిపించలేదు. రైతు గాలింపు చేపట్టగా శనివారం చనిపోయి కనిపించింది. దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సి ఉంది.

కూటమి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. శనివారం హౌసింగ్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీ మోహన్ లతో కలసి మంత్రి పాల్గొన్నారు. హౌసింగ్ కాలనీలో ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కరించారు.

నామినేటెడ్ పోస్టుల్లో చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా K.హేమలతను నియమించారు. గతంలో (2017) ఆమె చిత్తూరు మేయర్గా పనిచేశారు. మేయర్గా ఉంటూ హత్యకు గురైన కటారి అనురాధకు ఆమె మేనకోడలు. దీంతో ఆమెను అప్పట్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ అభివృద్ధికి కృషి చేశారు. పోలీసులు వేధిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు.

రెండో జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్గా కె.హేమలత నియమితులయ్యారు. ఏపీ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్గా నీలాయపాలెం విజయ్ కుమార్ను ఎంపిక చేశారు. ఏపీ యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్గా నరసింహ యాదవ్, వన్నెకుల కార్పొరేషన్ ఛైర్మన్గా CRరాజన్, నాయీ బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్గా ఆర్.సదాశివకు అవకాశం దక్కింది.

తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్య(ప్రభుత్వ, ప్రైవేటు) పాఠశాలలకు నేటి రెండో శనివారం(second satur day) సెలవు రద్దు చేసినట్లు DEO కేవీఎన్.కుమార్ వెల్లడించారు. ఇటీవల భారీ వర్షాలతో వరుస సెలవులు ఇచ్చారు. దీంతో ఇవాళ వర్కింగ్ డేగా ప్రకటించారు. అపార్, SA మోడల్ టెస్ట్ మార్కుల నమోదుకు సిబ్బంది పని చేయాలని ఆదేశించారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని స్కూళ్లలకు ఇవాళ సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.

తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్య (ప్రభుత్వ, ప్రైవేటు) పాఠశాలలకు రేపు పని దినంగా ప్రకటించినట్లు DEO కేవీఎన్.కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లాలో ఇదివరకే అధిక వర్షాలతో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. దీంతోపాటూ అపార్, సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్-I, పేపర్ II మార్కులు ఆన్లైన్లో నమోదు చేయుటకు తప్పకుండా పని చెయ్యాలని ఆదేశించారు.

జిల్లాలోని గోకులం షెడ్లకు జియో ట్యాగింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 2,327 షెడ్లు మంజూరు కాగా 1,911కు సాంకేతిక మంజూరు ఇచ్చామన్నారు1,377కు జియో టాకింగ్ పూర్తి చేశామని తెలిపారు. 460 పనులు గ్రౌండింగ్ అయిందని, పనులు మంజూరైన చోట టెక్నికల్ శాంక్షన్ వచ్చిన వెంటనే జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు.

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు డీఈవో వరలక్ష్మి రెండో శనివారం సెలవు ప్రకటించారు. సెలవు రోజు ఎవరైనా తరగతులు నిర్వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో ఉపాధ్యాయులు అపార్ కార్డు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లా పాఠశాలలకు ఈ సెలవు వర్తించదు.

యువత మెరుగైన భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించిన యువతరంగ్ -24 యూత్ ఫెస్టివల్లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి వేదికగా వరల్డ్ క్లాసు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు త్వరలోనే భూమి పూజ చేస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.

తంబళ్లపల్లి సద్దిగుట్టవారిపల్లెలో 2018లో తన అమ్మమ్మపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా చంపిన ఇంద్రప్రసాద్(38) అనే ముద్దాయికి 34 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ 6 వ అదనపు జడ్జ్ శాంతి గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోట పురుషోత్తం వృద్ధురాలు తరపున కేసును వాదించారు. అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, చంపినందుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించారు.
Sorry, no posts matched your criteria.