Chittoor

News May 22, 2024

చిత్తూరు: ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు

image

అతని టార్గెట్ ఇళ్లు, ఉద్యోగుల గెస్ట్ హౌస్, స్టూడెంట్ హాస్టళ్లే. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ ల్యాప్‌టాప్ దొంగలించడమే అతగాడి పని. పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు మంగళవారం నిందితుడిని పట్టుకున్నారు. అతను చిత్తూరుకు చెందిన కుమార్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి 25 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు.

News May 21, 2024

పుంగనూరులో ఓట్లు లెక్కింపు ఇలా..!

image

పుంగనూరులో 2,38,868 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,06, 916 ఓట్లు పోలయ్యాయి. వచ్చే నెల 4వ తేదీన వీటిని లెక్కిస్తారు. ముందుగా పుంగనూరు మండలం ఎర్రగుంట్లపల్లి పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తర్వాత చౌడేపల్లె, సదుం, సోమల, రొంపిచెర్ల మండలాల ఈవీఎంలు తెరుస్తారు. చివరగా పులిచెర్ల మండలం కావేటిగారిపల్లి ఓట్లతో పుంగనూరు నియోజకవర్గ కౌంటింగ్ ముగుస్తుంది.

News May 21, 2024

స్ట్రాంగ్ రూములను జాగ్రత్తగా చూసుకోండి: SP

image

వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూములను ఎస్పీ మణికంఠ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు ఉంచిన గదుల్లోకి వర్షపు నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఆరిపుల్లా, ఏఆర్‌ డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్ఐ నీలకంఠేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

News May 21, 2024

తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య

image

తిరుమలలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొండపై ఉన్న B-టైప్ క్వార్టర్స్ వెనుక ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

TPT: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU) లో ఫుల్ టైం రెగ్యులర్ పద్ధతిలో శిక్ష ఆచార్య (ఎంఈడి), శిక్ష శాస్త్రి (బీఈడీ) ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. CUET – PG 2024 ప్రవేశపరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ లో చూడాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 14.

News May 21, 2024

తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాక

image

తిరుమల శ్రీవారి దర్శనానికి మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో పాటు రానున్న ఆయన రాత్రి కొండపై బస చేయనున్నారు. బుధవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.

News May 21, 2024

TPT: మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 28వ తేదీ నుంచి డిగ్రీ (UG) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. https://www.braouonline.in/ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 21, 2024

కల్లూరు: ఊయల మెడకు చుట్టుకుని బాలిక మృతి

image

పులిచెర్ల మండలం కల్లూరులో ప్రమాదవశాత్తు ఊయల మెడకు చుట్టుకుని 9 ఏళ్ల చిన్నారి మోమిన్ మృతి చెందినట్లు ఎస్సై రవిప్రకాశ్ రెడ్డి తెలిపారు. సదుం మండలానికి చెందిన మోమిన్ తన అక్కతో కలిసి కల్లూరులోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సోమవారం చీరతో చేసుకున్న ఊయలలో మోమిన్ ఊగుతూ మెడకు బిగుసుకోగా.. బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 20, 2024

చిత్తూరు: ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. చిన్నారి మృతి

image

నారాయణవనం మండలం గోవిందప్ప నాయుడు కండిగ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై రేణిగుంటకు వెళుతున్న కారును చెన్నైకి వెళుతున్న మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రేణిగుంట వెళుతున్న కారులోని ఓ చిన్నారి చనిపోగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వారు పూర్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 20, 2024

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై బస్సు బోల్తా

image

కార్వేటినగరం మండలం పుత్తూరు కనుమ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై ఓ ఆటోను తప్పించబోయిన కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.