India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తంబళ్లపల్లి సద్దిగుట్టవారిపల్లెలో 2018లో తన అమ్మమ్మపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా చంపిన ఇంద్రప్రసాద్(38) అనే ముద్దాయికి 34 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ 6 వ అదనపు జడ్జ్ శాంతి గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోట పురుషోత్తం వృద్ధురాలు తరపున కేసును వాదించారు. అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, చంపినందుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించారు.

నూతన బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి తెలిపారు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు పలమనేరు నుంచి బెంగుళూరుకు వెళ్లేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చొరవతో ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

కౌశల్ క్విజ్ , పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల గోడ పత్రికను యాదమరి కె. గొల్లపల్లి పాఠశాలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20,21,22 పాఠశాల స్థాయిలో, డిసెంబర్ 6న జిల్లా స్థాయిలో, 29,30 న రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం డిఇఓ వరలక్ష్మి చేతుల మీదుగా ఆమె చాంబర్లో ఆవిష్కరించారు.

ఆవుపై చిరుతపులి దాడి చేసిన ఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. చౌడేపల్లి మండలం చుక్కావారిపల్లె గ్రామం వద్ద చిరుత పులి ఆవుపై దాడి చేసి చంపిన చంపేసింది. స్థానికులు కేకలు వేయడంతో ఆవు కళేబరాన్ని తింటున్న చిరుత పులి అక్కడ నుంచి పారిపోయింది. కొద్దిరోజుల క్రితం చిరుత పులి సంచారం కలకలం రేపిన విషయం విదితమే. అధికారులు చిరుతపులి దాడుల నుంచి తమకు భద్రత కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ను ఈనెల 9న సా.4:30కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తిరుపతిలోని PGR థియేటర్లో టీజర్ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్లో రామ్చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

విజయపురం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తంగరాజ్ అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. నగరి మండలం వేలావడి గ్రామానికి చెందిన తంగరాజు గతంలో పిచ్చాటూరు, నాగలాపురం మండల పోలీస్ స్టేషన్లో పనిచేసి బదిలీపై విజయపురం వచ్చారు. తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్టేషన్ సిబ్బంది, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం ఉదయం ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో భానుప్రకాశ్ రెడ్డి, మునికోటేశ్వరరావు, సుచిత్ర ఉన్నారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం ఈవో అందజేశారు.

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. కాగా బుధవారం శ్రీవారిని 66,163 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,299 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దగ్ధం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. బుధవారం తిరుపతి నుంచి వచ్చిన CID DSP బృందం సభ్యులు మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈసీ, నకళ్లు, రికార్డులు తనిఖీచేసి రాజకీయ నేతల వద్ద ఉండకూడని రికార్డులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎలా వెళ్లాయో తెలుసుకున్నారు. కేసు సీఐడీకి బదిలీ కావడంతో అధికారులు భిన్నకోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఆపార్ నమోదు ఈ నెల 20వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ఆపార్ నమోదు కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీనితో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. విద్యా సంస్థలు సహకరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.