Chittoor

News May 18, 2024

228 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు: కలెక్టర్ షణ్మోహన్

image

పోలింగ్ విధులకు హాజరు కాని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పోలింగ్ విధులకు 228 మంది పీఓ, ఏపీఓ, ఓపీఓలు హాజరు కాలేదన్నారు. 

News May 18, 2024

తిరుపతి జిల్లా SPగా హర్షవర్ధన్‌

image

తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఇక్కడ ఎస్పీగా పని చేసిన కృష్ణ కాంత్ పటేల్ తిరుపతి స్ట్రాంగ్ రూముల వద్ద జరిగిన గొడవను అదుపు చేయడంలో విఫలం అయ్యారంటూ ఆయన్ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

News May 18, 2024

తంబళ్లపల్లెలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

సెలవుల్లో ఊరికి పంపలేదని ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన తంబళ్లపల్లెలో చోటుచేసుకుంది. మండలంలోని బలకవారిపల్లె హరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు బి.శ్రీరాములు(15) కురబలకోటలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో వాల్మీకి పురంలోని బంధువుల ఇంటికి వెళ్లాలని కోరగా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం.

News May 18, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్ట్ నెల కోటాను మే 18న ఉ.10గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 18 నుంచి 20వ తేదీ ఉ.10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 22న ఆర్జిత సేవా, 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News May 18, 2024

తెలంగాణ ఈఏపీ సెట్‌లో చిత్తూరు విద్యార్థుల ప్రభంజనం

image

తెలంగాణలో ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి ర్యాంకు మదనపల్లికి చెందిన ప్రణీత కైవసం చేసుకుంది. కాగా నాల్గవ ర్యాంకులో చిత్తూరులోని మల్లేశ్వరపురానికి చెందిన సోంపల్లి సాకేత్ రాఘవ్ నిలిచారు. అలాగే తిరుపతికి చెందిన వడ్లపూడి ముఖేశ్ చౌదరి 7వ ర్యాంకు సాధించారు.

News May 18, 2024

చిత్తూరు: ఈనెల 24 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

image

పదవ తరగతి సప్లి మెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 3 వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ దేవరాజు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. 2006 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.

News May 18, 2024

తూర్పు కనుమల్లో అరుదైన కప్పను కనిపెట్టిన శాస్త్రవేత్తలు

image

తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను గుర్తించినట్టు హైదరాబాద్‌కు చెందిన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ దీపాపైస్వాల్ , డాక్టర్ ఎస్.ఎస్.జాదవ్, డాక్టర్ కరుతపాండి శుక్రవారం తెలిపారు. శ్రీలంక తడి భూముల్లో మనుగడ సాగిస్తున్న బ్యాక్డ్ ప్రాగ్‌గా గుర్తించామన్నారు. 

News May 17, 2024

గుర్రంకొండ: మహిళను అడవిలో ఉరితీసి చంపేశారు

image

చిన్నమండెం మండలం, గుట్టు సమీపంలోని మొటుకు అడవిలో ఓ మహిళను ఉరివేసి చంపిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్రంకొండ మండలం తుమ్మల గొంది సమీపంలోని మొటుకు అడవిలో సుమారు 25 ఏళ్ల వయసున్న ఓ గుర్తు తెలియని యువతిని ఎవరో అడవిలోకి తీసుకెళ్లి పథకం ప్రకారం ఉరేసి చంపేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారని స్థానికులు చెబుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

News May 17, 2024

చిత్తూరు: ఈవీఎంలను పరిశీలించిన ఎస్పీ

image

చిత్తూరు పట్టణంలోని ముత్తిరేవుల వద్ద ఎస్‌వి సెట్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలలో ఎస్పీ మణికంఠ చందోలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని సూచించారు‌. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని అధికారులను సూచించారు.

News May 17, 2024

వడమాలపేట: ఎమోషనల్ అయిన మంత్రి రోజా

image

వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి గురువారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం మంత్రి రోజా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాసేపు ఎమోషనల్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజాతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.