India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి జిల్లా పాకాలలో ఏనుగు అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. వారం క్రితం అరగొండ సమీపంలో ఒకరిని ,వెంగంపల్లి వద్ద మరొకరిని ఈ ఏనుగు పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.. దీంతో ఏనుగు కోసం అటవీ అధికారులు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఏనుగు ఎప్పుడు ఏ ప్రాంతంలోకి చొరబడుతుందో అని ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నందు 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య (ఆన్ లైన్) విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రాంతీయ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://ignouadmission.samarth.edu.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.
తిరుమల శ్రీవారి లక్ష్మీహుండీ చోరీ చేసిన కేసులో నిందితునికి మూడునెలల జైలుశిక్ష, రూ. 100 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయ మూర్తి పల్లపోలు కోటేశ్వరరావు గురువారం తీర్పు వెలువరించారు. తమిళనాడుకు చెందిన ఆర్ముగం ఈఏడాది మార్చిలో తిరుమల శ్రీవారి లక్ష్మీ హుండీలో రూ.8,230 చోరీ చేశారు. తితిదే విజిలెన్సు అధికారులు పట్టుకుని నిందితున్ని తిరుమల ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు.
వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి గురువారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి తల్లి రోధిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. తన పిల్లలు చనిపోలేదంటూ..వారిని ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ అందిరి కాళ్లూ పట్టుకుంటున్న వైనం హృదయాలని కలచివేస్తోంది. తమకింకెవరూ లేరు అంటూ తామూ చనిపోతామని గుండెలను బాదుకుంది.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో జరిగిన ఘటనను ఈసీ తీవ్రంగా పరిగణించింది. SPని బదిలీ చేయడంతో పాటు నలుగురిపై వేటు వేసింది. తిరుపతి DSP సురేంద్ర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ తిరుపతి DSP భాస్కర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.రాజశేఖర్, అలిపిరి CI ఓ. రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీలో జరిగిన దుండగుల దాడిలో పులివర్తి నానికి గాయాలైన విషయం తెలిసిందే.
ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటువేసింది. డీఎస్పీతో పాటు తిరుపతిలోని పలువురు సబార్డినేట్ అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటువేసింది. డీఎస్పీతో పాటు తిరుపతిలోని పలువురు సబార్డినేట్ అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్లు గురువారం మృతి చెందారు. మృతులు ముగ్గురూ ఎస్బిఆర్ పురం గ్రామానికి చెందిన బాబు, విజయ దంపతుల కుమార్తెలు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గూళూరు చెరువులో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకోవడానికి దిగారు. ప్రమాదావశాత్తు ఒక్కరు నీటిలో పడిపోయారు. వీరిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు పడి మృత్యువాత పడ్డారు.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈపరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని డీఈఓ డాక్టర్ వి.శేఖర్ తెలిపారు. హాల్ టికెట్లను సంబంధిత పాఠశాలలో కానీ www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్లను పొందవచ్చని డీఈఓ చెప్పారు.
రాష్ట్రంలోనే అత్యల్పంగా తిరుపతిలో పోలింగ్ జరిగింది. 2019లో 65.93 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 2.61 శాతం తగ్గడంతో పోలింగ్ పర్సంటేజీ 63.32కి పరిమితమైంది. తిరుపతి నియోజకవర్గంలో మొత్తం 3,02,503 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,91,557 మంది మాత్రమే ఓటు వేశారు. 1,10,946 మంది ఓటింగ్ దూరంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. రాజ్యంగం కల్పించిన హక్కును వినియోగించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.