Chittoor

News May 14, 2024

తిరుపతి: ఓటేసి వెళ్తుండగా మృతి

image

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు <<13243541>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. మృతుడు అమాసవారిపల్లికి చెందిన ఎ.గురుస్వామి(65)గా గుర్తించారు. ఆయన ఓటు వేయడానికి వెళ్లగా చీకటి పడింది. ఓటు వేసి తిరిగి ఇంటికి నడిచి వస్తుండగా.. రోడ్డు పక్కన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.

News May 14, 2024

చిత్తూరు: లండన్ నుంచి వచ్చి ఓటు హక్కు వేసిన ఉద్యోగి

image

ఎస్ఆర్ పురం మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం లండన్‌లో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎస్ఆర్ పురానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఒక భారతీయ పౌరుడిగా తన ఓటు హక్కు ఉపయోగించుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. తాను ఓటు వేయడానికి సుమారు లక్ష రూపాయలు వరకు ఖర్చు చేసుకొని వచ్చానని తెలిపారు.

News May 13, 2024

చిత్తూరు: లండన్ నుంచి వచ్చి ఓటు హక్కు వేసిన ఉద్యోగి

image

ఎస్ఆర్ పురం మండల కేంద్రానికి చెందిన పురుషోత్తం లండన్‌లో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఎస్ఆర్ పురానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఒక భారతీయ పౌరుడిగా తన ఓటు హక్కు ఉపయోగించుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. తాను ఓటు వేయడానికి సుమారు లక్ష రూపాయలు వరకు ఖర్చు చేసుకొని వచ్చానని తెలిపారు.

News May 13, 2024

GREAT: ఒకే ఇంట్లో 30 మంది ఓటింగ్

image

ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమాను పెంటకు చెందిన వైస్ ఎంపీపీ-2 తోట జయకుమార్ కుటుంబం చాలా పెద్దది. వారింట్లోనే 30 మంది ఓటు వేయడం విశేషం. మండలంలోని తమ కుటుంబానికి చెందిన 30 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు.

News May 13, 2024

చిత్తూరు: ఓటు వేసిన వందేళ్ల బామ్మ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. చౌడేపల్లె మండలం గాండ్లపల్లెకు చెందిన శాంతమ్మ(100) బైకుపై వచ్చి ఓటు వేశారు. ఆ వయసులోనూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంపై పలువురు అభినందలు తెలిపారు. మరోవైపు కుప్పంలో చంటిబిడ్డల తల్లులు సైతం ఓటు వేయడం విశేషం.

News May 13, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

image

తిరుపతి జిల్లా కలెక్టర్ , జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఎస్వియూ క్యాంపస్ పాఠశాలలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన దంపతులు ఓటు వేసినట్టు వేలును చూపించారు. జిల్లా కు చెందిన పలువురు నాయకులు ఓటు వేసారు.

News May 13, 2024

ప్రతి ఒక్కరూ ఓటు వేయండి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. ఈవీఎంలు మొరాయించిన స్థలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. సాయంత్రం 6 లోపు 100% పోలింగ్ నమోదయ్యేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

News May 13, 2024

తిరుపతిలో 22.66 శాతం పోలింగ్

image

చిత్తూరు జిల్లాలో ఉదయం 9 గంటలకు25.81 శాతం ఓటింగ్ నమోదైంది. తిరుపతి జిల్లాలో 22.66 శాతం, అన్నమయ్య జిల్లాలో 22.8 శాతం ఓట్లు పోలయ్యాయి.
➤ చంద్రగిరి: 26.90 ➤ శ్రీకాళహస్తి: 28.34
➤ తిరుపతి:  14.02 ➤ పుంగనూరు: 26.08
➤ చిత్తూరు: 29.07 ➤ నగరి: 16.95
➤ పూతలపట్టు: 20.63 ➤ జీడీనెల్లూరు: 30.94
➤ పలమనేరు: 29.57  ➤ కుప్పం: 26.47
➤ పీలేరు: 11.50 ➤ తంబళ్లపల్లె: 24.65
➤ మదనపల్లె: 24.20 ➤ సత్యవేడు: 22.40

News May 13, 2024

చిత్తూరు జిల్లాలో 11.84 శాతం పోలింగ్

image

చిత్తూరు జిల్లాలో ఉదయం 9 గంటలకు 11.84 శాతం ఓటింగ్ నమోదైంది. తిరుపతి జిల్లాలో 8.11 శాతం, అన్నమయ్య జిల్లాలో 9.89 శాతం ఓట్లు పోలయ్యాయి.
➤ చంద్రగిరి: 11.01 ➤ శ్రీకాళహస్తి: 8.20
➤ తిరుపతి: 10.15 ➤ పుంగనూరు: 13.15
➤ చిత్తూరు: 11.56 ➤ నగరి: 9.80
➤ పూతలపట్టు: 10.48 ➤ జీడీనెల్లూరు: 13.58
➤ పలమనేరు: 14 ➤ కుప్పం: 9.72
➤ పీలేరు: 11.50 ➤ తంబళ్లపల్లె: 10.10
➤ మదనపల్లె: 9.20 ➤ సత్యవేడు: ఇంకా వెల్లడించలేదు.

News May 13, 2024

పుంగనూరులో ఓటు వేసిన చిత్తూరు ఎంపీ

image

పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఇండ్లులో వైసీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎం.రెడ్డప్ప ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా కలిసి ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో పాటు లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.