Chittoor

News May 13, 2024

పుంగనూరులో ఓటు వేసిన చిత్తూరు ఎంపీ

image

పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఇండ్లులో వైసీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎం.రెడ్డప్ప ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా కలిసి ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో పాటు లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

News May 13, 2024

చిత్తూరు: టీడీపీ ఏజెంట్ల ఆచూకీ లభ్యం

image

పుంగూరు నియోజకవర్గం సదుం మండలం బూరగమంద పోలింగ్ కేంద్రానికి చెందిన టీడీపీ ఏజెంట్ల <<13235759>>కిడ్నాప్ <<>>కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ స్పందించారు. కిడ్నాప్‌నకు గురైన రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర ఆచూకీ పీలేరులో లభ్యమైనట్లు వెల్లడించారు. వారి సమక్షంలోనే మాక్ పోలింగ్ చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు.

News May 13, 2024

చిత్తూరు: టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్..?

image

చిత్తూరు జిల్లాలో పోలింగ్ రోజున కిడ్నాప్ కలకలం రేపింది. పుంగనూరు నియోజకవర్గం సదుం(M) బూరగమందకు చెందిన రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్రను TDP ఏజెంట్లుగా నియమించారు. వీళ్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా కొందరు కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. వైసీపీ నాయకులే తమ ఏజెంట్లను అపహరించారని టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జ్ జగన్ మోహన్ రాజు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 12, 2024

TPT: దూరవిద్య పీజీ ఫలితాల విడుదల

image

తిరుపతి : శ్రీవేంకటేశ్వర దూరవిద్య (DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ ఎంబీఏ (MBA) మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News May 12, 2024

ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం

image

రొంపిచర్ల మండలం, మోటు మల్లెల నగరి హరిజనవాడలో గాలి శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన మేక ఐదు మేక పిల్లలకు ఆదివారం రాత్రి జన్మనిచ్చింది. ఈ మేక మొదటి కాన్పులో రెండు, రెండవ కాన్పులో మూడు, మూడవ కాన్పులో ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని రైతు తెలిపారు. ఐదు మేక పిల్లలను సంరక్షించేందుకు వైద్యుల సలహాలు సూచనలు కావాలని రైతు కోరారు.

News May 12, 2024

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

image

కురబలకోట మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.  ముదివేడు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి వివరాల మేరకు.. మదనపల్లె మండలం, సిటిఎం గ్రామం, కోనంగివారిపల్లెకు చెందిన ప్రసాద్ (26), కురబలకోట మండలంలోని ముదివేడు గ్రామం, చామంచివారిపల్లెకు చెందిన ధరన్(25), కిరణ్ (25)లు సొంత పని మీద బైకులో అంగళ్లుకు బయలుదేరారు. స్కూటర్ అంగళ్లు ఏసి గోడౌన్ వద్ద బొలెరో తప్పించి పడ్డారు.

News May 12, 2024

తిరుపతిలో రాజకీయం వర్సెస్ జర్నలిజం

image

ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణంలో తిరుపతి రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుపతికి చెందిన ఓ పత్రిక విలేకరులపై చేసిన వ్యాఖ్యలు జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారి తీశాయి. రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను అన్ని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. మరో వైపు తిరుపతి జర్నలిస్టులు ఎస్పీకి, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

News May 12, 2024

చిత్తూరు: 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు

image

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 3000 పోలీస్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామ, పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగంచుకునే విధంగా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. NCC, NSS, పదవి వివరణ చేసిన పోలీసులు, మాజీ సైనికులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.

News May 12, 2024

చిత్తూరు: ఏనుగు దాడిలో ఒకరు మృతి

image

జిల్లాలోని తవణంపల్లె మండలం వెంగంపల్లె ST కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పి.చిన్నయ్య(50) ఆదివారం ఉదయం కాలనీకి సమీపంలోని మామిడి తోటలో బహిర్భూమికి వెళ్లాడు. ఏనుగును చూసిన కుక్కలు మొరిగాయి. దీంతో చిన్నయ్య అటుగా వెళ్లగా.. ఆయనను ఏనుగు వెంబడించి చంపేసింది. స్థానికులు స్థానిక అటవీ శాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 12, 2024

మంగళగిరిలో బాబు.. పుంగనూరులో పెద్దిరెడ్డి

image

ఈసారి ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు వాళ్లకి వాళ్లే ఓటు వేసుకునే అవకాశం లేదు. కుప్పంలో పోటీ చేస్తున్న చంద్రబాబు మంగళగిరిలో ఓటు వేస్తారు. వైసీపీ తంబళ్లపల్లె అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని తన స్వగ్రామం ఎర్రాతివారిపాలెంలో, నగరి అభ్యర్థి భానుప్రకాశ్ రామచంద్రాపురం మండలంలో, పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ బాబు చిత్తూరు మండలం వెంకటాపురం హరిజనవాడలో ఓటు వేస్తారు.