Chittoor

News October 26, 2024

చిత్తూరు జిల్లా ప్రజలకు ఎస్పీ గమనిక

image

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.  ఆయన మాట్లాడుతూ..అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే సంక్షిప్త సమాచారాలు, మెయిల్స్ లలోని లింకులను ఓపెన్ చేయకుండా తిరస్కరించాలని చెప్పారు. మోసపోయాం అని గ్రహించిన తక్షణమే Cyber Helpline 1930 కు గాని సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ http://cybercrime.gov.in/ కు గాని జిల్లా పోలీస్ వాట్సప్ నెంబర్ 9440900005 కు గాని తెలపాలన్నారు.

News October 26, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

తిరుమలలో భక్తుల రద్దీ శనివారం తక్కువగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 56,501 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 21,203 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.78 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 

News October 26, 2024

చిత్తూరు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. తేనె బండ ధర్మరాజుల కాలనికి చెందిన మురళి (29) చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. యజమాని వద్ద డబ్బులు తీసుకుని తిరిగి కట్టలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం ఉరివేసుకున్నాడు. మృతదేహాన్ని మార్చురికి తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News October 26, 2024

చిత్తూరు జిల్లా ఉపాధ్యాయుడుకి అరుదైన గౌరవం

image

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న కూనటి సురేశ్‌కు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో ప్రసంగించే గొప్ప అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 28, 29వ తేదీలలో న్యూఢిల్లీలో కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులకు మూల్యాంకన విధానంలో సమతుల్యతను పాటించడం పై ప్రసంగించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఆయనను పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News October 25, 2024

తిరుమల: వృద్ధులకు టీటీడీ కీలక సూచనలు

image

ఇటీవల తిరుమల నడక మార్గంలో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో 60 ఏళ్లు దాటిన భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. బీపీ, ఉబ్బసం, మూర్చ, కీళ్ల వ్యాధులు ఉన్న వ్యక్తులు నడక మార్గాన రావడం మంచిది కాదని తెలిపింది. సముద్రమట్టానికి అధిక ఎత్తులో ఉండడంతో ఆక్సిజన్ స్థాయిలు తక్కువ ఉంటాయని చెప్పింది. సమస్యలు ఎదురైతే 1500 మెట్లు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సేవలు పొందవచ్చని వెల్లడించింది.

News October 25, 2024

తిరుపతి: దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

శ్రీ పద్మావతి మహిళ దూరవిద్య కేంద్రం (DDE)లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (సంగీతం), డిప్లొమా ఇన్ మ్యూజిక్, పీజీ, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ స్వర్ణలతాదేవి పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత, ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 31.

News October 25, 2024

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

image

తిరుపతిలో వరుస బాంబు బెదిరింపుల పర్వం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు హోటళ్లను పేలుస్తామంటూ ఉగ్రవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా రేణిగుంట విమానాశ్రయానికి సైతం ఇలాంటి బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. STAR ఎయిర్ లైన్స్‌కు చెందిన చెందిన ఓ విమానానికి ఈ బెదిరింపు సందేశం వచ్చింది. ఆదమ్‌లాన్‌జా-333 పేరుతో ఈ సందేశం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

News October 25, 2024

తిరుపతిలో బాంబు బెదిరింపులు.. ముమ్మరంగా గాలింపు

image

తమిళనాడులో ఓ ఉగ్రవాది అరెస్ట్ నేపథ్యంలో అక్కడి CM ఇంటితోపాటూ తిరుపతిలోని పలు హోటళ్లను పేలుస్తామంటూ ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. DSP వెంకట నారాయణ ఆధ్వర్యంలో తిరుపతిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ ఏమి లభించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

News October 25, 2024

 కుప్పంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News October 24, 2024

కలికిరిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కలికిరిలో చోటుచేసుకుంది. సీఐ రెడ్డిశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కలికిరి వయా కలకడ రహదారిపై అద్దవారిపల్లి సమీపంలో కారు బైక్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న సోమల మండలం టీ.చెరుకువారిపల్లికి చెందిన కె.కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పీలేరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.