India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లాలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ శన్మోహన్ పరిశీలించారు. పలమనేరు, నగరి, జీడి నెల్లూరులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, ఈవీఎం కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ సమయం దగ్గర పడుతోందని అధికారులందరూ విధులలో చురుగ్గా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూములలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ప్రధాని మోదీ బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. స్థానిక సైనిక స్కూల్ వెనుక వైపు 35 ఎకరాల మైదానంలో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొంటారు.
పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 26 మందికి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండో విడత శిక్షణ తరగతులలో మొత్తం 4524 మందికి PO, APO శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆర్డర్లు పంపారు. అందులో 4498 మంది హాజరయ్యారని, 26 మంది ఏ విధమైన కారణం చూపకుండా శిక్షణకు గైర్హాజరు అయ్యారన్నారు. వారికి షోకాజ్ నోటీసులు పంపించినట్లు చెప్పారు.
చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఉదయం నుంచి ప్రచారంలో పాల్గొంటున్న పలువురు సాయంత్రానికి మద్యం షాపుల వద్దకు చేరుకుంటున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మరికొందరు వైన్ షాపులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల బీర్లు దొరకడం లేదని మందుబాబులు అంటున్నారు. కొన్ని చోట్ల స్టాక్ ఉన్నా.. కూలింగ్ ఉండటం లేదని వాపోతున్నారు.
పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ప్రచారంతో పాటు పోల్మేనేజ్మెంట్ తీవ్రంగా చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు రూ.2 వేల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రహస్య స్థావరాలకు ఓటర్లను పిలిచి డబ్బు ఇస్తున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2024-25 సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఎంటెక్(MTech) ఇంటర్నేషనల్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 21.
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో గత ఏడాది డిసెంబర్లో డిగ్రీ BA, BCOM, BSC, BCA, BVOC, BMUS, BDAN ఐదో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు సెగ్మెంట్లో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన MS బాబు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయనకే MLA టికెట్ లభించింది. సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా, మురళీమోహన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నిన్నటి వరకు వీరిద్దరూ మెజార్టీపై లెక్కలు వేసుకోగా.. బాబు ఎంట్రీతో ఎవరి ఓట్లకు గండి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా సోమవారం పోలీస్ గెస్ట్ హౌస్లో ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, సాధారణ పరిశీలకులు పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో MPED, BPED, DPED నాలుగవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.