Chittoor

News March 4, 2025

చిత్తూరు నగరంలో వ్యభిచార గృహంపై దాడి

image

చిత్తూరు నగరంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. రామ్‌నగర్‌ కాలనీలో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమచారం రావడంతో 2టౌన్ CI నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, ముగ్గురు మహిళలతోపాటు ముగ్గురు విటులను స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 4, 2025

జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు: కుప్పం DSP

image

కుప్పం నియోజకవర్గ పరిధిలో జల్లికట్టు, ఎద్దుల పండుగ (మైలారు)ను నిషేధించినట్లు డీఎస్పీ పార్థసారధి స్పష్టం చేశారు. ఎక్కడైనా జల్లికట్టు, ఎద్దుల పండగను నిర్వహిస్తే వారు జంతు సంరక్షణ చట్టం క్రింద శిక్షార్హులన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSP హెచ్చరించారు.  

News March 3, 2025

చిత్తూరు: ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 609 మంది గైర్హాజరు

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తొలి రోజు సోమవారం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు మొత్తం 12,220 మందికి గాను 11,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 509 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1,809 మందికి గాను 1,709 మంది విద్యార్థులు హాజరు కాగా, 100 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.

News March 3, 2025

కుప్పం : చికెన్ పట్ల అపోహలు వద్దు : ఎమ్మెల్సీ

image

చికెన్ పట్ల సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం సాయంత్రం చికెన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు దొరుకుతుందని, అపోహలను పక్కనపెట్టి చికెన్ తినొచ్చని అన్నారు.

News March 3, 2025

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

image

శాంతిపురం (M) మఠం వద్ద శనివారం బైకుపై లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో <<15621064>>మృతుల సంఖ్య మూడుకు<<>> చేరింది. బైరెడ్డిపల్లె (M) మూగనపల్లికి చెందిన తల్లి కొడుకు తులసమ్మ, రవితేజ అక్కడికక్కడే మృతి చెందగా మరో కొడుకు పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో మూగనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 2, 2025

చిత్తూరు జిల్లాలో 96% పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికారులు 96 శాతం పంపిణీ చేశారు. 2,64,899 మంది లబ్ధిదారులకుగాను 2,54,375 మందికి (96.03) పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీడి నెల్లూరులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. 

News March 2, 2025

2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు: CM

image

చిత్తూరు జిల్లాలో త్వరలోనే 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు CM చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం GDనెల్లూరులో పర్యటించిన ఆయన.. NTR జలాశాయంతోపాటూ ఇక్కడే బాలుర గురుకులాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మామిడి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు CM తెలిపారు. వాటితో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

News March 2, 2025

కుప్పం టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎత్తివేత

image

కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ పెట్టిన ఆంక్షలు ఎత్తివేసినట్లు పీఐసీ ఛైర్మన్ బ్రహ్మానందరెడ్డి, బ్యాంకు మేనేజర్ శివకృష్ణ పేర్కొన్నారు. ఇకపై బ్యాంకులో మోర్టగేజ్, గోల్డ్, హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మార్చి తర్వాత షేర్ హోల్డర్లకు చెల్లించాల్సిన డిపెండెంట్లు సైతం చెల్లిస్తామని, బ్యాంకు పరిధిలో పేరుకుపోయిన సుమారు రూ.3 కోట్ల బకాయిలను రికవరీ చేసినట్లు వారు తెలిపారు.

News March 2, 2025

పలమనేరు: టీడీపీ MPTC రాజీనామా

image

పలమనేరు రూరల్ పరిధిలోని కొలమాసనపల్లి సెగ్మెంట్‌-2 టీడీపీ ఎంపీటీసీ లక్ష్మీ నారాయణ తన పదవికి రాజీనామా చేశారు. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన కొలమాసనపల్లి సెగ్మెంట్‌-2 నుంచి పోటీ చేసి గెలుపొందారు. బాగా చదువుకున్న వ్యక్తి కావడంతో లక్ష్మీ నారాయణను గెలిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు ఆయన రాజీనామాను ఎంపీడీవో ఖాదర్ బాషాకు అందజేశారు.

News March 2, 2025

పలమనేరు PS కు హాజరైన మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్

image

పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ శనివారం సీఐ నరసింహా రాజు ముందు హాజరయ్యారు.  క్వారీ కేసుకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు మేరకు కండిషన్ బెయిల్ కోసం ఆయన ప్రతి శనివారం పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంది. ఆయన వస్తారని తెలుసుకొని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విచ్చేశారు. కొద్దిసేపు నాయకులతో మాట్లాడి తిరిగి సొంత గ్రామానికి తిరిగి వెళ్లారు.