Chittoor

News March 1, 2025

నేడు GD నెల్లూరు రానున్న CM

image

CM చంద్రబాబు నేడు(శనివారం) చిత్తూరు జిల్లా GD నెల్లూరులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11.50కు రామానాయుడు పల్లెకు రానున్న ఆయన మ.1 నుంచి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం 3.30కు తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News March 1, 2025

ప్రభాకర్ సేవలను కొనియాడిన చిత్తూరు కలెక్టర్

image

జిల్లా పశుసంవర్ధకశాఖలో ఎన్నో సంవత్సరాల పాటు పనిచేస్తూ మూగజీవాలు, రైతులకు డాక్టర్ ప్రభాకర్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రశంసించారు. జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభాకర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో మిట్టూరులోని ఎన్పీసీ పెవిలియన్‌లో జరిగిన ప్రభాకర్ పదవీ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రభాకర్ సేవలను కొనియాడారు.

News February 28, 2025

చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ రోడ్డు ప్రమాదంలో MLA థామస్ బాబాయ్ మృతి
✒ కుప్పం: అంధ యువతి పెళ్లికి CM చంద్రబాబు రూ.5 లక్షల సాయం
✒ కత్తెరపల్లి ZP ఉన్నత పాఠశాలలో సైన్స్ డే వేడుకలు
✒ SRపురం: బెల్లంపాకంలో పడి వ్యక్తి మృతి
✒ పలమనేరులో ఏడుగురు అరెస్ట్
✒ కుప్పంలోని హోటళ్లలో అధికారుల తనిఖీలు

News February 28, 2025

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: జిల్లా ఎస్పీ

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. జిల్లాలో సీఎం పర్యటన సందర్బంగా ట్రయిల్ రన్ నిర్వహించారు. మార్చి నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు విధులలో పాల్గొనే పోలీసు అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

News February 28, 2025

గుడిపల్లి : మామిడి తోటలో ఏమేం దొరికాయి అంటే..?

image

ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మామిడి తోటలో దొరకడం కలకలం రేపుతోంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రం తీసుకునే రిజిస్టర్లతో పాటు క్వశ్చన్ పేపర్లను భద్రపరిచిన లాకర్ కీ, ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్, కస్టోడియల్ అధికారి వద్ద ఉండాల్సిన రెండు రిజిస్టర్లు, ప్రశ్నాపత్రం కోడ్ రిసీవింగ్‌కు సంబంధించిన అధికారిక ఫోన్, ఎగ్జామ్‌కు సంబంధించిన పలు పేపర్లు పడి ఉన్నట్లు తెలుస్తోంది.

News February 28, 2025

రోడ్డు ప్రమాదంలో చిత్తూరు వాసి దుర్మరణం

image

గూడూరు ఆదిశంకర College వద్ద నిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని TATA AC ఢీకొనడంతో చిత్తూరుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 28, 2025

చిత్తూరు- పుత్తూరు హైవేపై ప్రమాదం.. MLA బాబాయ్ దుర్మరణం

image

కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన చొక్కలింగం(70) నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెదురుకుప్పం మండలం చవటగుంటకు చెందిన గోవర్ధన్ బైకుపై కార్వేటినగరం నుంచి పళ్లిపట్టుకు వెళుతూ చొక్కలింగంను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో చొక్కలింగం అక్కడికక్కడే మృతి చెందగా.. గోవర్ధన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చిన్నాన్నగా స్థానికులు గుర్తించారు.

News February 28, 2025

చిత్తూరు: జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు పెంపు

image

జిల్లాలో ఫిబ్రవరి 28 తో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్‌ను పొడిగిస్తూ సమాచార పౌర సంబంధ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. మార్చి 1 నుంచి మే 31 వరకు లేక కొత్త కార్డులు మంజూరు చేయడం ఏది ముందు జరిగితే అప్పటివరకు కాల పరిమితిని పొడిగించినట్లు ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28 నాటికి అక్రిడేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందన్నారు.

News February 27, 2025

జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

image

మార్చి 1న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆయన గురువారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన ముగిసే వరకు ఎలాంటి అలసత్వం వహించకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైయుజన్ నిర్వహించి అధికారులు చేపట్టాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు.

News February 27, 2025

ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న చిత్తూరు కలెక్టర్

image

గంగాధర నెల్లూరులోని ఓ దంపతులకు రక్షిత, హేమశ్రీ అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కొన్ని అనివార్య కారణాలతో తల్లిదండ్రులు విడిపోయి వారి జీవితాలను మరొకరితో పంచుకున్నారు. ఈ కారణంగా అనాథలైన రక్షిత, హేమశ్రీ బాగోగులు వారి తాతయ్య చూసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్.. ఇద్దరి పిల్లల ఉన్నత విద్య బాధ్యత తానే తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో పలువురు కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.