India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దమండ్యం మండలం కలిచర్లలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. సోమవారం ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సినీ నటుడు సాయి కుమార్ పాల్గొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి పాల్గొన్నారు.
తిరుపతి నగరంలోని 32వ డివిజన్లో ఉమ్మడి అభ్యర్థి తరఫున ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో సీఎం జగన్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు. కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు అన్నదమ్ముల్లా సమిష్ఠిగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభలో విజయానంద రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు. మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు మాటమీద నిలబడే వ్యక్తి కాదని, 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన హామీలను కాపీ కొట్టి ఆంధ్ర రాష్ట్రంలో చేస్తానని చెప్తున్నాడన్నారు.
ప్రభుత్వ సలహాదారు ఎం జ్ఞానేంద్ర రెడ్డి అన్న నరసింహారెడ్డి (85) సోమవారం మృతి చెందారు. వెల్లూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన పార్థివ దేహం బుధవారం ఉదయం నుంచి పెనుమూరు మండలం పులికల్లులో ఉంచుతారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన పెద్ద కుమారుడు దయాసాగర్ రెడ్డి జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెండో కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి వ్యాపార వేత్త.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం తిరుపతిలో పర్యటించనున్నట్టు కూటమి నేతలు తెలిపారు. లీలామహల్ సర్కిల్ నుంచి దేవేంద్ర థియేటర్, తిలక్ రోడ్డు మీదుగా నాలుగు కాళ్ల మండపం వరకు రోడ్ షో జరగనుంది. నాలుగు కాళ్ల మండపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ ప్రసంగించనున్నారు. నేతలు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ వివరాలను అధికారులు ప్రకటించారు. పుంగనూరు 76.3%, నగరి 83%, జీడి నెల్లూరు 79.5%, చిత్తూరు 65%, పూతలపట్టు 75.4% పలమనేరు 71.3% కుప్పం 79. 2 శాతం నమోదు అయినట్టు వారు చెప్పారు. మొత్తం జిల్లాలో 74.3% పోలింగ్ నమోదు అయినట్టు వారు చెప్పారు.
పాపాల పెద్దిరెడ్డీ! నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ‘తంబళ్లపల్లి(మం) కూటగోళ్లపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి సమక్షంలో తాగునీరు కోసం నిలదీసిందని నిండు గర్భిణిపై పెద్దిరెడ్డి ముఠాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ పాపాలకు తగిన శిక్ష మే 13న జనం విధిస్తారు పెద్దిరెడ్డీ’ అని ట్విట్ చేశారు.
పోస్టల్ బ్యాలెట్ వివరాలను అధికారులు ప్రకటించారు. పుంగనూరు 76.3%, నగరి 83%, జీడి నెల్లూరు 79.5%, చిత్తూరు 65%, పూతలపట్టు 75.4% పలమనేరు 71.3% కుప్పం 79. 2 శాతం నమోదు అయినట్టు వారు చెప్పారు. మొత్తం జిల్లాలో 74.3% పోలింగ్ నమోదు అయినట్టు వారు చెప్పారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసినట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరు పట్టణంలో పలు వర్గాలతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. కరోనా సమయంలో సొంత నిధులతో ఆక్సిజన్ అందించినట్టు చెప్పారు. గతంలో కర్ణాటక పోలీసులు ఇక్కడి వ్యాపారులను భయపెట్టే వారని.. వారితో చర్చించి అలాంటి ఇబ్బంది లేకుండా చూసినట్లు తెలిపారు. మోదీ ప్రచారానికి వచ్చినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు.
తిరుపతి: జనసేన – టిడిపి అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈనెల 7న తిరుపతికి విచ్చేయనున్నారు. తిరుపతిలో వారు ప్రచారం నిర్వహించి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. బహిరంగ సభను మూడు పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.